-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
రాజమహేంద్రవరం, జనవరి 22: ‘వడ్డించేవారు మనవారైతే’ అన్న చందాన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో సుమారు రూ.60 కోట్ల విలువైన జైళ్ల శాఖ భూమి పర్యాటక ప్రాజెక్టు పేరుతో ప్రైవేటు సంస్థకు అప్పగించేశారు. 33 ఏళ్ల లీజు పేరిట ఈ సంస్థ చేతికి స్థలాన్ని అప్పగించడంతో చకచకా నిర్మాణ పనులు సాగిపోతున్నాయి. ఎంతో విలువైన, కీలకమైన ఈ స్థలం ఇలా ప్రైవేటు చేతికి చిక్కడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
విశాఖపట్నం, జనవరి 22: ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా విద్యుత్తోనే సాధ్యపడుతుందని, అటువంటి నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ను ఏపీలోనే ముఖ్యమంత్రి చొరవతో ఇవ్వగలుగుతున్నామని విద్యుత్ శాఖామంత్రి కిమిడి కళా వెంకట్రావు అన్నారు. ఏపీ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం 12వ రాష్ట్ర మహాసభ ఏయు సీఆర్ కాన్వొకేషన్ హాల్లో సోమవారం నిర్వహించారు.
అమరావతి, జనవరి 22: దావోస్ వెళ్తూ కూడా ధాన్యం సేకరణపై ముఖ్యమంత్రి మార్గదర్శకాలు ఇచ్చారని, ప్రతి రైతుకు మద్దతు ధర లభించేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్కుమార్ ఆదేశించారు. సోమవారం వ్యవసాయం, నీరు-మీరు పురోగతిపై వివిధ జిల్లాల కలెక్టర్లు, శాఖాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ధాన్యం సేకరణపై చర్చ జరిగిన విషయం ప్రస్తావించారు.
గుంటూరు, జనవరి 22: పది లక్షల రూపాయల అప్పుకోసం ఆత్మహత్యలు చేసుకుంటారా.. మీ కుటుంబాలు నష్టపోవట్లేదా.. పారిశ్రామిక వేత్తలు లక్షల కోట్లు ఎగ్గొడుతున్నారు... పంటలు నష్టపోయినా.. ధరలు పతనమైనా ప్రభుత్వం ఆదుకుంటోంది కదా.. చిన్న అప్పులకు కూడా ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరం.. రైతులు ఆత్మస్థయిర్యాన్ని వీడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ, జనవరి 22: మైనింగ్ కేసులో లభించిన బెయిల్పై ఉన్న షరతులను సడలించాలని కోరుతూ గాలి జనార్దన్ రెడ్డి చేసుకున్న అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. జనార్దన రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్ జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఆశోక్భూషన్లతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. బెయిల్ నిబంధనలను సడలించేందుకు ధర్మాసనం నిరాకరించింది.
న్యూఢిల్లీ, జనవరి 22: కొల్లేరు అభయారణ్య పరిధిలోని మత్స్యకారులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారించాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్థన్కు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. సోమవారం కేంద్ర మంత్రి హర్షవర్థన్తో రాష్ట్ర మంత్రి కామినేని ఢిల్లీలో సమావేమయ్యారు. కొల్లేరు భూముల వ్యవహారానికి సంబంధించిన సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
మక్కువ, జనవరి 22: విజయనగరం జిల్లా మక్కువ మండలంలోని శంబర శ్రీ పోలమాంబ అమ్మవారి జాతరకు సంబంధించి సోమవారం తొలేళ్ల ఉత్సవం కన్నుల పండువగా జరిగింది. మంగళవారం నిర్వహించే సిరిమానోత్సవానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్వతీపురం ఆర్డీవో సుదర్శనదొర పర్యవేక్షణలో ఆదివారం రాత్రి అమ్మవారి ఘటాలను ఉరేగించాక సోమవారం రాత్రి తొలేళ్ల ఉత్సవాన్ని నిర్వహించారు.
విజయవాడ (ఇంద్రకీలాద్రి) జనవరి 22: శ్రీపంచమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగజ్జనని శ్రీ కనకదుర్గమ్మ సోమవారం భక్తులకు శ్రీ సరస్వతీ దేవి దివ్య అలంకారంతో దివ్య దర్శనం మిచ్చింది. ఈచదువుల తల్లిఆశీస్సులను పొందటానికి స్కూళ్లు, కళాశాలలకు చెందిన విద్యార్థులు వేకువ జామునుంచే ఇంద్రకీలాద్రికి పోటెత్తారు.
విజయవాడ, జనవరి 22: చంద్రన్న సంక్రాంతి కానుకపై చౌకడిపో డీలర్ల సమాఖ్య చేసిన పోరాటాలు ఫలించాయి. గడచిన రెండేళ్లుగా రంజాన్ తోఫా, క్రిస్మస్, సంక్రాంతి కానుక కిట్లపై ఒక్కో కార్డుకు కేవలం ఐదు రూపాయలు మాత్రమే డీలర్లకు కమీషన్ లభించేది. అయితే ఆ కమీషన్ రవాణా ఖర్చులకే సరిపోవటం లేదంటూ డీలర్లు ఆందోళన చేస్తూ వచ్చారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం కమీషన్ పెంచింది.
విజయవాడ (క్రైం), జనవరి 22: రాష్ట్రంలో పని చేస్తున్న 12మంది ఐపీఎస్ అధికారులతోపాటు, కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో ఉన్న మరో ఐదుగురు ఐఏఎస్లకు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో ఆరుగురు ఎస్పీలకు సీనియర్ అధికారులుగా, నలుగురు డీఐజీలకు ఐజీలుగా, మరో ఇద్దరు సీనియర్లకు డీఐజీలుగా ప్రమోషన్ లభించింది.