-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, మే 26: ఈ ఏడాది ఏప్రిల్లో నిర్వహించిన ఆంధ్ర ప్రదేశ్ ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలను మంత్రి గంటా గురువారం విడుదల చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు 63.86 శాతం మంది, పదో తరగతి పరీక్షల్లో 61.43 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఎస్ఎస్సిలో 81.83 శాతం ఫలితాలతో విశాఖ జిల్లా మొదటి స్థానంలో ఉంది. 80.52 శాతంతో అనంతపురం జిల్లా రెండో స్థానంలో, 75.72 శాతంతో పశ్చిమ గోదావరి మూడో స్థానంలో ఉంది.
ఒంగోలు/నెల్లూరు, మే 26: ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. తాజాగా ప్రకాశంలో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సమక్షంలో త్వరలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని వినికిడి. ఈమేరకు మంతనాలు కూడా జరిగాయని విశ్వసనీయంగా తెలిసింది.
విశాఖపట్నం, మే 26: రాష్ట్రంలో తెలుగు భాష, సాహిత్యానికి సంబంధించి విధానాన్ని తిరుపతిలో జరుగనున్న మహానాడులో ప్రకటించాలని లోక్నాయక్ ఫౌండేన్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ యార్లగడ్ల లక్ష్మీ ప్రసాద్ డిమాండ్ చేశారు. విశాఖలో గురువారం విలేఖరులతో మాట్లాడుతూ తిరుపతిలో జరుగనున్న మహానాడులో ఈ విషయాన్ని చర్చించి విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
విశాఖపట్నం, మే 26: ఎండలు మండుతున్నాయి. వాయువ్య దిశగా వస్తున్న వేడుగాలులతో వడగాల్పులు వీస్తున్నాయి. గురువారం కోస్తాలో సాధారణ స్థాయి కంటే నాలుగు నుంచి ఆరు డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రాయలసీమలో మాత్రం రెండు డిగ్రీలు అధికంగా నమోదైంది. రాష్ట్రంలో మరో 24 గంటల పాటు వడగాల్పులు కొనసాగుతాయని విశాఖలోని తుపాను హెచ్చరిక కేంద్రం అధికారులు గురువారం రాత్రి తెలిపారు.
తుళ్లూరు, మే 26: రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రుణ సాయం అందించేందుకు సూచనప్రాయంగా అంగీకరించింది. ఈ క్రమంలో రాజధాని ప్రాంతంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు గురువారం పర్యటించారు. వెలగపూడి తాత్కాలిక సచివాలయం, కృష్ణాతీర ప్రాంతంలో పర్యటించిన ప్రపంచబ్యాంకు బృందం తుళ్లూరు సీఆర్డీయే కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు.
విశాఖపట్నం, మే 26: విశాఖ నగరంలో 11 నెలల చిన్నారి కిడ్నాప్ కలకలం సృష్టించింది. నగరంలోని మద్దిలపాలెం పిఠాపురం కాలనీలో ఒక అపార్టుమెంట్లో వాచ్మెన్గా పని చేస్తున్న రాంబాబు, సుధారాణి కుమారుడు 11 నెలల నవదీప్ గురువారం కిడ్నాప్కు గురయ్యాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో బాలుడిని సెల్లార్లో ఉయ్యాలలో నిద్రపుచ్చి రాంబాబు, సుధారాణి తమ పనులు చూసుకుంటున్నారు.
విశాఖపట్నం, మే 26: ఎపిఎంసెట్-2016లో ర్యాంక్లు దక్కించుకున్న విశాఖకు చెందిన విద్యార్థులు టిఎంసెట్లోనూ ర్యాంక్లు సాధించారు. విశాఖకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎపిఎంసెట్లో, టిఎంసెట్లో మొదటి పది ర్యాంక్ల్లో ఉండటం గమనార్హం. ఎపిఎంసెట్లో ఇంజనీరింగ్లో మొదటి ర్యాంక్ సాధించిన ఎస్.వంశీకృష్ణారెడ్డి టిఎంసెట్లో 10వ ర్యాంక్ సాధించాడు.
మడకశిర, మే 26: ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ అధికారం చేపట్టిన రెండేళ్ల కాలంలో జరిపిన విదేశీ పర్యటనల కారణంగా దేశంలో ఆహార ఉత్పత్తులు, వస్తువుల ఎగుమతులు తగ్గిపోయి తీరని నష్టం జరిగిందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు.
కాకినాడ, మే 26: ఈసెట్-2016 రెండవ రోజైన గురువారం ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రంలో ఆరు రీజినల్ సెంటర్ల పరిధిలోని 79 కేంద్రాల్లో ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. అన్ని కేంద్రాల్లో రెండవ రోజుపరీక్షలు జరిగినట్టు జెఎన్టియుకె ఓ ప్రకటనలో తెలిపింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగానికి సంబంధించి 7468 మంది దరఖాస్తు చేసుకోగా 6563మంది హాజరయ్యారు. 88.87 శాతం హాజరు నమోదయ్యింది.
రేణిగుంట, మే 26: కోట్ల విలువచేసే డికెటి భూములను చిత్తూరు జిల్లా సహకార బ్యాంక్ అధికారులు వేల రూపాయలకే అప్పనంగా అందించిన వైనం తిరుపతి సబ్ కలెక్టర్ హిమాంశు శుక్లా పరిశీలనలో వెలుగుచూసింది. తీవ్రంగా స్పందించిన ఆయన తక్షణం ఆ భూములను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ భూములని బోర్డు పెట్టాలని ఈనెల 5వ తేదీన రేణిగుంట తహశీల్దార్ను ఆదేశించారు.