-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, ఆగస్టు 15: విజయవాడ భవానీపురంలోని ఓ అపార్ట్మెంట్లో భవానీ టవర్స్లోని రెండు లిఫ్టులలో ఒక లిఫ్ట్కు సంబంధించి కేబుల్స్ తెగి ఐదో అంతస్తు నుంచి డభేల్మంటూ దిగువకు కూలిపోవటంతో అందులోనున్న 9మందిలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. అనుకోని రీతిలో జరిగిన ఈ కుదుపుకు నిలబడినవారంతా కుప్పకూలిపోవటంతో నడుం, కాళ్లకు తీవ్ర దెబ్బలు తగిలాయి.
గన్నవరం, ఆగస్టు 15: భారతదేశానికి మువ్వనె్నల జాతీయ పతకాన్ని అందించిన పింగళి వెంకయ్య కృష్ణా జిల్లా వాసి కావడం మనకు గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. సోమవారం మధ్యాహ్నం అనంతపురం నుంచి విమానంలో గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చిన ఆయన అక్కడ నిర్మాణంలో ఉన్న నూతన టెర్మినల్ భవనం ఎదుట 100 అడుగుల ఎత్తులో నిరంతరం ఎగిరేలా ఎయిర్పోర్టు అథార్టీ ఏర్పాటు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
హైదరాబాద్, ఆగస్టు 15: ‘దేశంలో దళితులపై జరుగుతున్న దాడులు చూస్తుంటే నిజంగా మనకు స్వాతంత్య్రం వచ్చిందా? అనే అనుమానం కలుగుతోంది..’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎపి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లోటస్ పాండ్లోని పార్టీ కార్యాలయంలో జగన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
హైదరాబాద్, ఆగస్టు 15: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి తొమ్మిది నగరాలు మణిహారంగా మారనున్నాయి. ఇందుకు సంబంధించిన మాస్టర్ప్లాన్ సిద్ధమవుతోంది. తొమ్మిది నగరాలను సమన్వయం చేస్తూ మెట్రోరైల్ను అనుసంధానం చేసే ప్రణాళిక రూపొందుతోంది.
హైదరాబాద్, ఆగస్టు 15: రానున్న శాసనసభ సమావేశాలను అమరావతిలో నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నామని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శాసనసభ ఆవరణలో సోమవారం ఆయన పతాకావిష్కరణ చేసిన అనంతరం కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాలు అమరావతిలో జరిగేలా చూస్తానని, ఈ విషయమై ప్రభుత్వంతో చర్చిస్తానని చెప్పారు.
విశాఖ : ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా నుంచి కోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. కోస్తా, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది.
విజయవాడ: కృష్ణా పుష్కరాల నిర్వహణపై పోలీస్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితమే విజయవాడ నుంచి భాగ్యనగరానికి బయల్దేరారు. హైదరాబాద్ రాజ్భవన్లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఇచ్చే తేనీటి విందులో చంద్రబాబు పాల్గొంటారు.
విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో సోమవారం 100 అడుగుల త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య పుట్టిన జిల్లాలో తాను 100 అడుగుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నవంబర్లోగా గన్నవరం విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవన నిర్మాణం పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతపురం: అనంతపురం జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కంకణం కట్టుకుందని, ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ ఆశయం పేరుతో జిల్లాకు 6,554 కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్యాకేజీని అమలు చేస్తామని ఎపి సిఎం చంద్రబాబు ప్రకటించారు. ఇక్కడ సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత ఆయన మాట్లాడుతూ, ఈ జిల్లాపై దివంగత నేత ఎన్టీఆర్కు ఎంతో ప్రేమ ఉండేదన్నారు.
విజయవాడ: సాగర సంగమం ఘాట్ దగ్గర పోలీసుల ఆంక్షలపై డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కోడూరు మండలం సాగర సంగమం ఘాట్ దగ్గర పరిస్థితిని చక్కదిద్దాలంటూ ఎస్పీకి మండలి సూచించారు.