-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, సెప్టెంబర్ 12: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) దినేష్కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
ఒంగోలు, సెప్టెంబర్ 12: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను త్వరలో భర్తీచేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. మంగళవారం స్థానిక సిపివో చాంబర్లో వైద్యాధికారులతో సీజనల్ వ్యాధులపై మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో పలు జిల్లాల్లో డెంగ్యూ జ్వరాలు ఎక్కువుగా నమోదవుతున్నాయన్నారు.
పద్మనాభం, సెప్టెంబర్ 12: మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహిస్తుండగా పిడుగు పడి ఇద్దరు మృత్యువాత పడ్డారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలం అనంతవరంలో ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి వివరాలు ఆరా తీశారు. వారు అందించిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బి.గుర్రమ్మ మంగళవారం ఉదయం చనిపోయింది.
విశాఖపట్నం, సెప్టెంబర్ 12: ఇండియన్ నేవీ మిడ్ ఇయర్ రీఫిట్ రివ్యూ (ఎంవైఆర్ఆర్), మిడ్ ఇయర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రివ్యూ (ఎంవైఐఆర్) విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగింది. రెండు రోజులపాటు జరిగే ఈ సమీక్షా సమావేశాలు చీఫ్ ఆఫ్ నేవల్ మెటీరియల్స్ వైస్ అడ్మిరల్ జిఎస్ పబ్బీ అధ్యక్షతన జరగనున్నాయి. నేవీకి చేందిన యుద్ధ నౌకలు, సబ్మెరైన్ల రీ ఫిట్ గురించి ఇందులో చర్చించారు.
విశాఖపట్నం, సెప్టెంబర్ 12: విశాఖ వేదికగా మరో అంతర్జాతీయ సదస్సు నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్లో యునెస్కో, మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ పీస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ (జిఐఇపి) సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ సదస్సును నిర్వహించనుందని మావన వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో మంగళవారం వెల్లడించారు.
విజయవాడ, సెప్టెంబర్ 12: వైశ్యులపై కంచె ఐలయ్య రాసిన పుస్తకం రెండు తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పదంగా మారింది. వైశ్యులు పలు ప్రాంతాల్లో అందోళనకు దిగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పుస్తకంపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ పుస్తకంపై సీరియస్ అయినట్లు సమాచారం. వెలగపూడి సచివాలయంలో డిజిపి సాంబశివరావు మంగళవారం ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.
మదనపల్లె, సెప్టెంబర్ 12: గోదావరి-కృష్ణ జలాల అనుసంధానం, గోదావరి జలాలను కృష్ణ ద్వారా రాయలసీమలో హంద్రీ-నీవా ప్రాజెక్టులను సస్యశ్యామలం చేయడానికి డిసెంబర్ నెలాఖరున ముహూర్తం పెట్టామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డి స్పష్టం చేశారు.
పాడేరు, సెప్టెంబర్ 12: విశాఖ మన్యాన్ని కలుపుతూ జాతీయ రహదారి నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. విశాఖ మన్యంలోని అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడ, హుకుంపేట మండలాల్లో ఆయన మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా మన్యంలోని రహదారుల స్థితిగతులను పరిశీలించారు.
విజయవాడ, సెప్టెంబర్ 12: విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో గ్రామంలో ప్రయోగాత్మకంగా సోలార్ బ్యాటరీ స్టోరేజీ, సోలార్ గ్రిడ్ అనుసంధాన విధానాలను అమలు చేయాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
అమరావతి, సెప్టెంబర్ 11: రాష్ట్ర పర్యాటకశాఖకు మరో అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్ఠాత్మక ఎడ్వంచర్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ను ఉత్తమ సాహస పర్యాటక భారతీయ రాష్ట్రంగా ప్రకటించింది. సాహస క్రీడలు, సాహసోపేతమైన ప్రయాణం వంటి రంగాలను ప్రోత్సహిస్తున్నందుకు గాను రాష్ట్రానికి ఈ అవార్డు లభించిందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్కుమార్ మీనా వివరించారు.