S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/22/2020 - 04:34

విజయవాడ, మార్చి 21: కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని, దీనికి ప్రజలు కూడా పూర్తిస్థాయిలో సహకరించాలని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) కోరారు. కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను శనివారం ఇక్కడ డా. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరించారు.

03/22/2020 - 04:28

ఆళ్లగడ్డ/ఉయ్యాలవాడ, మార్చి 21: కర్నూలు జిల్లాల్లో శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి రైతులకు భారీ నష్టం వాటిల్లింది. గాలి, వడగండ్ల వాన కురవడంతో ఆళ్లగడ్డ మండలం పడకండ్ల, పి.నాగిరెడ్డిపల్లె, జంబులదినె్న, బాచ్చాపురం, రుద్రవరం గ్రామాల్లో చేతికొచ్చే వరి, మొక్కజొన్న, కొర్రలు, మునగ, అరటి తోటలు నేలకొరిగింది. ఉయ్యాలవాడ మండలం వర్షానికి వరి, మినుపు, మిరప, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి.

03/22/2020 - 04:28

విజయవాడ, మార్చి 21: ఏపీలో కూడా కేరళ రాష్ట్రం తరహాలో కరోనాను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోందని, ఈ ప్రమాదం మన ఆంధ్రప్రదేశ్‌కు కూడా వ్యాపించడం దురదృష్టకరమన్నారు.

03/22/2020 - 04:26

విజయవాడ, మార్చి 21: దేశంలో ప్రస్తుతం అత్యంత ప్రమాదకరమైన కరోనా రెండో దశలో ఉందని, ఇది మూడో దశలోకి ప్రవేశించకుండానే ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచనలన్నీ తప్పక పాటిద్దామని రాజ్యసభ సభ్యుడు వై సుజనాచౌదరి రాష్ట్ర ప్రజలకు పిలుపిచ్చారు. అందరం కలసికట్టుగా కరోనాపై విజయం సాధిద్దామని శనివారం ఆయన ఒక ప్రకటనలో ఆకాంక్షించారు.

03/22/2020 - 04:25

గుంటూరు, మార్చి 21: జాతీయ విపత్తులా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంటే ప్రజల ప్రాణాలను గాలికొదిలేసి స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధానమన్నట్లు ముఖ్యమంత్రి, మంత్రులు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. శనివారం మంగళగిరి సమీపంలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

03/22/2020 - 04:25

గుంటూరు, మార్చి 21: ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తుంటే రాష్ట్రాన్ని జగరోనా వణికిస్తోందని, కరోనా కంటే వైసీపీ నేతలు ప్రమాదకరంగా తయారయ్యారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావ్ విమర్శించారు. శనివారం మంగళగిరి సమీపంలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం నుండి ఆయన ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

03/22/2020 - 04:24

గుంటూరు, మార్చి 21: ఒకపక్క ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌తో పాటు రాష్ట్రంలో జగన్ సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న ఎన్నికల తంతు ప్రమాదకరంగా ఉందని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శించారు. మంగళగిరి సమీపంలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

03/22/2020 - 04:22

విజయవాడ (సిటీ), ఫిబ్రవరి 21: స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతలు ఇచ్చే డబ్బు, మద్యాన్ని తీసుకునేందుకు ఓటర్లు నిరాకరించారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వీ విజయసాయిరెడ్డి అన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కే పరిమతం అవుతామనే భయం చంద్రబాబుకు పట్టుకుందని శనివారం ట్విట్టర్‌లో విమర్శించారు. తన మనుగడ గోసం చంద్రబాబు కులం, ప్రాంతం కార్డులను వాడతున్నారన్నారు.

03/22/2020 - 01:44

అమరావతి: రాజ్యసభ ఎన్నికల నిర్వహణపై సస్పెన్స్ నెలకొంది. రాష్ట్రంలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు ఈ నెల 26న ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణల గడువు పూర్తయింది. నాలుగు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఎన్నిక అనివార్యమైంది.

03/22/2020 - 01:43

గుంటూరు: మానవాళిని హరించేందుకు ముంచుకొచ్చిన కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా చైతన్యవంతులైన జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొనాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుమేరకు ఆదివారం ఉదయం 7నుండి రాత్రి 9గంటల వరకు ప్రజలు ఇళ్లలోనే గడపాలని, తప్పనిసరై ఎవరైనా బయటకు రావాల్సివస్తే తగిన జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు.

Pages