S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/12/2017 - 03:15

విజయవాడ, సెప్టెంబర్ 11: ప్రతిపక్ష వైకాపా తలపెట్టిన ‘వైఎస్‌ఆర్ కుటుంబం’ కార్యక్రమం ఘనంగా ప్రారంభమయింది. తొలిరోజు సోమవారం నాలుగు లక్షల మంది ప్రజలు ‘వైఎస్‌ఆర్ కుటుంబం’లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 912 1091210 నెంబర్‌కు మిస్డ్‌కాల్ ఇవ్వడంతో పాటు వెబ్‌సైట్‌లో లాగిన్ అయి రిజిస్టర్ చేసుకున్నారు. శిక్షణ తీసుకున్న వైఎస్‌ఆర్ సిపి పార్టీ బూత్ కమిటీ సభ్యులు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ వెళ్లారు.

09/12/2017 - 03:14

హైదరాబాద్, సెప్టెంబర్ 11: అగ్రిగోల్డ్ టేకోవర్‌కు తనకు అనుమతి ఇవ్వాలని ఎస్సెల్ గ్రూప్ రాష్ట్ర హైకోర్టును కోరింది. టేకోవర్‌కు అనుమతి ఇస్తే నాలుగు నెలల్లో దానిని స్వాధీనం చేసుకుంటామని ఎస్సెల్ గ్రూప్ పేర్కొంది. హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసులపై సోమవారం విచారణ జరిగినపుడు ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. దీనిపై స్పందించిన కోర్టు, ఎంత నగదును తక్షణం డిపాజిట్ చేయగలరని ఎస్సెల్ గ్రూప్‌ను ప్రశ్నించింది.

09/12/2017 - 03:14

తణుకు, సెప్టెంబర్ 11: రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డిజిపి) నండూరి సాంబశివరావు ప్రయాణిస్తున్న వాహనం సోమవారం ప్రమాదానికి గురయ్యింది. అయితే ఈ ప్రమాదం నుండి డిజిపి సురక్షితంగా బయటపడ్డారు. వివరాలిలావున్నాయి... సోమవారం ఉదయం 12 గంటల సమయంలో డిజిపి సాంబశివరావు కారులో 16వ నెంబరు జాతీయ రహదారి మీదుగా రాజమహేంద్రవరం నుండి విజయవాడ వెళుతున్నారు.

09/12/2017 - 03:13

రాయచోటి, సెప్టెంబర్ 11: పెట్రోల్ బంకు ఏర్పాటుకు నో అబ్జక్షన్ సర్ట్ఫికెట్(ఎన్‌ఓసి) ఇచ్చేందుకు గాను రూ. 10 వేలు లంచం తీసుకున్న డిప్యూటీ తహసీల్దార్ సుదర్శనరావు ఎసిబి అధికారులకు చిక్కాడు. రాయచోటిలో సోమవారం ఈ సంఘటన జరిగింది. రాయచోటి మండలం కాటిమాయకుండకు చెందిన బి.శ్రీనివాసులుకు పెట్రోల్ బంక్ మంజూరైంది. బంక్ ఏర్పాటుకు గాను ఎన్‌ఓసి కోసం దరఖాస్తు చేసుకున్నాడు.

09/12/2017 - 03:13

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 11: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా పచ్చి అబద్ధాలాడుతున్నారని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆరోపించారు. పట్టిసీమ పధకం కరంటు వినియోగానికి సంబంధించి రూ.89.87 కోట్లు బిల్లయితే రూ.185.60 కోట్లు కేటాయిస్తూ జీవో జారీచేయడం విడ్డూరంగా ఉందన్నారు.

09/12/2017 - 01:48

విశాఖపట్నం, సెప్టెంబర్ 11: రక్షణ శాఖ కార్యదర్శి సంజయ్ మిత్ర రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖలోని తూర్పు నౌకాదళ కార్యాలయానికి సోమవారం వచ్చారు. రక్షణ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొట్టమొదటిసారిగా ఆయన తూర్పు నౌకాదళాన్ని సందర్శించారు. ఢిల్లీ నుంచి విశాఖలోని ఐఎన్‌ఎస్ డేగా విమానాశ్రయానికి చేరుకున్న మిత్రకు చీఫ్ ఆఫ్ నేవల్ స్ట్ఫా వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ స్వాగతం పలికారు.

09/12/2017 - 01:46

గుంటూరు, సెప్టెంబర్ 11: మానవ చరిత్రను మలుపు తిప్పిన అక్టోబర్ మహావిప్లవం ఎన్నో ఉద్యమాలకు స్ఫూర్తిదాయకమైందని, ప్రపంచ, మానవ చరిత్రపై ఈ విప్లవ ప్రభావం తీవ్రంగా ఉందని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు.

09/12/2017 - 01:44

వేంపల్లె, సెప్టెంబర్ 11: విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలే జరిగిందని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా వేంపల్లెలో పిసిసి ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి స్వగృహంలో విలేఖరులతో మాట్లాడుతూ విభజనతో ప్రజలకు కేవలం పది శాతం మాత్రమే నష్టం జరిగిందని, 90 శాతం లాభం చేకూరిందన్నారు.

09/12/2017 - 01:42

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 11: రాష్ట్రంలో పలువురు డిఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వెయిటింగ్‌లో ఉన్న ఎస్‌వి గోపాలకృష్ణను కర్నూలు జిల్లా నంద్యాల ఎస్‌డిపిఓగా నియమించారు. ఇక్కడ పని చేస్తున్న యు రవిప్రకాష్‌ను నంద్యాల ఆపరేషన్స్ అదనపు ఎస్పీగా బదిలీ చేశారు.

09/12/2017 - 01:39

తిరుపతి, సెప్టెంబర్ 11: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల సహా ఇతర ప్రముఖ ఆలయాలకు జిఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఐసిఏఐ సెంట్రల్ కౌన్సిల్ సభ్యుడు, చార్టెడ్ అకౌంటెంట్ ఎం.దేవరాజు రెడ్డి చెప్పారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. మానసిక ప్రశాంతత కోసం, నమ్మకంతో దేవుని దర్శనం కోసం భక్తులు తిరుమలకు వస్తుంటారని అన్నారు.

Pages