S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/21/2016 - 03:45

ఆమదాలవలస, డిసెంబర్ 20: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణాని సమీపంలోని లక్ష్ముడిపేట గ్రామ శివారు ముళ్లపొదల్లో సుమారు రూ.40 లక్షల రూ.2వేల కొత్తనోట్ల కరెన్సీ కట్టలు మంగళవారం బయట పడినట్లు స్థానిక పోలీసులకు ఫిర్యాదు అందింది.

12/21/2016 - 03:44

కర్నూలు, డిసెంబర్ 20 : కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం వచ్చినా సామాన్యుడికి కరెన్సీ కష్టాలు ఎదురవడంపై మాత్రం అసహనం వ్యక్తమైనట్లు తెలుగుదేశం పార్టీ సర్వేలో స్పష్టమైంది. దీంతో జనవరి 2వ తేదీ నుంచి నిర్వహించ తలపెట్టిన జన్మభూమి కార్యక్రమాన్ని ఫిబ్రవరిలో నిర్వహిస్తే మంచిదన్న ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నట్లు అధికార పార్టీ వర్గాల సమాచారం.

12/21/2016 - 02:49

విజయవాడ, డిసెంబర్ 20: దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించేందు కేంద్రానికి లేఖ రాయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. క్రైస్తవులకు మరిన్ని సౌకర్యాలకు ఆయన హామీలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ను పేదలు లేని రాష్ట్రంగా మార్చేందుకు క్రైస్తవ సోదరులు దేవుడిని ప్రార్ధించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం తనకు అండదండలు ఇవ్వాలని కోరారు.

12/21/2016 - 02:45

హైదరాబాద్, డిసెంబర్ 20: సౌదీ అరేబియా దేశంలోని ఆసుపత్రుల్లో మగ్గుతున్న రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 150 మంది మృతదేహాలను ఇక్కడకు తెచ్చి వారి కుటుంబ సభ్యులకు అప్పగించడంపై తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్‌లను దాఖలు చేయాలని హైకోర్టు ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం జారీచేసింది.

12/21/2016 - 02:45

హైదరాబాద్, డిసెంబర్ 20: భారతి సిమెంట్స్ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అథారిటీ జప్తు చేయడంపై హైకోర్టు స్టే విధించింది. దీంతో భారతి సిమెంట్స్ యాజమాన్యానికి ఊరట లభించినట్లయింది. ఈ సంస్థలను వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతి నిర్వహిస్తున్న విషయం విదితమే.

12/21/2016 - 02:44

గాజువాక, డిసెంబర్ 20: భార్య ఆత్మహత్య కేసులో బుల్లి తెర నటుడు ఎస్.రమేష్‌ను మంగళవారం గాజువాక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇక్కడి శ్రీనగర్‌కు సమీపంలోని విశే్వశ్వరయ్యనగర్‌లో నివాసం ఉంటున్న ఎస్.రమేష్ భార్య త్రిపురాంబిక సోమవారం రాత్రి తన ఇంటిలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

12/21/2016 - 02:43

గాజువాక, డిసెంబర్ 20: టిడిపి సీనియర్ నేత, దివంగత ఎంపి కింజరాపు ఎర్రన్నాయుడు తనయుడు, ప్రస్తుత శ్రీకాకుళం ఎంపి రామ్మోహన్‌నాయుడు పెళ్లి కొడుకు కాబోతున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి రెండో కూతురు శ్రావ్యతో ఎంపీకి పెళ్లి సంబంధం కుదిరింది. శ్రావ్య ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతోంది.

12/21/2016 - 02:42

సంజామల, డిసెంబర్ 20: విహారయాత్రకు బయలుదేరిన బస్సు బోల్తాపడడంతో పలువురు విద్యార్థినులు, ఉపాధ్యాయులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన కర్నూలు జిల్లా సంజామల మండలం పరిధిలోని రెడ్డిపల్లె సమీపంలో మంగళవారం ఉదయం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.

12/20/2016 - 04:37

విశాఖపట్నం, డిసెంబర్ 19: అక్రమాస్తుల కేసులో పట్టుబడిన ఎక్సైజ్ అదనపు కమిషనర్ లక్ష్మణ భాస్కర్‌ను అరెస్టు చేసిన అవినీతి నిరోధక శాఖ సోమవారం ఎసిబి కోర్టులో ప్రవేశపెట్టింది. అవినీతి అధికారికి ఎసిబి కోర్టు రిమాండ్ విధించింది. ఈ సందర్భంగా ఎసిబి డిఎస్పీ కె రామకృష్ణ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ లక్ష్మణ భాస్కర్ అక్రమాస్తులతో పాటు బినామీలను గుర్తించే పనిలో నిమగ్నమైనట్టు వెల్లడించారు.

12/20/2016 - 04:36

కర్నూలు, డిసెంబర్ 19: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం కొందరు వ్యాపారులకు కనక వర్షం కురిపిస్తోంది. ప్రజల నుంచి వచ్చిన చిల్లర నోట్లను ధనంతులకు ముట్టజెప్పి పెద్దమొత్తంలో కమీషన్లు తీసుకోవడం ద్వారా కొత్త తరహా నల్లవ్యాపారం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇలాంటి వ్యాపారులకు కమీషన్ల రూపంలో భారీ ఎత్తున లబ్ది చేకూరినట్లు సమాచారం.

Pages