-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
అమరావతి, డిసెంబర్ 28: ప్రతిపక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర ప్రహసనంగా ముగిసిందని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. పాదయాత్రలో పక్కా హామీలేవీ లేవని, ఒక్క సమస్యపై సంబంధిత జిల్లా కలెక్టర్లకు లేఖ రాసిన దాఖలాలులేవని ఎద్దేవా చేశారు. అదొక నిరర్థక పాదయాత్రగా శుక్రవారం ఒక ప్రకటనలో అభివర్ణించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన పాదయాత్రకు జగన్ పాదయాత్రకు పొంతన లేదన్నారు.
విజయవాడ, డిసెంబరు 28: అగ్రిగోల్డ్పై తుది పోరాటం ప్రారంభమైంది. నిరవధిక దీక్షలతో తేల్చుకునేందుకు బాధితులు సిద్ధమయ్యారు.
గూడూరు, డిసెంబర్ 28: శబరిమల ప్రత్యేక రైలులో నీళ్లు రావడంలేదని ప్రయాణికులు గురువారం నెల్లూరు జిల్లా గూడూరు జంక్షన్లో ఆందోళనకు దిగారు. అటు రైల్వే టీసీలు, ఇటు అధికారులతోపాటు రైల్వే పోలీసులతో భక్తులు వాగ్వివాదానికి దిగారు.
విజయవాడ, డిసెంబర్ 28: రాష్ట్రంలోని పాఠశాలకు సంక్రాంతి సెలవులపై సందిగ్థత కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమం జనవరి 2 నుంచి 11 వరకూ నిర్వహించనున్నారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనే అంశంపై ఉపాధ్యాయులు విముఖత చూపుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమమైనప్పటికీ, సెలవుల్లో పని చేసేందుకు ఆసక్తి కనబరచకపోవడంతో ఆయోమయం నెలకొంది.
విజయవాడ, డిసెంబర్ 28: కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లో మెగా పెట్రో కెమికల్ ప్రాజెక్టు ఏర్పాటు అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని వెలగపూడి సచివాలయంలో శుక్రవారం జరిగిన స్టేట్ ఇనె్వస్టుమెంట్ ప్రమోషన్ కమిటీ సమావేశంలో చర్చించారు. కమిటీ సమావేశం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనిల్ చంద్ర పుణేఠా అధ్యక్షతన జరిగింది.
విజయవాడ, డిసెంబర్ 28: రాష్ట్రంలో వివిధ చోట్ల ఉన్న ఎర్రచందన విక్రయానికి 13వ విడత నిర్వహించిన వేలం పాటల్లో 38.44 కోట్ల రూపాయల మేర ఆదాయం లభించిందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. 394.923 మెట్రిక్ టన్నుల ఎర్ర చందనాన్ని విక్రయానికి పెట్టగా, 127.406 టన్నులను విక్రయించామని తెలిపారు. దీనిలో ఏ గ్రేడు 42 మెట్రిక్ టన్నులని, బి గ్రేడ్ 84 మెట్రిక్ టన్నులని తెలిపారు.
విజయనగరం, డిసెంబర్ 28: రాష్ట్రంలో ఇప్పటికే వెలుగు ఉద్యోగులు సమ్మెబాట పట్టగా, మరో మూడు రోజుల్లో డ్వామా ఉద్యోగులు రోడ్డెక్కడానికి సమాయత్తమవుతున్నారు. దశలవారీ పోరాటంలో భాగంగా వచ్చే నెల 2 నుంచి రాష్ట్రంలో డ్వామాలో పనిచేస్తున్న 19 రకాల కేడర్ ఉద్యోగులు తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ సమ్మెబాట పట్టనున్నట్టు ఎపి ఎంప్లారుూస్ జెఎసి జిల్లా చైర్మన్ జి.సుందరరావు తెలిపారు.
విశాఖపట్నం, డిసెంబర్ 28: వచ్చే ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీతోనూ జనసేనకు పొత్తు ఉండదని సీనియర్ నేత, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. విశాఖలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా జనసేన వివిధ రాజకీయ పార్టీలతో ఎన్నికల అవగాహన కుదుర్చుకుంటుందని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.
అమరావతి, డిసెంబర్ 28: ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ అంతర్భాగం కాదా అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం ఈ దేశ పౌరులం కాదా అని మండిపడ్డారు. మేం పన్నులు చెల్లించటంలేదా.. ఆదాయం మాది..పెత్తనం మీదా.. ఇదేమి న్యాయమని ధ్వజమెత్తారు. ఒక రాష్ట్రంపై కేంద్రం ప్రవర్తించే తీరు ఇదేనా అని నిలదీశారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 28: కేంద్ర ప్రభుత్వం ఏర్పా టు చేయాల్సిన కడప స్టీల్ ప్లాంట్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు శంకుస్థాపన చేసిందని వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. అలాగే కడప స్టీల్ ప్లాంట్ వ్యయం రూ.18 వేల కోట్లుగా చెప్తున్నారని గుర్తుచేశారు. కేంద్రం నిర్మించాలనుకున్న ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం ఎందుకు నిర్మిస్తుందని నిలదీశారు.