S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/19/2017 - 04:25

విశాఖపట్నం, జూలై 18: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మంగళవారం అర్థరాత్రికి ఒడిశాలోని పూరి-గోపాల్‌పూర్ మధ్య తీరం దాటనుంది. దీని ప్రభావం వలన ఉత్తర కోస్తాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీరం వెంబడి 50 నుంచి 55 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం మంగళవారం రాత్రి తెలియచేసింది.

07/19/2017 - 04:24

శ్రీకాకుళం, జూలై 18: మరో 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఒడిశా వాతావరణ కేంద్రం చేసిన హెచ్చరిక శ్రీకాకుళాన్ని వణికిస్తోంది. అల్పపీడన ద్రోణి గోపాల్‌పూర్ నుంచి పారాదీప్‌కు పయనం అవుతుందన్న సంకేతాలతో కలెక్టర్ కె.్ధనుంజయరెడ్డి అధికారులను మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నాగావళిలో వరద ఉద్ధృతి తగ్గినప్పటికీ, ఆమదాలవలస మండలం నిమ్మతొర్లాడ ప్రాంతంలో పంటపొలాలు దాటుకుని రోడ్డెక్కేసింది.

07/19/2017 - 04:22

కాకినాడ, జూలై 18: ఓవైపు ఎడతెరిపి లేని వర్షాలు, చలిగాలులు... మరోవైపు ఆలనాపాలనా పట్టించుకోకుండా గాలికి వదిలేయడంతో తిండి కరువై గోవులు మృత్యువాత పడిన వైనమిది. సుమారు 10 రోజులుగా పశుగ్రాసం లేక ఆకలితో అలమటిస్తూ 20 గోవులు మృతిచెందిన హృదయ విదారక సంఘటన తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో చోటుచేసుకుంది.

07/19/2017 - 04:20

యు.కొత్తపల్లి, జూలై 18: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని ఉప్పాడ తీరం నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన అయిదుగురు మత్స్యకారుల ఆచూకీ గల్లంతయ్యింది. దీంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ నెల 9న వీరంతా బోటుపై చేపల వేటకు వెళ్లారు. వీరు నాలుగు రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా, పది రోజులైనా రాకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.

07/19/2017 - 04:20

విజయవాడ (క్రైం), జూలై 18: పట్టిసీమ ప్రాజెక్టుపై ఇద్దరు సీనియర్ రాజకీయ నేతలు మంగళవారం విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌పై తలపెట్టిన బహిరంగ చర్చను పోలీసులు అడ్డుకున్నారు. పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ రాజమండ్రి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆరోపించగా.. కొట్టిపారేసిన టిడిపి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి బహిరంగ చర్చకు సవాల్ విసిరారు.

07/19/2017 - 03:29

విజయవాడ (కార్పొరేషన్), జూలై 18: విదేశీ విధానాన్ని రాజకీయ కోణంలో వాడుకుంటున్న బిజెపి చర్యలను కాంగ్రెస్ ఖండిస్తోందని, ఆందోళన కలిగిస్తున్న దేశ భద్రతపైనా, విదేశీ విధానాలపైనా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి పేర్కొన్నారు.

07/19/2017 - 03:27

హైదరాబాద్, జూలై 18: మోటారు వాహనాల చట్టాన్ని సక్రమంగా అమలు చేయకపోవడం పట్ల ఆంధ్రప్రదేశ్ రవాణా, కార్మిక శాఖ అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దివాకర్ ట్రావెల్స్‌కు ఏ ప్రాతిపదికన క్లీన్ చిట్ ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది.

07/19/2017 - 03:26

విజయవాడ, జూలై 18: అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టు కింద విజయవాడ నగరంలో లైట్ మెట్రో రైలు ఎల్‌ఆర్‌టి (లైట్ రైల్ టెక్నాలజీ) ఏర్పాటు చేసేందుకు త్వరితగతిన సవివర ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్)ను సిద్ధం చేసి సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ జర్మనీకి చెందిన కెఎఫ్‌డబ్ల్యు సంస్థను కోరారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో ఆయన అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టుపై ఆ సంస్థ ప్రతినిధులతో చర్చించారు.

07/19/2017 - 03:24

హైదరాబాద్, జూలై 18: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే పదిరోజుల్లో బెల్ట్‌షాపులను మూసివేయని పక్షంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె రోజా ప్రకటించారు. మంగళవారం ఆమె ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వస్తే నెలరోజుల్లో బెల్ట్‌షాపులను మూసివేస్తామన్నారు.

07/19/2017 - 03:24

హైదరాబాద్, జూలై 18: విజయవాడలో నిడమానూరు వద్ద మెట్రో స్టేషన్, డిపో ఏర్పాటుకు సంబంధించి 60 ఎకరాల భూసేకరణ పనులపై హైకోర్టు స్టే ఇచ్చింది. రాష్ట్రప్రభుత్వం 60 ఎకరాల వరకు మెట్రో రైల్వే పనులకు సంబంధించి జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ కె వసంత మరి కొంత మంది దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ బి శివశంకర్‌రావు విచారించి స్టే ఇచ్చారు.

Pages