-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్, ఆగస్టు 13: వయసుకు, టెక్నాలజీకి సంబంధం లేదు... నేర్చుకోవాలన్న తపనకు వయసు ఆటంకం కాదు. సాంకేతిక పరిజ్ఞానానికి ఆయనొక చిరునామా. సీఎంగా కంటే సీఈఓగా పిలిపించుకోవడమే ఆయనకు ఇష్టం. అలాంటి వ్యక్తి పుష్కరాల వంటి భారీ ఈవెంటుకు సాంకేతిక సొబగులు అద్దారు. తానే స్వయంగా ఆపరేషనల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చుని పుష్కర ఏర్పాట్లు, లోటుపాట్లను పర్యవేక్షిస్తున్నారు.
విజయవాడ, ఆగస్టు 13: కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసం వద్ద ఉన్న కృష్ణా తీరంలో తన పితృ దేవతలకు శనివారం పిండ ప్రదానం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అతని మామ ఎన్టి రామారావుకు, ఆయన సతీమణి బసవరామ తారకంకు, ఆయన తండ్రి ఖర్జూరనాయుడు, తల్లి అమ్మన్నమ్మకు, పితృదేవతలకు, రాష్ట్రంలో దివంగతులైన వారందరికీ పిండ ప్రదానం చేశారు.
అనంతపురం, ఆగస్టు 13: మరికొన్ని గంటల్లో 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు భారతావని సమాయత్తమవుతోంది. వీధివీధినా వాడవాడలా త్రివర్ణ పతాకాల రెపరెపలతో దేశభక్తి పరవళ్ళు తొక్కుతోంది. ఇటు స్వేచ్ఛా నిరతిని, అటు జాతీయ స్ఫూర్తిని చాటుకుంటూ వందల-వేల అడుగుల పొడవైన జెండాలతో జనం పరవశిస్తున్నారు. అలాంటి ఓ అద్భుత దృశ్యం అనంతపురంలో ఆవిష్కృతమైంది.
హైదరాబాద్, ఆగస్టు 13: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సచివాలయాన్ని తరలించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఇప్పటికే శాఖాధిపతుల కార్యాలయాలు అన్నీ హైదరాబాద్ నుండి గుంటూరు, విజయవాడ, ఇబ్రహీంపట్నం పరిసరాలకు తరలివెళ్లాయి. సచివాలయంలో కూడా వివిధ విభాగాలు ఒకేచోట కేంద్రీకృతం చేయడానికి వీలు లేకపోవడంతో కొన్ని శాఖలు స్వతంత్రంగా భవనాలను తీసుకుని కార్యాలయాలను ఏర్పాటు చేశాయి.
విజయవాడ, ఆగస్టు 13: ‘ఒకాయనకు పుష్కరాలు సాఫీగా, విజయవంతంగా జరగటం ఇష్టం లేదు. రేపో మాపో మరో అవాంతరం సృష్టించినా ఆశ్చర్యపోవలసిన పని లేదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు విపక్ష నేత జగన్పై ధ్వజమెత్తారు. ‘గతంలో పట్టిసీమ ప్రాజెక్టుకు అడ్డుపడ్డాడు. ఇప్పుడు పోలవరం నిర్వాసితుల్ని రెచ్చగొడుతున్నాడు. మరోవైపు రాజధాని నిర్మాణంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ ప్రచారం చేస్తున్నాడు.
గన్నవరం/పటమట, ఆగస్టు 12: కృష్ణా పుష్కరాల తొలిరోజు శుక్రవారం విజయవాడలో అపశ్రుతులు దొర్లాయి. పండింట్ నెహ్రూ బస్టాండ్ ఎదురుగా వున్న పద్మావతి ఘాట్లో ఐదేళ్ల బాలుడు కిరణ్ కుమార్ పడి మృతి చెందాడు. మర్వాడి గుడి దగ్గరలోని పద్మావతి ఘాట్ చివర మధ్యాహ్నం 3 గంటల సమయంలో పారిశుద్ధ్య కార్మికులు ఘాట్ను శుభ్రం చేస్తుండగా బాలుడు ఘాట్ నీటిలో మృతి చెంది పడి వుండటాన్ని గమనించి అధికారులకు సమాచారమిచ్చారు.
తిరుపతి, ఆగస్టు 12: తిరుమల శ్రీవారి దేవేరి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఉదయం వరలక్ష్మీవ్రతం వైభవంగా జరిగింది. వేకువజామున అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన , నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని ఆస్థాన మండపంలో వేంచేపు చేశారు.
దేవరకొండ, ఆగస్టు 12: చంద్రబాబునాయుడు ఉన్నంత కాలం తాను ఆంధ్రప్రదేశ్లో పుణ్యస్నానాలు ఆచరించనని మాజీ ముఖ్యమంత్రి ఎన్టి ఆర్ సతీమణి, వై ఎస్ ఆర్సిపి నాయకురాలు లక్ష్మీపార్వతి చెప్పారు. శుక్రవారం ఆమె నల్లగొండ జిల్లా చందంపేట మండలం పెద్దమునిగల్ పుష్కరఘాట్ వద్ద పుణ్యస్నానమాచరించారు. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి విలేకరులతో మాట్లాడుతూ తనకు మొదటి నుండి తెలంగాణ అంటే ఎంతో అభిమానమన్నారు.
విజయవాడ, ఆగస్టు 12: పవిత్ర కృష్ణా నదీ పుష్కరాలు ఆరంభమయ్యాయి. ఇది ప్రారంభం మాత్రమే. మిగిలిన 11 రోజులు అధికారులు మరింత బాధ్యతాయుతంగా, అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పుష్కరాలకు తరలి వస్తున్న భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
విజయవాడ, ఆగస్టు 12:కృష్ణా నదీతీరం పవిత్ర పుష్కర స్నానాలతో పులకించింది. పనె్నండేళ్ల కోసారి వచ్చే పుష్కరాల తొలి రోజైన శుక్రవారం లక్షలాదిగా జనం తరలి వచ్చి పుణ్యస్నానాలాచరించారు. సంప్రదాయం, భక్తిపారవశ్యం అడుగడుగునా అన్ని ఘాట్లలోనూ గోచరించాయి. పవిత్ర మంత్రోచ్ఛరణలతో అన్ని ఘాట్లూ దివ్యానుభూతిని కలిగించాయి.