S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/23/2016 - 12:34

విశాఖ: తమిళనాడులో అదృశ్యమైన వైమానికదళ విమానంలో ప్రయాణిస్తూ ఆచూకీ లేకుండా పోయిన విశాఖ వాసుల కుటుంబాలను ఎపి సిఎం చంద్రబాబు శనివారం ఇక్కడ పరామర్శించారు. అదృశ్యమైన విమానంలో విశాఖ ప్రాంతానికి చెందినవారు 8 మంది ఉన్నారు. బాజీ జంక్షన్‌, బుచ్చిరాజుపాలెంలోని ఎన్‌ఏడీ ఉద్యోగుల కుటుంబాలను పరామర్శించి బాధితులకు ధైర్యం చెప్పారు. చిన్నారావు, నాగేందర్‌రావు కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి పరామర్శించారు.

07/23/2016 - 12:07

విజయవాడ: ఆధునిక టెక్నాలజీ సాయంతో నేరాలను నియంత్రించి శాంతి భద్రతలను కాపాడతామని ఎపి డిజిపిగా బాధ్యతలు చేపట్టిన నండూరి సాంబశివరావు శనివారం తెలిపారు. పదవీ విరమణ చేస్తున్న డిజిపి జెవి రాముడు నుంచి ఆయన బాధ్యతలు చేపట్టారు. తనను డిజిపిగా ఎంపిక చేసినందుకు సిఎం చంద్రబాబుకు నండూరి కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు శాఖలో నిత్యం ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ రాష్ట్రానికి సేవలందిస్తానని ఆయన చెప్పారు.

07/23/2016 - 12:04

విజయవాడ: ఎపి డిజిపి జెవి రాముడు శుక్రవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఇక్కడి పరేడ్ గ్రౌండ్స్‌లో పోలీసులు ఘనంగా వీడ్కోలు పలికారు. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రకు తొలి డిజిపిగా గత రెండున్నరేళ్ల కాలంలో రాముడు విశేష సేవలందించారని పలువురు పోలీసు అధికారులు గుర్తు చేశారు. నూతన డిజిపిగా ఆర్టీసీ ఎండి నండూరి సాంబశివరావు బాధ్యతలు చేపట్టారు.

07/23/2016 - 11:52

శ్రీశైలం: జూరాల నుంచి శుక్రవారం ఏడు గేట్లు ఎత్తి 69,540 క్యూసెక్కుల నీటిని దిగువ శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి ఈ ఏడాది ఆలస్యంగానైనా ఇన్‌ఫ్లో మొదలయింది. ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల ఆనకట్టల వద్ద నీటిమట్టం గరిష్ఠస్థాయి చేయడంతో ఆయా జలాశయాలకున్న ప్రవాహాలను బట్టి దిగువకు వరదనీటిని వదులుతున్నారు.

07/23/2016 - 07:07

విజయవాడ, జూలై 22: రాష్టవ్య్రాప్తంగా సంచలనం కలిగించిన విజయవాడ స్వర్ణ బార్ మద్యం మరణాల కేసులో ఫోరెన్సిక్ నివేదిక బహిర్గతమైంది. బార్‌లో మద్యం సేవించి పలువురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. కాగా.. మద్యం శాంపిల్స్‌ను పరీక్షించిన ఫోరెన్సిక్ ల్యాబ్ మద్యంలో సైనెడ్, ఇథైల్ ఆల్కాహాల్ కలిసినట్లు నిర్థారించింది.

07/23/2016 - 07:06

హైదరాబాద్, జూలై 22: రాజకీయ పార్టీలకు ప్రభుత్వ భూములను రాజధాని అమరావతితో పాటు జిల్లా కేంద్రాల్లో ఇవ్వాలన్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వైకాపా తీవ్రంగా వ్యతిరేకించింది. వెంటనే ఈ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. అసెంబ్లీలోరాజకీయ పార్టీలకు సీట్లను బట్టి భూములు, స్ధలాన్ని కేటాయించాలన్న ప్రభుత్వం నిర్ణయం దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు.

07/23/2016 - 07:00

హైదరాబాద్, జూలై 22: కేంద్రం నుంచి తగినంత సహాయం రాకపోయినా, సంక్షేమం కోసం వేల కోట్లు వెచ్చిస్తు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, దానికి తగిన ప్రచారం రావడం లేదని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

07/23/2016 - 06:27

విశాఖపట్నం, జూలై 22: చెన్నై నుంచి పోర్టు బ్లెయిర్‌కు వెళ్తున్న వాయుసేన విమానం (ఎఎన్ 32) అదృశ్యమైన ఘటనలో విశాఖ నేవల్ ఆర్మ్‌డ్ డిపో (ఎన్‌ఎడి)కి చెందిన సిబ్బంది ఎనిమిదిమంది ఉన్నారు.

07/23/2016 - 06:12

విజయవాడ, జూలై 22:ఆంధ్రప్రదేశ్‌లో సిరామిక్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. కృష్ణ, గోదావరి జిల్లాల్లో ఏదైనా అనువైన ప్రదేశంలో మూడు వేల ఎకరాల్లో సిరామిక్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. గుజరాత్‌లోని మోర్బీ నుంచి వచ్చిన సిరామిక్ పారిశ్రామికవేత్తలతో శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి భేటీ అయ్యారు.

07/23/2016 - 05:44

విజయవాడ, జూలై 22: పుష్కరాలకు కొద్ది రోజుల ముందే పనులు పూర్తి చేసుకుంటే, అన్నీ సవ్యంగా జరిగి ఉండేవి. పుష్కరాలకు కేవలం ఒక నెల రోజుల ముందు పనులు మొదలుపెట్టడంతో అవి అడ్డదిడ్డంగా జరుగుతున్నాయి. నాణ్యత ఎలాగూ లేదు. కనీసం భద్రత కూడా కరువయ్యే పరిస్థితి నెలకొంది. పుష్కరాల సమయంలో ఘాట్‌లు తడిగా, చిత్తడిగా ఉంటాయి. కాలేస్తే జారిపోయే పరిస్థితి ఉంటుంది. దాన్ని దృష్టిలోపెట్టుకుని ఘాట్‌ల నిర్మాణం చేపట్టాలి.

Pages