S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/09/2015 - 13:44

విజయవాడ : 2019నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు. ఆయన బుధవారంనాడు ఢిల్లీ బయలుదేరే ముందు నీరు-ప్రగతిపై తన నివాసంలో మంత్రులు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 28న నీరు-ప్రగతిపై ప్రాంతీయ సదస్సును నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

12/09/2015 - 13:42

తిరుపతి : తిరుపతి పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండవరోజు అమ్మవారు పెద్ద శేష వాహనంపై ఊరేగారు. అమ్మవారిని దర్శించుకోవటానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఏడుపడగల వాహనంపై సర్వాలంకార భూషితయైన అమ్మవారు భక్తులకు అభయప్రదానం చేశారు.

12/09/2015 - 11:31

విశాఖ:నగర శివారులోని మారికవలసవద్ద బుధవారం ఉదయం ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 15మంది గాయపడగా అందులో నలుగురి పరిస్థితి విషమంగా వుంది. క్షతగాత్రులందరినీ ఆస్పత్రికి తరలించారు.

12/09/2015 - 11:30

విజయవాడ:2018 నాటికి పోలవరం సాగునీటి ప్రాజెక్టును పూర్తిచేస్తామని ఎపి సిఎం చంద్రబాబు చెప్పారు. ఆయన బుధవారం మంత్రులు, ఇరిగేషన్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పోలవరం పనుల తీరును తెలుసుకున్నారు. నీరు-ప్రగతి కార్యక్రమాన్ని ప్రజలందరూ ముందుకు తీసుకెళ్ళాలని ఆయన పిలుపునిచ్చారు. కరువు రహిత రాష్ట్రంగా ఎపిని తీర్చిదిద్దేందుకు అందరూ కృషిచేయాలన్నారు.

12/09/2015 - 11:30

ఏలూరు:జీలుగుమిల్లి మండలం పాకాలగూడెం వద్ద మంగళవారం అర్థరాత్రి అడవిలో ఓ అంగతకుడు పుర్రెలు, ఎముకలు పెట్టి క్షుద్రపూజ జరిపాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఆ వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే, వారి కళ్ళుగప్పి ఆ అగంతకుడు పరారయ్యాడు. అపరిచిత వ్యక్తుల సంచారంపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

12/09/2015 - 11:28

విశాఖ:పాడేరు ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి. ఉదయం 9 గంటల సమయంలో కూడా మంచు కురుస్తున్నందున రహదారులు కన్పించడంలేదు. లంబసింగి, మినుములూరులో 9 డిగ్రీలు, పాడేరులో 11, చింతపల్లిలో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

12/09/2015 - 11:28

విజయవాడ:ఆంధ్రప్రదేశ్‌లో దుర్భిక్ష పరిస్థితులను అంచనా వేసేందుకు ఢిల్లీనుంచి కేంద్ర ప్రతినిధుల బృందం బుధవారం నుంచి పర్యటిస్తోంది. కర్నూలు, ప్రకాశం, కృష్ణా, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఈ బృందం పర్యటించి రైతులను, స్థానిక అధికారులను కలుసుకుంటుంది.

12/09/2015 - 11:27

శ్రీకాకుళం:ఇక్కడి ట్రెజరీ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న యలమంచిలి భారతీలక్ష్మికి చెందిన ఆస్తులపై బుధవారం ఉదయం ఏసిబి అధికారులు సోదాలు ప్రారంభించారు. శ్రీకాకుళం, విశాఖ, హైదరాబాద్‌లలో ఆమె ఆస్తులపై ఏకకాలంలో దాడులు చేసి భారీ స్థాయిలో అక్రమాస్తులు వున్నట్లు కనుగొన్నారు. ఒక్క శ్రీకాకుళంలోనే ఆమెకు కోటి రూపాయల మేరకు ఆస్తులున్నట్లు కనుగొన్నారు.

12/09/2015 - 11:27

కాకినాడ: చింతూరు మండలం వేగితోటవద్ద బుధవారం ఉదయం గిరిజనులమధ్య ఘర్షణ చోటుచేసుకోగా పరస్పరం బాణాలతో దాడులకు దిగారు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరిని భద్రాచలం ఆస్పత్రికి తరలించారు.

12/08/2015 - 16:01

విజయవాడ : కల్తీ మద్యం సేవించి మృతి చెందినవారి కుటుంబాలను వైఎస్ జగన్ మంగళవారం పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామని ఆయన వెల్లడించారు.

Pages