-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, సెప్టెంబర్ 20: త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో రాజధాని ప్రాంత కృష్ణ, గుంటూరు జిల్లాల నుంచి కాపు వర్గానికి చెందిన యువ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావుకు మంత్రి పదవి ఇవ్వాలని కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు పిళ్లా వెంకటేశ్వరరావు నాయకత్వంలో పలువురు నాయకులు మంగళవారం సిఎం చంద్రబాబునాయుడ్ని కలిసి వినతిపత్రం అందజేశారు.
గుంటూరు, సెప్టెంబర్ 20: రాష్టవ్య్రాప్తంగా 52వేల మందికి రక్తపరీక్షలు నిర్వహించగా 1206 డెంగీ కేసులు నమోదయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. డెంగీ, చికున్గున్యా, పైలేరియా వ్యాధుల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. దోమలపై దండయాత్ర- పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు చెప్పారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 20: విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి చాతుర్మాస్య దీక్ష తర్వాత రుషీకేష్ నుండి బుధవారం విశాఖపట్నం తిరిగి వస్తున్నారు. భారతీయ సంస్కృతి-సంప్రదాయాల్లో గురువులు, పీఠాధిపతులు, రుషులు జూలై నెల నుండి చాతుర్మాస్యదీక్షలో ఉంటారు. చాతుర్మాస్య దీక్షలో కొంత మంది నాలుగునెలల పాటు ఒకేచోట ఉంటే, మరికొంత మంది రెండు నెలల పాటు ఒకే చోట ఉంటారు.
హైదరాబాద్: అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనే కాకుండా విద్య, ఉపాధి రంగాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని అడ్వకేట్ జనరల్ శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. హైకోర్టులో స్విస్ చాలెంజ్ కేసు విచారణ రేపటికి వాయిదా పడింది. ప్రభుత్వం దగ్గర నిధులు లేకున్నా అమరావతిలో పనులకు కాంట్రాక్టు సంస్థ ముందుకు వచ్చిందని స్పష్టం చేశారు.
శ్రీకాకుళం : పొందూరు వాండ్రంగివీధికి చెందిన నేత కార్మికుడు ముప్పన శ్రీనివాసరావు, మూగోడువీధికి చెందిన వడుకు కార్మికురా లు కోరుకొండ సరోజినిలను జా తీయ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఖాధీ విలేజ్ ఇండసీ్ట్ర కమిషనర్ (కేవీఐసీ) నుంచి సమాచారం అందింది. ముంబైలోని కేవీఐసీ ప్రధాన కార్యాలయంలో అవార్డులు అందించనున్నారు.
హైదరాబాద్: డిండి, పాలమూరు ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, కృష్ణా జలాల విషయంలో తెలంగాణ పిడివాదం వీడాలని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు మంగళవారం మీడియాతో అన్నారు. పోలవరం ప్రాజెక్టులో తెలంగాణ 45టీఎంసీల వాటా కోరడం అసంబద్ధమన్నారు.
హైదరాబాద్: పోలవరం పూర్తయితే ఏపీలో నీటిసమస్య లేకుండా పోతుందని చంద్రబాబు తెలిపారు. రాయలసీమలో సాగునీటి సమస్యను అధిగమించామని, ఇది పట్టిసీమ నిర్మాణంతోనే సాధ్యమైందని ఆయన అన్నారు. విద్యుత్ విషయంలోనూ ఇదే తరహా విజయం సాధించామని, గత ఏడాది ఏపీ మినహా ఏ రాష్ట్రం రెండంకెల వృద్ధి సాధించలేదని అన్నారు.
రాజమండ్రి: మధుమేహ వ్యాధిగ్రస్తుడు 7 రోజుల పాటు భోజనం మానేస్తేనే షుగర్ లెవల్స్ పడిపోతాయని, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం 7 రోజులు దీక్ష చేసినా షుగర్ లెవల్స్లో ఏమీ తేడా రాలేదని కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ మంగళవారం అన్నారు. ముద్రగడ దీక్షపై తనకు అనుమానాలున్నాయని, షుగర్ లెవల్స్లో మార్పు ఉండదని ముద్రగడ నిరూపిస్తే, తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని రామానుజయ సవాలు విసిరారు.
గుంటూరు : మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తిపై దాడికి పాల్పడ్డ గురజాల డీఎస్పీ నాగేశ్వరరావుపై వెంటనే చర్యలు తీసుకోవాలని గుంటూరు ఎస్పీ కార్యాలయం ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మంగళవారం బైఠాయించారు. ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ సీనియర్ నేతలు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, బీసీ సంఘాలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శ్రీకాకుళం : అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని మంత్రులు తెలిపారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఇన్ చార్జ్ మంత్రి పరిటాల సునీత, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తో పాటు కలెక్టర్ లక్ష్మీనృంహం స్వామి వారిని మంగళవారం ఉదయం దర్శించుకున్నారు.