S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/18/2017 - 04:25

విజయవాడ, సెప్టెంబర్ 17: జనాభాలో 10 శాతానికి పైగా ఉన్న వయోవృద్ధులను స్ర్తి, శిశు సంక్షేమ, విభిన్న ప్రతిభావంతులు, వృద్ధుల సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి తొలగించి ప్రత్యేక కార్పొరేషన్, కమిషన్, లేదా ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఆదివారం నాడిక్కడ హోటల్ ఐలాపురంలో జరిగిన సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర సదస్సు డిమాండ్ చేసింది.

09/18/2017 - 02:53

విజయనగరం, సెప్టెంబర్ 17: రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు జెఎసి కృషి చేస్తోందని ఎపిఎన్‌జిఒ రాష్ట్ర అధ్యక్షుడు, జెఎసి చైర్మన్ పి.అశోక్‌బాబు అన్నారు. ఆదివారం ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు.

09/18/2017 - 02:51

విజయవాడ, సెప్టెంబర్ 17: జనాభా నిష్పత్తి ప్రకారం రాష్ట్ర విభజన అనంతరం ఏపిఎస్ ఆర్టీసీ ఆదిలోనే 2వేల 600కోట్ల రూపాయలకు పైగా అప్పులను తన నెత్తిన వేసుకోవాల్సి వచ్చింది. తాజాగా 3వేల 600కోట్ల రూపాయల నష్టాలతో దినదిన గండం.. నూరేళ్ల ఆయుష్షు అన్నట్టు ముందుకు సాగుతోంది.

09/18/2017 - 02:49

అనంతపురం, సెప్టెంబర్ 17 : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కర సేవ చేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు. అనంతపురం నగరంలోని సిపిఐ కార్యాలయంలో ఆదివారం నారాయణ ఆ పార్టీ ఏపి రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

09/18/2017 - 00:53

కావలి (జలదంకి), సెప్టెంబర్ 17: సమాజంలో నానాటికీ వికృత పోకడలు భరించలేని స్థాయకి చేరుకున్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్, రాష్ట్ర రచయిత్రుల సంఘం గౌరవాధ్యక్షురాలు నన్నపనేని రాజకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ సినీనటుడు చంద్రమోహన్ సతీమణి, ప్రముఖ రచయిత్రి జలంధర చంద్రమోహన్‌ను కావలి పట్టణానికి చెందిన తెలుగు సాహితీ వేదిక జీవనసాఫల్య పురస్కారంతో సత్కరించింది.

09/18/2017 - 00:52

విజయవాడ, సెప్టెంబర్ 17: ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తుండటం వారి దివాలాకోరుతనానికి నిదర్శనమని రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్‌పర్సన్ పంచుమర్తి అనూరాధ ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు.

09/18/2017 - 00:52

విజయవాడ, సెప్టెంబర్ 17: నంద్యాల, కాకినాడ ఉప ఎన్నికల ఫలితాలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రతిపక్ష వైసిపి నిరుద్యోగ భృతి, కాంట్రాక్టు లెక్చరర్ల అంశంపై నిరాధార ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటోందని తెలుగునాడు విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మం చౌదరి విమర్శించారు.

09/18/2017 - 00:51

అనంతపురం, సెప్టెంబర్ 17 : కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో దశాబ్దాలుగా బలపడని బిజెపి రానున్న ఎన్నికల సమయానికి బలోపేతం కావడానికి పావులు కదుపుతోంది. రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉంటూ కేంద్రంతో సఖ్యతగా ఉంటున్న తెలుగుదేశం పార్టీతో 2019 ఎన్నికల్లో పొత్తుపెట్టుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

09/17/2017 - 04:31

ఒంగోలు, సెప్టెంబర్ 16: రాష్ట్రంలో 2019 సంవత్సరంలో జరగనున్న సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు, సిబ్బంది సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని సిపిఒ సమావేశ మందిరంలో ఇఆర్‌ఒలు, ఎఇఆర్‌ఒలతో స్పెషల్ సమ్మరి రివిజన్, ప్రీ రివిజన్ కార్యకలాపాలపై ఆయన సమీక్షించారు.

09/17/2017 - 04:30

సంజామల, సెప్టెంబర్ 16: ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వాగులో పడింది. ఈ సంఘటనలో ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా సంజామల మండలంలో శనివారం జరిగింది. ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మండలంలోని పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శనివారం మధ్యాహ్నం కోవెలకుంట్ల నుంచి తాడిపత్రికి బయలుదేరిన ఆర్టీసీ బస్సు (నెం.

Pages