S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/17/2018 - 03:54

నెల్లూరు, అక్టోబర్ 16: క్షేత్రస్థాయిలో ఎంతో బలమైన కేడర్ కలిగిన తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం అదే ఆ బలాన్ని విస్మరించి ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తోంది. 1982లో టీడీపీ ఆవిర్భావం నుండి కార్యకర్తలతో పాటు పార్టీకి చెందిన పలు అనుబంధ సంఘాలు ఎంతో బలంగా ఉంటూ క్షేత్రస్థాయిలో పార్టీకి ఆయువుపట్టుగా మారాయనడంలో అతిశయోక్తి లేదు.

10/17/2018 - 03:52

విజయవాడ, అక్టోబర్ 16: రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి కావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అకుంఠిత దీక్షతో ముందుకు సాగుతున్నారని జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు.

10/17/2018 - 03:52

విజయవాడ, అక్టోబర్ 16: వారసత్వంపై మాట్లాడే నైతిక హక్కు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు లేదని శాసనమండలిలో ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీలను, రాజ్యసభ సభ్యులను కించపరుస్తూ మాట్లాడం సరికాదన్నారు.

10/17/2018 - 03:51

విజయవాడ, అక్టోబర్ 16: కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (సీపీఎస్) రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే విషయమై సచివాలయంలో మంగళవారం చర్చలు ప్రారంభమయ్యాయి. సీపీఎస్ ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో ఆమరణ దీక్షలు జరుగుతున్న సమయంలో ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది.

10/17/2018 - 03:50

విజయవాడ, అక్టోబర్ 16: దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పట్టువస్త్రాల సమర్పణ వివాదాస్పదంగా మారింది. అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణలో తనను పట్టించుకోలేదంటూ టీటీడీ బోర్డు సభ్యుడు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అలిగి వెళ్లడం విమర్శలకు గురైంది.

10/17/2018 - 02:58

విజయవాడ, అక్టోబర్ 16: విభజన కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న రాష్ట్రంలో కవాతులు, ర్యాలీల పేరుతో హింసను ప్రేరేపించేలా మాట్లాడుతూ అలజడులు సృష్టించి, అశాంతి నెలకొల్పడమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశమా అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని ప్రశ్నించారు. మంగళవారం విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.

10/16/2018 - 17:15

శ్రీకాకుళం: తిత్లీ తుపాను వల్ల నష్టపోయినవారిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఆయన మంగళవారంనాడు వజ్రపుకొత్తూరు మండలం గరుడభద్రలో పర్యటించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

10/16/2018 - 17:14

విశాఖపట్నం: ఇటీవల పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన కిడారి సర్వేశ్వరరావు భార్య పరమేశ్వరి నిరసన వ్యక్తం చేశారు. కిడారి విశే్వశ్వరరావును హత్యచేసిన తూర్పుగోదావరి జిల్లా మావోయిస్టు మహిళా నేతను ఉద్దేశించి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఆమె ఎందుకు ఆ ఉద్యమంలోకి వెళ్లిందో ఆలోచించాలని అన్నారు.

10/16/2018 - 12:43

విశాఖపట్నం: ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ అసాంఘీక కార్యక్రమాలను అడ్డుకుని తీరతామన్నారు. నేతలకు భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. గిరిజనులను పోలీసులు వేధిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ పేర్కొన్నారు.

10/16/2018 - 12:43

శ్రీకాకుళం : తిత్లీ తుఫాన్‌ ధాటికి అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లాలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 869 గ్రామాలకు విద్యుత్‌ పునరుద్ధరించగా.. ఇంకా 1,033 గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి. 669 సెల్‌ టవర్ల పరిధిలో మొబైల్‌ సేవలు పునరుద్ధరించారు.

Pages