-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్, సెప్టెంబర్ 14: అమరావతి రాజధాని నిర్మాణానికి అనుసరిస్తున్న స్విస్ చాలెంజ్ విధానం నోటిఫికేషన్లపై సింగిల్ జడ్జి కోర్టు ఇచ్చిన స్టేపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ అపీల్ను హైకోర్టు తిరస్కరించింది.
విశాఖ : విశాఖకు రైల్వే జోన్, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా డిమాండు చేస్తూ బుధవారం వామపక్షాల ఆధ్వర్యంలో పెందుర్తిలో రైలు రోకో నిర్వహించారు. విజయవాడ నుంచి రాయ్గడ్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు, ఒక గూడ్స్ రైలును నిలిపివేశారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విజయనగరం: ఆర్డబ్ల్యూఎస్లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా పనిచేస్తున్న చింత విద్యాసాగర్రావు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని, ఏసీబీ అధికారులు బుధవారం ఆయన ఇంట్లో, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఉన్న అతని బంధువుల ఇళ్లల్లో కూడా ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతానికి కోటి డైభ్బై ఐదు లక్షల అక్రమాస్తులను గుర్తించడం జరిగిందని, తెలిపారు.
విశాఖ: పట్టణ ప్రణాళిక సక్రమంగా లేకపోవడం వల్ల సమస్యలు రెట్టింపు అవుతున్నాయని, పట్టణీకరణను దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విశాఖలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో బుధవారం ఆయన ప్రసంగించారు. దేశాభివృద్ధిలో పట్టణీకరణే కీలకపాత్ర పోషిస్తుందని, పట్టణీకరణలో ప్రధానంగా కాలుష్యం, మురికవాడల సమస్య ఎదురవుతోందన్నారు.
విజయవాడ: మాజీ మంత్రి దేవినేని నెహ్రూ గురువారం నాడు అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఆయన కుమారుడు దేవినేని అవినాష్, ముఖ్య అనుచరులు కూడా టిడిపి తీర్థం పుచ్చుకుంటున్నారు. గురువారం సాయంత్రం భారీ ర్యాలీ అనంతరం గుణదలలో జరిగే సభలో టిడిపి అధినేత, సిఎం చంద్రబాబు పార్టీ కండువాలు కప్పి దేవినేని నెహ్రూ తదితరులను టిడిపిలోకి ఆహ్వానిస్తారు.
విశాఖ: ఏపీ అభివృద్ధిపై ప్రధాని మోదీ ప్రత్యేక శద్ధ చూపుతున్నారని, ప్రత్యేక హోదాకు, పారిశ్రామిక రాయితీలకు సంబంధం లేదదని , హోదాకు బదులుగా రాష్ట్రాన్ని కేంద్రం ప్రత్యేకంగా గుర్తించిందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు బుధవారం ఉదయం విశాఖ చేరుకున్న వెంకయ్య భాజపా శ్రేణులు ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ, ప్రత్యేక హోదాకు పారిశ్రామిక రాయితీలకు సంబంధం లేదన్నారు.
హైదరాబాద్: స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్ల ప్రక్రియపై పిటిషన్ను గురువారం విచారణ చేపడతామని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. ఏపీ రాజధాని అమరావతిలో ప్రధాన అభివృద్ధి దారుని ఎంపిక చేసేందుకు ఉమ్మడి హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం నిలుపుదల చేయడాన్ని సవాల్ చేస్తూ ఏపీ అడ్వొకెట్ జనరల్ బుధవారం డివిజన్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో అప్పీల్కు అనుతివ్వాలని ఏజీ కోరారు.
విజయవాడ: పులిచింతల ప్రాజెక్టుకు బుధవారం ఉదయం వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 47.47 అడుగులుగా ఉంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 29,373 క్యూసెక్కులు కాగా, ఔట్ఫ్లో 9,929 క్యూసెక్కులుగా ఉంది. పులిచింతల ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 21.5 టీఎంసీలుగా నమోదు అయ్యింది.
విజయవాడ : స్విస్ఛాలెంజ్ విధానంలో టెండర్ల ప్రక్రియపై ఉమ్మడి హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం నిలుపుదల(స్టే) చేయడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పీలుకి వెళ్లనుంది. ఉమ్మడి హైకోర్టు డివిజన్ బెంచ్లో బుధవారం పిటిషన్ వేయనుంది. హైకోర్టు స్టే ఉత్తర్వుల నేపథ్యంలో స్విస్ఛాలెంజ్ ప్రక్రియను సీఆర్డీఏ ప్రస్తుతానికి పక్కన పెట్టింది.
విశాఖ: ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ కంటే ఎన్నో ప్రయోజనాలు కలిగిన ప్రత్యేక ప్యాకేజీ సాధించారని కేంద్రమంత్రి వెంకయ్యకు భాజపా నేతలు ధన్యవాదాలు తెలిపారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు బుధవారం ఉదయం విశాఖ చేరుకున్న వెంకయ్యకు భాజపా నేతలు ఘనస్వాగతం పలికారు. ఎంపీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. విశాఖ ఎంపీ హరిబాబుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.