S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/30/2016 - 05:46

విజయవాడ, ఆగస్టు 29: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నత విద్యకు చిరునామాగా మారనుంది. అంతర్జాతీయ స్థాయిలో విశ్వవిద్యాలయాలు, అత్యాధునిక పరిశోధనా సంస్థలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇప్పటికే ప్రఖ్యాత విద్యాసంస్థలకు ప్రభుత్వం ఆహ్వానం పలికింది. రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

08/30/2016 - 05:45

విశాఖపట్నం, ఆగస్టు 29: భూ ఉపరితలంపై ఏర్పడిన ఆవర్తనం కొనసాగుతుండటం వల్ల రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో చాలా చోట్ల వర్షాలు కురుస్తాయి. ఈ విషయాన్ని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సోమవారం రాత్రి తెలిపారు. దీనికి తోడు నైరుతి రుతుపవనాల ప్రభావం కూడా ఉండటంతో వర్షాలు కురుస్తాయని తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని తెలిపారు.

08/30/2016 - 05:45

చంద్రగిరి, ఆగస్టు 29: రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను అవినీతి రహిత శాఖగా తీర్చిదిద్దే విధంగా సంస్కరణలు చేపడుతున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి కెఇ కృష్ణమూర్తి అన్నారు. సోమవారం చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని రెవెన్యూ కార్యాలయం ప్రాంగణంలో 68 లక్షలతో నిర్మించిన చంద్రగిరి సబ్ రిజిస్ట్రార్ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.

08/30/2016 - 05:44

ఆదోని, ఆగస్టు 29: ఉరుకుంద ఈరన్నస్వామి పల్లకి ఉత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. ఉత్సవాన్ని తిలకిచేందుకు భక్తులు పుట్టిలో వస్తుండగా తుంగభద్ర నదిలో అది మునిగిపోయింది. దీంతో ఒకరు గల్లంతయ్యారు. మిగతావారు ప్రాణాలతో బయటపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.

08/30/2016 - 05:44

ఒంగోలు, ఆగస్టు 29: జిల్లాకేంద్రమైన ఒంగోలులోని పలుప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం 2.50గంటలనుండి మూడుగంటలలోపు రెండుసెకన్లపాటు భూమికంపించటంతో అన్నివర్గాల ప్రజలు భయాందోళన చెందారు. ఒంగోలు నగరంలోని ఇస్లాంపేట, గాంధీనగర్, సుజాతనగర్, రాజపానగల్‌రోడ్డు, దేవుడిచెరువు తదితర ప్రాంతాల్లో స్వల్పభూకంపం వచ్చింది. ఇటీవల కాలంలో తరుచుగా జిల్లావ్యాప్తంగా స్వల్పభూకంపాలు వస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

08/30/2016 - 05:43

తిరుపతి, ఆగస్టు 29: తెలుగు పరిరక్షణ, అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలను అక్టోబర్ 2 గాంధీజయంతి నాటికి నెరవేర్చకపోతే చలో అమరావతి పేరుతో రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని రచయితలు, సాహితీవేత్తలు, కవులు, కళాకారులు, భాషా ప్రియులతో కలిసి తామే తెలుగు భాష శిలాఫలకాలను ఏర్పాటు చేస్తామని ప్రముఖ సాహితీవేత్త, తెలుగు భాషా పరిరక్షకులు, పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హెచ్చరించారు.

08/29/2016 - 17:59

చిత్తూరు: కురబలకోట మండలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ముఖాముఖి నిర్వహించారు. వ్యవసాయాధికారులు సహకరించడంలేదని ఓ రైతు ఫిర్యాదు చేశాడు. అధికారుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట సంజీవిని, రెయిన్‌గన్ల పనితీరును సీఎం పరిశీలించారు. పనుల్లో నిర్లక్ష్యం వహించే ఇంజినీర్లకు మెమోలు జారీ చేస్తామని, ఎరువులను ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

08/29/2016 - 17:57

విజయవాడ: నలుగురు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన హెడ్మాస్టర్‌కు ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 9 లక్షల జరిమాన విధిస్తూ కృష్ణాజిల్లాలోని ప్రోక్సో స్పెషల్‌ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. పమిడిముక్కల మండలం ముత్రాసిపాలెం మండల పరిషత్ పాఠశాల హెడ్‌ మాస్టర్‌ గత ఏడాది సెప్టెంబర్‌లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

08/29/2016 - 17:21

విజయవాడ: చిత్తూరు, అనంతపురం జిల్లాలలో కరవు నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. అనంతపురం జిల్లాకు మురళీధర్‌రెడ్డి, చిత్తూరు జిల్లాకు వినయ్‌చంద్‌ను నియమించారు.

08/29/2016 - 17:09

ఆదిలాబాద్‌: లోకేశ్వరం మండలం పంచగుడిలో విద్యుదాఘాతంతో సోమవారం ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులను ధర్మోరకు చెందిన భూమన్న, మోహాల వాసి నవీన్‌గా గుర్తించారు. బోరుబావిలో పైపులు దించుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

Pages