S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/19/2020 - 05:28

గుంటూరు, మార్చి 18: రాష్ట్ర ఎన్నికల కమిషన్ తన పరిధి దాటిందని, రాజ్యాంగం ప్రకారం తాను చేయాల్సిన పనికాకుండా ఎస్‌ఈసీ వ్యవహరించిందని సుప్రీం కోర్టు తీర్పు ద్వారా ప్రజలకు అర్థమైందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

03/19/2020 - 05:27

విజయవాడ (సిటీ), మార్చి 18: రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 4న ప్రథమ సంవత్సరం పరీక్షతో ప్రారంభమై బుధవారం ద్వితీయ సంవత్సరం పరీక్షతో ముగిశాయి. ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఇంటర్మీడియట్ పరీక్షలను అధికారులు నిర్వహించారు.

03/19/2020 - 05:26

విజయవాడ, మార్చి 18: కరోనా నేపథ్యంలో స్థానిక ఎన్నికల వాయిదా సరైనదేనని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సీపీఎం రాష్ట్ర కమిటీ స్వాగతిస్తోందని రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ పట్ల ప్రభుత్వ బాధ్యతను ఈ తీర్పు సూచిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం యంత్రాంగాన్ని కదిలించి కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్త చర్యలూ తీసుకోవాలని ఆయన కోరారు.

03/19/2020 - 05:25

విజయవాడ, మార్చి 18: స్థానిక ఎన్నికలు వాయిదాపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేయడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు డా. సాకే శైలజానాథ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికలను వాయిదా కాదు, రద్దు కోరుతున్నామన్నారు. ప్రజాస్వామ్యయుతంగా జరగని ఈ ఎన్నికలను పూర్తిగా రద్దుచేసి మళ్లీ తగిన సమయం ఇచ్చి ప్రజలకు రక్షణ కల్పించి నిర్వహించాలన్నారు.

03/19/2020 - 05:24

విజయనగరం, మార్చి 18: రాష్ట్రంలో బీజేపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లినట్టు బీజేపీ రాష్ట్ర కోశాధికారి పాకలపాటి సన్యాసిరాజు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఇక్కడ బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

03/19/2020 - 05:23

విజయవాడ (సిటీ), మార్చి 18: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయని చంద్రబాబు ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలోకి నెట్టేసి పోయారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రిగా చేసిన తప్పుల కారణంగా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లటానికే చంద్రబాబు ముఖం చాటేస్తున్నారని బుధవారం ట్విట్టర్‌లో ధ్వజమెత్తారు.

03/19/2020 - 05:23

భీమవరం, మార్చి 18: రాష్ట్రంలోని ఎయిడెడ్ స్కూల్స్, కళాశాలల వ్యవహారాలపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. వీటికి ఉన్న ఆస్తులు, వాటి విలువ, సిబ్బంది సంఖ్య, వారికి చెల్లిస్తున్న జీతాలు తదితర వివరాలు సేకరిస్తోంది. అలాగే ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అనే వివరాలు కూడా సేకరిస్తున్నారు.

03/19/2020 - 05:31

కర్నూలు: స్థానిక ఎన్నికల్లో కీలక మలుపు చోటు చేసుకుందని న్యాయ నిపుణులు వెల్లడిస్తున్నారు. సుప్రీం కోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సమర్థిస్తూనే ఎన్నికల నియమావళిని ఎత్తివేయడంతో మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారు అభిప్రాయపడుతున్నారు.

03/19/2020 - 01:16

అమరావతి, మార్చి 18: కౌలురైతులకు పంట రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. ప్రస్తుతం ఇస్తున్న రుణాలు ఆశాజనకంగా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. వైఎస్సార్ నవోదయం పథకం కింద ఎంఎస్‌ఎంఈలకు ప్రధాన మంత్రి ముద్రా యోజన కింద ఇచ్చే రుణాలు, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకిచ్చే రుణాల శాతం చాలా తక్కువగా ఉందని అసహనం వ్యక్తం చేశారు.

03/19/2020 - 01:14

విజయవాడ: కరోనా వైరస్ నియంత్రణకు ముందుజాగ్రత్త చర్యలుగా అన్ని విద్యా సంస్థలను, వసతిగృహాలను ఈ నెల 31వరకూ మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ అధికారులను ఆదేశించారు. కోవిడ్-19 వైరస్ నివారణకు ముందుజాగ్రత్త చర్యలపై వెలగపూడి సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులతో బుధవారం ఆమె సమీక్షించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు

Pages