S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/19/2017 - 02:08

విశాఖపట్నం, సెప్టెంబర్ 18: గిరిజన సహకార సంస్థ (జిసిసి) ఉద్యోగులపై గిరిజన సంక్షేమ శాఖామంత్రి నక్కా ఆనంద్‌బాబు వరాలజల్లు కురిపించారు. జిసిసి 60 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా నగరంలో వుడా చిల్డ్రన్ థియేటర్‌లో సోమవారం నిర్వహించిన గిరిజన కుటుంబాల ఆత్మీయ సభకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

09/19/2017 - 02:07

శ్రీశైలం, సెప్టెంబర్ 18: ఆర్థిక సమస్యలతో సతమతమైన ఓ తల్లి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి శ్రీశైలంలోని పాతాళగంగ వద్ద కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతులను కర్నాటకకు చెందిన జగ్గదేవి (26), ఉషాబాయి (4), లక్ష్మి (2)గా గుర్తించారు. సోమవారం మృతదేహాలు నీళ్లలో తేలడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

09/19/2017 - 02:06

శ్రీశైలం, సెప్టెంబర్ 18: శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి సోమవారం కూడా వరద కొనసాగింది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా సోమవారం 854.50 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టిఎంసిలు కాగా ప్రస్తుతం 90.55 టిఎంసిల నీరు నిల్వ ఉంది. జూరాల నుండి 1,67,270 క్యూసెక్కులు, రోజా నుంచి 8,958 క్యూసెక్కులు కలిపి మొత్తం 1,76,228 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి చేరుకుంది.

09/19/2017 - 02:06

గుర్రంకొండ, సెప్టెంబర్ 18: కార్యకర్తల అభీష్టం మేరకు టిడిపిలో చేరుతామని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమారరెడ్డి సోదరుడు కిశోర్‌కుమార్‌రెడ్డి అన్నారు. తమ కుటుంబం 30 సంవత్సరాలుగా రాజకీయాల్లోకి వచ్చి పార్టీకతీతంగా ప్రజా సేవ చేశామని అన్నారు. తండ్రి, తరువాత అన్న ముఖ్యమంత్రిగా ఎదిగి నియోజక వర్గానికి దాదాపు రూ.2000 కోట్లు అభివృద్ధి పనులు చేశారన్నారు.

09/19/2017 - 02:05

కోరుకొండ, సెప్టెంబర్ 18: విమానంలో టాయ్‌లెట్ తలుపు అనుకుని పొరపాటుగా పైలెట్ ఉండే కాక్‌పిట్ తలుపును నార్వే దేశస్థుడొకరు తాకడం సోమవారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం విమానాశ్రయంలో గందరగోళం సృష్టించింది. హైజాకర్ అనే సందేహంతో కొద్దిసేపు అతడిని అదుపులోకి తీసుకుని, విచారణ అనంతరం వదిలిపెట్టారు. నార్వే దేశానికి చెందిన విచిత్ టామ్ రికాడ్ సోమవారం హైదరాబాద్ వచ్చాడు.

09/19/2017 - 01:00

ఒంగోలు, సెప్టెంబర్ 18: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అవసరమైతే తమ పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే తమ ఎంపి పదవులకు రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తిరుపతి పార్లమెంటు సభ్యుడు వరప్రసాద్ వెల్లడించారు. సోమవారం ఒంగోలులో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీయే గట్టిగా పోరాడుతోందని గుర్తుచేశారు.

09/19/2017 - 00:59

గుంటూరు, సెప్టెంబర్ 18: సదావర్తి భూములపై వైసిపి చేస్తున్న దుష్ప్రచారం మానుకోకుంటే ప్రజలు తగిన రీతిలో బుద్ధిచెప్తారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, టిడిపి నేత లంకా దినకర్ హెచ్చరించారు.

09/19/2017 - 00:59

కర్నూలు, సెప్టెంబర్ 18:నోబెల్ పురస్కార గ్రహీత కైలాష్ సత్యార్థి బాలల సంరక్షణ కోసం మంగళవారం కర్నూలులో ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాల్గొననున్నారు. ‘సురక్షిత బాల్యం-సురక్షిత భారతదేశం’ నినాదంతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ కైలాష్ సత్యార్థి భారతదేశ యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

09/19/2017 - 00:58

అమరావతి, సెప్టెంబర్ 18: అన్నాడిఎంకెకు చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై వేటు వేస్తూ తమిళనాడు స్పీకర్ తీసుకున్న తాజా నిర్ణయ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపైనా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

09/19/2017 - 00:57

మార్కాపురం, సెప్టెంబర్ 18: ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబుకు రెండేళ్లు జైలుశిక్ష విధిస్తూ మార్కాపురం ఫస్ట్‌క్లాస్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ పఠాన్ సియాజ్‌ఖాన్ తీర్పు చెప్పారు. 2008 ఆగస్టు 11వ తేదిన ఓ భూ వివాదంలో అప్పటి గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు పట్టణానికి చెందిన గోళ్ల సురేంద్రనాథ్ ఇంటికి వచ్చి మహిళలను దుర్భాషలాడారంటూ పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Pages