S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/25/2017 - 04:23

విశాఖపట్నం, మార్చి 24: విశాఖలో ఏది నేషనల్ హైవేనో, ఏది స్టేట్ హైవేనో అన్న అంశంపై నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, ఎక్సైజ్ శాఖ అధికారులకు స్పష్టత లేకుండాపోయింది. నేషనల్ హైవే, స్టేట్ హైవేలను ఆనుకుని 500 మీటర్ల లోపు ఉన్న మద్యం దుకాణాలను, బార్లను తొలగించాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. వీటిని ఈ నెల 31లోగా వీటిని తొలగించాల్సి ఉంది. అయితే, విశాఖ జిల్లాలో నేషనల్ హైవే ఏది?

03/24/2017 - 04:28

రాయపర్తి, మార్చి 23: నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో తండ్రి మృతి చెందడంతో అన్నీ తానై పోషించిన తల్లి కూడా గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందడంతో దుఃఖాన్ని దిగమింగుతూ మృతురాలి కుమార్తె పరీక్ష రాసిన విషాద సంఘటన ఇది. వరంగల్ రూరల్ జిల్లా బురహాన్‌పల్లి గ్రామంకు చెందిన తిపర్తి రాము, రాజేశ్వరి దంపతులు కుమార్తె ప్రత్యూష, కుమారుడు నిఖిల్‌తో కలిపి గ్రామంలో పల్లీలు అమ్ముకుంటూ జీవనం కొనసాగించేవారు.

03/24/2017 - 04:45

తిరుపతి: శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చిన వేలూరుకి చెందిన పద్మనాభం (65) అనే భక్తుడిపై గత రెండు రోజుల క్రితం ఆలయ మహాద్వారం సమీపంలో ఉన్న స్కానింగ్ కేంద్రం వద్ద టిటిడి విజిలెన్స్, ఎస్పీఎఫ్ సిబ్బంది దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ భక్తుడు అక్కడికక్కడే కుప్పకూలడంతో టిటిడి విజిలెన్స్ సిబ్బంది ముందుగా అశ్వని ఆస్పత్రికి, అక్కడ నుంచి తిరుపతిలోని స్విమ్స్‌కు తరలించారు.

03/24/2017 - 04:46

రాజాం: శ్రీకాకుళం జిల్లా రాజాం కరూర్ వైశ్యా బ్యాంక్‌లో అప్రైజర్ కోటి 33 లక్షల 55 వేల రూపాయల కుంభకోణానికి సూత్రధారిగా నిలిచాడు. బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకున్న వారు వాయిదాలు కట్టక పోవడంతో వారు తాకట్టు పెట్టిన బంగారాన్ని బుధవారం పరిశీలించడంతో అసలు విషయం బయట పడింది. దీంతో బ్యాంక్ మేనేజర్ చంద్రవౌళి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

03/24/2017 - 04:47

అనంతపురం: అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ, పట్ట్భద్రుల శాసనమండలి స్థానాలు రెండూ చేజారి పోవడంతో టిడిపిలో అంతర్మథనం మొదలైంది. ముఖ్యంగా వర్గ రాజకీయాలు నష్టం చేకూర్చాయని పార్టీవర్గాల్లో చర్చ సాగుతోంది.

03/24/2017 - 04:48

కాకినాడ: బిసి కమిషన్ తీరు నచ్చక బిసి కులాల నేతలు సభ నుండి వాకౌట్ చేయగా, కాపు నేతల పద్ధతి నచ్చక బిసి కమీషన్ ఛైర్మన్ జస్టిస్ కెఎల్ మంజునాథ సమావేశాన్ని మధ్యలోనే వాయిదావేసి, నిష్క్రమించారు. కుల సంఘాల నేతల అభ్యంతరాలు, వాదోపవాదాలు, ఉద్రిక్త పరిస్థితుల నడుమ కాకినాడలో జస్టిస్ మంజునాథ కమిషన్ సమావేశం తొలి రోజైన బుధవారం అర్థాంతరంగా వాయిదాపడింది.

03/24/2017 - 03:51

అమరావతి, మార్చి 23: వేల కోట్లు మోసం చేసిన అగ్రిగోల్డ్ అంశంపై చర్చను పక్కదోవ పట్టించేందుకే స్పీకర్ వ్యాఖ్యల అంశాన్ని తెరపైకి తెచ్చారని ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆరోపించారు. 20 లక్షల కుటుంబాలను రోడ్డున పడేసిన అగ్రిగోల్డ్ అంశంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రి పేరు ప్రస్తావనకు రావడంతోనే ఉద్దేశపూరితంగా అసెంబ్లీలో చర్చను అటకెక్కించారని మండిపడ్డారు.

03/24/2017 - 03:49

విజయవాడ, మార్చి 23: ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు.. ప్యాకేజీ ఎవరి కోసం - బాబు కోసం.. ప్రత్యేక హోదా రాష్ట్ర సంజీవనే.. ప్రత్యేక హోదా రాకపోతే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి.. అంటూ ఫ్లకార్డులు చేపట్టి స్పీకర్ పోడియం ఎదుటే పెద్దపెట్టున చేసిన నినాదాలతో గురువారం ప్రారంభంలోనే శాసనసభ దద్దరిల్లింది.

03/24/2017 - 03:48

అమరావతి, మార్చి 23: తాము అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న 105 కుటుంబాల వారికి ఇచ్చే నష్టపరిహారాన్ని తాము రూ.10 లక్షలు చేస్తామని, చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వగా మిగిలిన మొత్తాన్ని పువ్వుల్లో పెట్టి వాళ్లకు ఇస్తామని వైసిపి అధినేత జగన్ భరోసా ఇచ్చారు.

03/24/2017 - 03:45

విజయవాడ, మార్చి 23: కర్షక పరిషత్ పునరుద్ధరణ ఆలోచన ఇప్పటి వరకూ లేదని, అయితే దీనిని పరిశీలిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. రాష్ట్ర శాసన మండలి గురువారం నాటి ప్రశ్నోత్తరాల సమయంలో కూరగాయలకు మద్దతు ధరపై ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణంనాయుడు ప్రశ్నించారు. గిట్టుబాటు ధర లేక టమాటాలు, వంకాయలు వంటివి రైతులు రోడ్డుపై పారబోస్తున్నారని తెలిపారు.

Pages