-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్, ఆగస్టు 16: ప్రత్యేక హోదా సాధనకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని నరేంద్రమోదీ ఇంటి ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని, రాష్ట్రంలో కూర్చుని ఉపన్యాసాలు ఇస్తే హోదా రాదని వైకాపా ఎమ్మెల్యే కోటం శ్రీ్ధర్ రెడ్డి అన్నారు.
న్యూఢిల్లీ, ఆగస్టు16: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న అంశాలను రెండు వారాల్లో పరిష్కరించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. చట్టంలో పొందుపరిచిన హామీలలో అమలుకాని వాటిపైనా, రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కానీ అంశాలపైనా సత్వర చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, సుజనాచౌదరి మంగళవారం హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, అర్థిక మంత్రి అరుణ్ జైట్లీలతో భేటీ అయ్యారు.
ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీ రైతు గర్జన మహాసభ ప్రారంభమైంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్, సీనియర్ నేతలంతా ఈ సభలో పాల్గొంటున్నారు. మహాసభకు ముందు దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ప్రాజెక్టుల రీ- డిజైనింగ్పై మర్రి శశిధర్రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
విశాఖ: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరో 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ వర్గాలు వెల్లడించాయి. ఉత్తర కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ కొద్దిపాటి వర్షపు జల్లులు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.
విజయవాడ: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ రేపు విజయవాడ పున్నమి ఘాట్లో సతీసమేతంగా పుష్కరస్నానం చేస్తారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ వారిని దర్శించుకుంటారు. ఈనెల 19న తెలంగాణలోని నల్గొండ జిల్లా మట్టంపల్లి పుష్కరఘాట్లోగవర్నర్ పుష్కరస్నానం చేయనున్నారు. అనంతరం యాదగిరిగుట్ట చేరుకుని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు.
గుంటూరు : మంగళగిరి ఎర్రపాలెం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఆర్ఎఫ్)కు చెందిన ఎస్ఐ రఘువంశ్ మృతిచెందాడు. విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న రఘువంశ్ను లారీ ఢీకొంది. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు.
తిరుపతి: తిరుమల మొదటి ఘాట్రోడ్డులో మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బైక్పై వెళుతున్న దంపతులు లక్ష్మి, గోవిందరాజులు మరణించారు. మృతులు తమిళనాడులోని తిరువళ్లూరుకు చెందినవారు. ఈ ప్రమాదం కారణంగా ఘాట్రోడ్డులో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది.
గుంటూరు: పుష్కర స్నానం చేసేందుకు కృష్ణానది పాయలో మునిగిన అయదుగురు విద్యార్థులు గల్లంతైన ఘటన గుంటూరు జిల్లాలో మంగళవారం జరిగింది. నందిగామ ఘాట్ వద్ద నీళ్లు లేకపోవడంతో ఈ విద్యార్థులు కృష్ణానది పాయలోకి దిగారు. కాసేపటికే వీరి జాడ తెలియకుండా పోయింది. వీరు నందిగామ వాసులని తెలిసింది. గల్లంతైన విద్యార్థుల కోసం జాలర్ల సాయంతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
హైదరాబాద్: కృష్ణాపుష్కరాల నేపథ్యంలో యాత్రికుల సౌకర్యార్థం ఈనెల 16 నుంచి 23 వరకు హైదరాబాద్-విజయవాడ, చెన్నై-విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు ప్రారంభించినట్లు ‘ట్రూజెట్’ సంస్థ మంగళవారం ప్రకటించింది. విమాన సర్వీసు ఉదయం 6.20 గంటలకు గన్నవరం చేరుకుని తిరిగి 7.30 గంటలకు హైదరాబాద్కు పయనమవుతుంది. ఉదయం 11.25 గంటలకు గన్నవరం చేరుకుని తిరిగి మధ్యాహ్నం 12.15 గంటలకు హైదరాబాద్ పయనమవుతుంది.
విజయవాడ: విజయవాడ పరిసరాల్లో ఇప్పటివరకు 54 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారని, శ్రావణ పౌర్ణమి రోజు భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని, రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ బాబు తెలిపారు. అన్నదానానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయని, ప్రజలు కూడా సహకరిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. వచ్చే ఏడు రోజుల్లో 2.5 కోట్ల మంది వచ్చే అవకాశం ఉందని చెప్పారు.