-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
గుంటూరు, జూన్ 19: ఆంధ్రప్రదేశ్ రాజధానికి భూములిచ్చిన రైతులకు నేటినుంచి ప్లాట్ల పంపిణీ జరగనుంది. సోమవారం నేలపాడు గ్రామం నుంచి పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. లాటరీ పద్ధతిన రైతులు కోరుకున్న ప్రాంతాల్లో ప్లాట్లను సీఆర్డీఎ అధికారులు కేటాయిస్తారు. సాయంత్రం 4 గంటలకు నేలపాడు సిఆర్డీఎ కార్యాలయానికి రైతులు తరలిరావాలని అధికారులు కోరారు.
హైదరాబాద్, జూన్ 19 :ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది. నైరుతీ రుతుపవనాలు ఆదివారం వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పూర్తిగా విస్తరించి మధ్యభారత్, ఉత్తర భారత్లో విస్తరిస్తున్నాయని తెలిపారు.
హైదరాబాద్, జూన్ 19: రాష్ట్రంలో విద్యుత్ పొదుపును ఉద్యమంలా చేపట్టే కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 20వ తేదీ సోమవారం పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో శ్రీకారం చుట్టనున్నారు. విద్యుత్ పొదుపు సంరక్షణ విధానాల్లో రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలపై ఏపిఇఆర్సి చైర్మన్ జస్టిస్ భవానీ ప్రసాద్ సమీక్షించారు.
అమలాపురం, జూన్ 19: సాగులో ఎదురవుతున్న సమస్యల కారణంగా మరోసారి పంట విరామం దిశగా తూర్పు గోదావరి జిల్లా కోనసీమ రైతాంగం సమాయత్తమవుతోంది. 2011లో ఒకసారి కోనసీమ రైతాంగం పంటవిరామం ప్రకటించి, పొలాలను బీళ్లుగా వదిలేసిన సంగతి విదితమే. కోనసీమలో 1.5 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. ఈ నేపథ్యంలో మరోసారి రైతాం గం అదేబాటలో నడవాలని యోచిస్తోంది.
అల్లవరం, జూన్ 19: ప్రభుత్వం సకాలంలో సాగునీరు అందించని కారణంగా పంట విరామం పాటించాలని తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని అల్లవరం మండలానికి చెందిన అయిదు గ్రామాల రైతులు నిర్ణయించారు. మండలంలోని రెల్లుగడ్డ గ్రామంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయించారు.
రాజమహేంద్రవరం, జూన్ 18: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష మరో రెండు రోజులు తప్పదని తెలుస్తోంది. తుని ఘటనలో అరెస్టయి రిమాండ్లో ఉన్న 13 మంది బెయిల్పై విడుదలైన తర్వాతే దీక్ష విరమిస్తానని షరతు పెట్టిన ముద్రగడ పద్మనాభం దీక్ష సోమవారం వరకు సాగే పరిస్థితి ఎదురైంది.
సింహాచలం, జూన్ 18: సింహాచలం.. ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి. ప్రపంచంలో మరెక్కడా కానరాని వరాహ, నారసింహ అవతారాల కలయికతో శ్రీ మహావిష్ణువుఆవిర్భవించాడని, ఈ క్షేత్రాన్ని దేవతలు నిర్మించారని, ఇదొక అద్భుత ఆధ్యాత్మిక కేంద్రమని మాత్రమే ఇన్నాళ్ళు మనకు తెలుసు.
విశాఖపట్నం, జూన్ 18: విశాఖ శ్రీ శారదాపీఠ పరిపాలిత ఫిల్మ్నగర్ (హైదరాబాద్) దైవసన్నిధానంలో మహా కుంభాభిషేక మహోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి ఉత్సవాలను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండ మాణిక్యాల రావు, రాజమండ్రి ఎంపి మురళీమోహన్, దేవాదాయ శాఖ కమిషనర్ వైవి అనురాధ తదితరులు కుంభాభిషేకంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
చిత్తూరు, జూన్ 18: ఎర్రచందనం అక్రమ రవాణాలో బడా స్మగ్లర్లకు మధ్యవర్తిగా ఉంటూ ఆర్ధిక లావాదేవీలను నిర్వహిస్తున్న కోల్కతాకు చెందిన మహిళా స్మగ్లర్ సంగీతా చటర్జీ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఇటీవల చిత్తూరు పోలీసులు కోల్కతాలో ఆమె ఇంటిపై దాడులు నిర్వహించి రెండన్న కిలోల బంగారు, కిలో వెండి ఆభరాణాలు పలు అపార్ట్ మెంట్లకు సంబంధించి పత్రాలు , నకిలీ గన్లైసెన్సును స్వాధీనం చేసుకొన్నారు.
సింహాచలం, జూన్ 18: రాష్ట్ర విద్యా, మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం అడవివరంలోని మహాత్మ జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాన్ని సందర్శించారు. పాఠశాల దయనీయ పరిస్థితిని కళ్లారా చూసిన మంత్రి చలించిపోయారు. అస్తవ్యస్తంగా ఉన్న విదార్థుల వసతి గదులు, విరిగి పోయిన మంచాలు, తలుపు, విద్యుత్దీపాలు, ఫ్యాన్లు లేక శిథిలమైపోయివున్న గదులు, పురుగులు తేలియాడుతున్న నీరు..