S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/24/2016 - 04:49

రాజమహేంద్రవరం, జూలై 23: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం లొసుగులమయంగా మారుతోంది. నిర్వాసితుల నుంచి తీసుకున్న భూమికి భూమి కేటాయిస్తామనే హామీ పూర్తి స్థాయిలో నెరవేరలేదు. ఉదాహరణకు తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం అంగుళూరు గ్రామంలో గిరిజనుల నుండి 57 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇప్పటివరకూ ఆ భూమికి భూమి కేటాయించలేదు.

07/24/2016 - 04:49

గుంటూరు, జూలై 23: కృష్ణాజలాల పంపిణీలో రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతోందని ఏపి జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎగువన పుష్కలంగా వర్షాలుకురిసి వరద నీరు ఉన్నప్పటికీ దిగువకు నీటి విడుదల విషయంలో కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. శనివారం జలవనరులశాఖ చీఫ్ ఇంజనీరు కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.

07/24/2016 - 04:48

తిరుమల, జూలై 23: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ప్రముఖ ఆటోమొబైల్ రంగానికి చెందిన మహేంద్ర అండ్ మహేంద్ర సంస్థ ప్రతినిధులు రూ.6.5 లక్షల విలువగల కెయువి 100 కొత్త మోడల్ కారును బహూకరించారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద శనివారం ఉదయం కారుకు పూజలు నిర్వహించి డిప్యూటీ ఇఓ కోదండరామారావుకు తాళాలు అందజేశారు.

07/24/2016 - 04:43

విజయవాడ, జూలై 23: ప్రజా సాధికారిక సర్వేలో క్షేత్రస్థాయిలో ఉత్పన్నమవుతున్న సమస్యలను ఎన్యూమరేటర్లు, పర్యవేక్షకులకు ఎప్పటికప్పుడు తెలిపేందుకై విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాష్టస్థ్రాయిలో కమాండ్ కంట్రోల్ రూంను ప్రారంభించారు. ఇక్కడ సిబ్బంది రెండు షిఫ్టులలో పనిచేయటంతోపాటు 24 గంటలు కంట్రోల్ రూం ద్వారా సేవలు అందిస్తారని, ఎన్యూమరేటర్లకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా సమకూర్చామని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు.

07/24/2016 - 04:42

విశాఖపట్నం(క్రైం), జూలై 23: స్కూలు బస్సు ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మధురవాడ సమీపంలోని మారికవలసలో ఉంటున్న గుంటురెడ్డి కిషోర్‌కుమార్(30) నగరంలోని కేర్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం తల్లి రేవతి(55), కుమార్తె వర్షిణి(6)తో కలిసి మోటార్ బైక్‌పై నగరం నుండి ఎండాడ మీదుగా మారికవలసలోని ఇంటికి బయలు దేరారు.

07/24/2016 - 04:41

ఒంగోలు అర్బన్, జూలై 23: రాష్ట్ర మాజీ మంత్రి గుర్రాల వెంకట శేషు (71) శనివారం తెల్లవారుజామున ఒంగోలులో గుండెపోటుతో కన్నుమూశారు. శేషు 1989 నుండి 94 వరకు సంతనూతలపాడు శాసనసభ్యునిగాను, 1989 నుండి 90 వరకు మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో పాడి పరిశ్రమ, క్రీడలు, లిడ్‌క్యాప్ శాఖ మంత్రిగా పని చేశారు. 2007-09 వరకు శాసనమండలి సభ్యునిగా పని చేశారు. 2009లో కొండెపి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు.

07/24/2016 - 04:40

సీతానగరం, జూలై 23: పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రానికి వలసవెళ్లిన యువకులు ఊహించని రీతిలో మృత్యువాత పడిన సంఘటన చెన్నైలోని పెరుంబూర్‌లో చోటుచేసుకుంది.

07/24/2016 - 03:24

హైదరాబాద్, జూలై 23:బీసీల పార్టీగా పేరున్న తెలుగుదేశం అత్యంత వెనుకబడిన కులాల (ఎంబీసీ)పై పూర్తి స్థాయి దృష్టి సారించింది. జనాభాలో బీసీలే ఎక్కువ సంఖ్యలో ఉండగా, వారిలో కూడా ఎంబీసీలే ఎక్కువ సంఖ్యలో ఉన్నందున, వారిని ఆకర్షించే ప్రణాళికలకు పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో తొలిసారి ఏర్పాటయిన ఎంబీసీ కార్పొరేషన్ లక్ష్యం కూడా అదే.

07/24/2016 - 03:21

పామూరు, జూలై 23: ప్రకాశం జిల్లా పామూరు మండలంలోని బలిజపాలెం, కోడిగుంపల, బొట్లగూడూరు, కంభాలదినె్న గ్రామాల్లో శనివారం ఉదయం 6.20 గంటలకు, 7.10 గంటలకు రెండుసార్లు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. పామూరు మండలంలో దాదాపు ఇరవై ఐదుసార్లు భూమి కంపించిందని ప్రజలు తెలిపారు.

07/24/2016 - 03:21

నెల్లూరు, జూలై 23: నెల్లూరు జిల్లాలో నెలకొల్పనున్న అణు విద్యుత్ కర్మాగారం ప్రతిపాదనల్ని ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల్లూరులో శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్ అవసరాలు ఎనిమిది వేల మెగావాట్లు సరిపోతాయని, ఇప్పటికే ప్రభుత్వం 30 వేల మెగావాట్లకు అనుమతులు మంజూరు చేసిందన్నారు.

Pages