S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/13/2018 - 11:36

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నాలుగో రోజు శ్రీవారు కల్పవృక్ష వాహనంపై తిరుమాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు.

10/13/2018 - 11:28

విజ‌య‌వాడ‌: దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా నాల్గవరోజైన శనివారం కనకదుర్గమ్మ లలితా త్రిపుర సుందరీ దేవీ అవతారంలో దర్శనమిస్తోంది. తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు.

10/13/2018 - 05:42

కడప, అక్టోబర్ 12: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌నాయుడు ఇంటిపై ఐటీ శాఖ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. కడప జిల్లా యర్రగుంట్ల మండలం పోట్లగుత్తి గ్రామంలోని సీఎం రమేష్ సోదరుల గృహ సముదాయాలపై ఐటీ అధికారులు దాడులు జరిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఇళ్లలో సోదాలు నిర్వహించారు.

10/13/2018 - 05:42

విజయవాడ, అక్టోబర్ 12: ఏపీ రాష్ట్ర సమాచార కమిషనర్లుగా నియమితులైన ఎం రవికుమార్, బీవీ రమణకుమార్, కట్టా జనార్ధన్‌రావు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. వెలగపూడి సచివాలయంలో సీఎం బ్లాక్‌లోని గ్రీవెన్స్ హాల్‌లో రాష్ట్ర సమాచార కమిషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీరిచేత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా ప్రమాణ స్వీకారం చేయించారు.

10/13/2018 - 05:33

విజయవాడ, అక్టోబర్ 12: జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు నిధుల కేటాయింపుపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని 15వ ఆర్థిక సంఘం చైర్మన్ నంద్‌కిశోర్ సింగ్ హామీ ఇచ్చారు. వెలగపూడి సచివాలయంలో వివిధ పార్టీలకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో శుక్రవారం ఆయన భేటీ అయ్యారు. ఈసందర్భంగా సర్పంచ్‌తో పాటు తమకూ నిధులు కేటాయించాలని జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు కోరారు.

10/13/2018 - 05:29

విశాఖపట్నం, అక్టోబర్ 12: విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉత్పత్తుల అమ్మకాల్లో 49 శాతం వృద్ధి సాధించినట్టు ప్లాంట్ సీఎండీ పీకే రథ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రీజియన్ విశాఖ స్టీల్ వినియోగదారుల సమావేశం ఉక్కునగరంలో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో రథ్ మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం అర్థ భాగం పూర్తయిన తర్వాత 10 వేల కోట్ల రూపాయల టర్నోవర్ సాధించామని తెలియజేశారు.

10/13/2018 - 05:27

విజయవాడ, అక్టోబర్ 12: కృష్ణానదిలో జరగబోయే పవర్ బోట్ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ నిర్వహణకు సంబంధించిన పనులు వేగవంతం అయ్యాయి. జిల్లా స్థాయిలో ఏర్పాటైన సమన్వయ కమిటీ తొలి క్షేత్ర పర్యటన శుక్రవారం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ పోటీలు నిర్వహిస్తుండగా, ఏర్పాట్లపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు.

10/13/2018 - 05:26

నూజివీడు, అక్టోబర్ 12: కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధరలను పెంచుతుండటంతో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థపై వేయి కోట్ల రూపాయల మేరకు భారం పడిందని సంస్థ ఎండీ ఎన్వీ సురేంద్రబాబు వెల్లడించారు. డీజిల్ ధరలు పెరుగుతున్నా ప్రయాణికులపై భారాన్ని వేయలేమని చెప్పారు. కృష్ణా జిల్లా నూజివీడు ఆర్టీసీ డిపోను శుక్రవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. డిపోలోని వివిధ విభాగాలను పరిశీలించి అక్కడి అధికారులతో మాట్లాడారు.

10/13/2018 - 05:25

అనంతపురం, అక్టోబర్ 12: భారతదేశంలో తొలిసారిగా అడుగు పెట్టిన ఆటోమోబైల్ దిగ్గజం కియా కార్ల సంస్థ 2019 సెప్టెంబర్‌లో కమర్షియల్ ప్రొడక్షన్ ప్రారంభించనుందని ఆ సంస్థ సీనియర్ జనరల్ మేనేజర్ (ఐ అండ్ పీఆర్) ఎస్‌డీ.పార్క్ వెల్లడించారు. శుక్రవారం అనంతపురం నగరంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కంపెనీ నిర్మాణం పురోగతిని, ఉత్పత్తి లక్ష్యాన్ని వివరించారు.

10/13/2018 - 01:58

శ్రీకాకుళం, అక్టోబర్ 12: తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం పర్యటించారు. సోంపేట, కవిటి, ఇచ్చాపురం ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. బాధితులతో మాట్లాడిన ముఖ్యమంత్రి వారికి కనీసం అన్నం పొట్లాలు కూడా అందలేదన్న వాస్తవాన్ని తెలుసుకుని ఒకరోజు పర్యటనగా వచ్చిన బాబు తిత్లీ బాధితులతోనే పలాసలో శుక్రవారం రాత్రి గడుపుతానంటూ వెల్లడించారు.

Pages