S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/15/2017 - 01:52

విజయవాడ, సెప్టెంబర్ 14: ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపల్ స్కూళ్లలో గత రెండు సంవత్సరాలుగా అమలుచేస్తున్న ఫౌండేషన్ కోర్సుపై అధ్యయనానికి తమిళనాడు ప్రభుత్వ బృందం అమరావతికి వచ్చి, పురపాలక మంత్రి నారాయణను కలిసి చర్చించింది. అలాగే మున్సిపల్ స్కూళ్లను సందర్శించింది. పిల్లలతో, వారి తల్లిదండ్రులతో, ఉపాధ్యాయులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంది.

09/15/2017 - 01:52

విజయవాడ, సెప్టెంబర్ 14: అగ్ని ప్రమాదాల సమయంలోనే కాకుండా, ఇతరత్రా ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ క్రీయాశీలక పాత్ర వహించే అగ్నిమాపక శాఖలోని ఖాళీ పోస్టుల భర్తీ పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉదాశీన వైఖరి అవలంబిస్తోం ది. మంజూరైన పోస్టులను కూడా భర్తీ చేయటం లేదు.

09/15/2017 - 01:51

హైదరాబాద్, సెప్టెంబర్ 14: మూడున్నరేళ్లయినా రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇంకా డిజైన్లపై తుది నిర్ణయం తీసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని వైకాపా అధికార ప్రతినిధి పార్థసారథి ధ్వజమెత్తారు. గురువారం ఇక్కడ విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు శంకు స్ధాపనలు, ప్రారంభోత్సవాలు, హారతులు, అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.

09/15/2017 - 01:45

విజయవాడ, సెప్టెంబర్ 14: శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదిపై నేరడి బ్యారేజీ నిర్మాణానికి వంశధార ట్రిబ్యునల్ అంగీకరిస్తూ తీర్పు ఇవ్వడం శుభపరిణామంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డు అభివర్ణించారు. ఈ తీర్పు వల్ల అదనంగా 50 టిఎంసిల నీటిని వాడుకునే అవకాశం రాష్ట్రానికి కలిగిందన్నారు. చాలా దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్య పరిష్కారం కావడంతో శ్రీకాకుళం జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు.

09/14/2017 - 01:42

విజయవాడ, సెప్టెంబర్ 13: ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల ద్వారా అందించే వైద్య సేవల వివరాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, చికిత్స కోసం ఆయా కేంద్రాలకు ప్రజలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా.కామినేని శ్రీనివాస్ ఆదేశించారు.

09/14/2017 - 01:42

విజయవాడ, సెప్టెంబర్ 13: తెలుగువారి ఆత్మగౌరవానికి చిహ్నమైన నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిని అడ్డుకుంటున్న తల్లి, పిల్ల కాంగ్రెస్ నేతలు చరిత్రలో ద్రోహులుగా నిలిచిపోతారని మంత్రి నక్కా ఆనంద్‌బాబు మండిపడ్డారు. ప్రపంచ బ్యాంకుకు లేఖల పేరుతో లోటస్‌పాండ్ కేంద్రంగా ప్రజా రాజధాని అమరావతిని అడ్డుకునేందుకు ప్రతిపక్ష నేతలు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

09/13/2017 - 04:20

ప్రత్తిపాడు, సెప్టెంబర్ 12: ఇచ్చిన హామీలు అమలుచేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న ఇబ్బందేమిటో తెలియజేయాలని, అమలుచేసే ఉద్దేశ్యం లేనప్పుడు అసలు హామీలు ఎందుకు ఇవ్వాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. డిసెంబర్ 6వ తేదీ అంబేద్కర్ వర్థంతి రోజులోగా కాపులకు బిసి రిజర్వేషన్ అమలుచేయాలని, ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకుంటామని స్పష్టం చేశారు.

09/13/2017 - 04:20

ఒంగోలు, సెప్టెంబర్ 12: రానున్న 2019ఎన్నికల నాటికి తెలుగుదేశం ప్రభుత్వంతో పొత్తుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయ. భారతీయ జనతాపార్టీ రాష్టప్రదాధికారుల సమావేశం ఒంగోలులోని పద్మావతి కళ్యాణ మండపంలో మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి జిల్లాపార్టీ అధ్యక్షుడు పులి వెంకటకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ముఖ్యనేతలందరు చర్చించారు.

09/13/2017 - 02:37

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 12: సంఘ సంస్కరణల పురిటిగడ్డ రాజమహేంద్రవరానికి ప్రాచీన నగర హోదా సాధించేందుకు కసరత్తు జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల రాజమహేంద్రవరం నగరంలో పర్యటించిన సందర్భంలో ఈ మేరకు ప్రకటించడంతో ఈ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం 2015లో ‘హృదయ్’ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది.

09/13/2017 - 02:34

విజయనగరం, సెప్టెంబర్ 12: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్భ్రావృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 67 ఏళ్లలో కూడా 24 ఏళ్ల కుర్రాడిలా కష్టపడుతున్నారని, అన్ని స్థానాలూ గెలిపించుకొని ఆయన కష్టానికి రుణం తీర్చుకోవాలన్నారు.

Pages