S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/19/2016 - 04:54

కడప, డిసెంబర్ 18 : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కడప జిల్లాలో అప్పుడే క్యాంపు శిబిరాలు ప్రారంభమయ్యాయి. వైకాపా అభ్యర్థిగా రాష్ట్ర మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, టిడిపి తరఫున బిటెక్ రవి(రవీంద్రనాథ్‌రెడ్డి) బరిలో ఉన్నారు. వారిద్దరి తరఫున ఆయా పార్టీల అధిష్ఠానాలు రంగంలోకి దిగి ఓటర్లు, వారి కుటుంబ సభ్యులపై వత్తిడి తీసుకొచ్చి బేరసారాలు చేసుకుని ఓటుకు రూ. 5 నుంచి రూ.

12/19/2016 - 04:53

అనంతపురం, డిసెంబర్ 18 : రాష్ట్రంతో పాటు కర్నాటకలోని వివిధ ప్రాంతాల్లో నేరాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న అంతర్రాష్ట్ర ఘరానా దొంగల ముఠాలను అనంతపురం జిల్లా పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. వేర్వేరుగా పట్టుబడిన ఈ రెండు ముఠాల వివరాలను ఆదివారం అనంతపురం నగరంలోని పోలీసు కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీ ఎస్‌వి.రాజశేఖరబాబు విలేఖరుల సమావేశంలో వెల్లడించారు.

12/19/2016 - 04:47

తోటపల్లిగూడూరు, డిసెంబర్ 18: రద్దయిన పాత నోట్లను మార్చుకొని కొత్త నోట్లు ఇస్తామంటూ మోసం చేయడమే కాక, బాధితులు తీసుకొచ్చిన నగదును దోపిడీ చేసే ముఠాల ఆగడాలు నెల్లూరు జిల్లాలో మితిమీరుతున్నాయి. తాజాగా తోటపల్లిగూడూరు మండలంలోనూ ఇదే తరహా ఘటనలో బాధితులు 24 లక్షల 25 వేల రూపాయలు పోగొట్టుకొని లబోదిబోమంటూ పోలీస్‌స్టేషన్ గడప ఎక్కారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

12/19/2016 - 04:46

రాజమహేంద్రవరం, డిసెంబర్ 18: పోలవరం ప్రాజెక్టుపై జాతీయ స్థాయి పోరాటానికి నిర్వాసితులంతా సన్నద్ధం కావాలని రాజమహేంద్రవరంలోని ఆనం రోటరీ హాలులో ఆదివారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది. ఆర్థిక, రాజకీయ విశే్లషకుడు పెంటపాటి పుల్లారావు అధ్యక్షతన పోలవరం నిర్వాసితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

12/19/2016 - 00:57

విజయవాడ, డిసెంబర్ 18: రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో ఆర్థిక లావాదేవీలు, పారిశుద్ధ్య నిర్వహణను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న విధానాన్ని అమలు చేసే అంశంపై రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ యోచిస్తున్నది. ఈ విధానం అమలు చేయడం వల్ల భక్తులకు మరింత మేలైన సేవలు అందించే వీలు ఉంటుందని భావిస్తున్నారు.

12/19/2016 - 00:55

విజయవాడ, డిసెంబర్ 18: అవినీతిపరులకు అండగా ఉండేందుకు విపక్షాలు ఉమ్మడిగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలను అడ్డుకుని ప్రజలను మోసం చేశాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి కంభంపాటి హరిబాబు విమర్శించారు. చంద్రబాబును నగదురహిత అమలు కమిటీలో సభ్యునిగా నియమించి ప్రధాని మోదీ ఆయన ముఖాన బురద వేసారన్న ఎంపి రాయపాటి విమర్శకు స్పందిస్తూ ఒకవేళ ఆయన అలా భావిస్తే తామే కడుగుతామన్నారు.

12/19/2016 - 00:46

రాజమహేంద్రవరం, డిసెంబర్ 18: పోలవరం కాంక్రీటు పనులు ఈ నెలాఖరుకు ప్రారంభమవుతాయని రాష్ట్ర జలనవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. పనుల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడు, సుజనాచౌదరి హాజరుకానున్నారు.

12/19/2016 - 00:45

అమరావతి, డిసెంబర్ 18: అధికారమే లక్ష్యంగా అడుగులేస్తున్న వైసీపీ అధినేత జగన్ లక్ష్యసాధన కోసం తన పంథా మార్చుకుంటున్నారు. గతంలో తనను, వైఎస్‌ను చూసి జనం ఓట్లేస్తారన్న భ్రమల నుంచి ఇప్పుడు వాస్తవ ప్రపంచంలోకి వస్తున్నట్లు ఆయన వ్యవహారశైలి స్పష్టం చేస్తోంది. ముందుగా తనపై ఉన్న క్రైస్తవ ముద్రను చెరిపేసుకునేందుకు ఆయన ఇటీవలి కాలంలో ఎక్కువగా హిందూ ఆలయాలు, పీఠాలకు వెళ్లి స్వాముల ఆశీస్సులు తీసుకుంటున్నారు.

12/18/2016 - 06:45

విశాఖపట్నం, డిసెంబర్ 17: జస్టిస్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో భాగంగా శనివారం విశాఖ పోర్టు కళావాణిలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ వ్యవస్థపట్ల తనకు అపారమైన గౌరవం ఉందన్నారు.

12/18/2016 - 06:42

విజయవాడ (క్రైం), డిసెంబర్ 17: సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని పోలీస్టేషన్ రైటర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిథిలోని గన్నవరంలో జరిగిన ఈ ఘటన పోలీసువర్గాల్లో సంచలనం రేపింది. అయితే ఘటనపై అనుమానాలు ఉన్నాయంటూ మృతుని భార్య ఆరోపిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

Pages