S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/15/2017 - 03:07

ఏలూరు, సెప్టెంబర్ 14: పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలి వద్ద అదుపుతప్పిన స్కార్పియో వాహనం మురుగు కాలువలోకి దూసుకుపోయి, బోల్తాపడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన రెండేళ్ల చిన్నారి సహా ఆరుగురు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు.

09/15/2017 - 03:05

తుళ్లూరు/మంగళగిరి, సెప్టెంబర్ 14: రాజధాని ప్రాంతంలో ప్రపంచబ్యాంకు బృందం పర్యటన రెండోరోజు కూడా కొనసాగింది. రాజధాని అమరావతి భూ సేకరణపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ప్రపంచబ్యాంకు ప్రతినిధులు స్వయంగా పర్యటించి వివరాలు సేకరిస్తున్నారు. తొలిరోజు గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి మండలాల్లో పర్యటించిన ప్రపంచబ్యాంకు ప్రతినిధులు రెండోరోజు గురువారం మంగళగిరి, తుళ్లూరు మండలాల్లో పర్యటించారు.

09/15/2017 - 03:03

విజయవాడ, సెప్టెంబర్ 14: రాష్ట్రంలో భూగర్భ జలాలను పెంచడానికి వివిధ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై తగిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపినట్లయితే వాటిని అమలుచేసి భూగర్భ జల వనరులను పెంచటానికి తగిన చర్యలు తీసుకుంటామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు.

09/15/2017 - 03:01

కాకినాడ, సెప్టెంబర్ 14: కాకినాడ నగర పాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్‌ల ఎన్నిక ఈ నెల 16వ తేదీన కాకినాడ కార్పొరేషన్‌లో జరుగనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్‌ను అనుసరించి మేయర్, డిప్యూటీ మేయర్లను కార్పొరేటర్లు ఎన్నుకుంటారు. ఎన్నికల అధికారులు ఇందుకు అవసరమైన ఏర్పాట్లుచేస్తున్నారు. ఈ నెల 1వ తేదీన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. కార్పొరేషన్‌లో మొత్తం 50 డివిజన్లున్నాయి.

09/15/2017 - 03:00

అనంతపురం అర్బన్, సెప్టెంబర్ 14: కుటుంబ గొడవల నేపధ్యంలో ఓ వ్యక్తి మెడపై కత్తితో దాడి చేశారు. మెడపై గుచ్చుకున్న కత్తితో బాధితుడు ఆసుపత్రికి చేరుకున్నాడు. అనంతపురంలో గురువారం ఈ సంఘటన జరిగింది. ధర్మవరానికి చెందిన రాంప్రసాద్, కళ్యాణ విడాకుల కోసం కోర్టులో కేసు వేశారు.

09/15/2017 - 02:58

కడియం, సెప్టెంబర్ 14: మొక్కలను నేరుగా నర్సరీ రైతుల నుంచి వినియోగదారులు కొనుగోలు చేసుకునేలా ప్రత్యేక యాప్‌ను రూపొందించామని ఆంధ్రప్రదేశ్ అర్బన్ గ్రీనరీస్ అండ్ బ్యూటిఫికేషన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎపియుజిడిఎ) మేనేజింగ్ డైరెక్టర్ చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కడియం జిఎన్నార్ కనె్వన్షన్ హాలులో ‘గ్రీన్ ఎపి యాప్’ను గురువారం ఆయన ప్రారంభించారు.

09/15/2017 - 02:56

విశాఖపట్నం, సెప్టెంబర్ 14: ఎపి ఈపిడిసిఎల్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా హెచ్‌వై దొర నియమితులయ్యారు. డిస్కం సిఎండిగా దొరను నియమిస్తూ ఇంధన శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డిస్కం సిఎండిగా ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరిస్తారు. దొర 1978లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా ఎపిఎస్‌ఇబిలో చేరారు. తరువాత 1991లో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్‌గా, 2001 జూలైలో డివిజనల్ ఇంజనీర్‌గా పదోన్నతి పొందారు.

09/15/2017 - 02:55

డోన్, సెప్టెంబర్ 14: కర్నూలు జిల్లాలో భారీ దోపిడీ జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారికి చెందిన రూ.5.7 కోట్ల నగదును మంగళవారం అర్ధరాత్రి రాత్రి కర్నూలు జిల్లా డోన్ మండలం ప్యాపిలి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు గురువారం కర్నూలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. జిల్లాలో సంచలనం రేపిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

09/15/2017 - 02:54

విశాఖపట్నం, సెప్టెంబర్ 14: విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ నెట్‌వర్క్ కుప్పకూలింది. ఈ ఘటన జరిగి 20 రోజులైనా యాజమాన్యం గోప్యంగా ఉంచింది. సుమారు 20 రోజుల కిందట పోర్టు నెట్‌వర్క్ స్తంభించింది. ఇప్పటికే దేశంలోని మేజర్ పోర్టుల్లో భద్రతను పెంచుతున్న నేపథ్యంలో విశాఖ మేజర్ పోర్టులో నెట్‌వర్క్ కుప్పకూలడం పట్ల అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

09/15/2017 - 02:53

అమరావతి, సెప్టెంబర్ 14: సుస్థిర సమ్మిళిత వృద్ధి, అన్ని రంగాలలో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యాలుగా శుక్రవారం సచివాలయంలో శాఖాధిపతుల సమావేశాన్ని నిర్వహించనున్నారు. ప్రతి త్రైమాసానికి ఒకసారి 13 జిల్లాల కలెక్టర్లతో రెండు రోజులపాటు సదస్సును నిర్వహిస్తున్న ప్రభుత్వం దానికి కొన్ని రోజుల ముందే శాఖాధిపతుల సమావేశాన్ని జరిపి ప్రభుత్వ ఉద్దేశాలను, లక్ష్యాలను వివరించడం రివాజు.

Pages