-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
అమరావతి, అక్టోబర్ 6: చిత్తూరు జిల్లా నగరి శాసనసభ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో రగులుతున్న గ్రూపుల పోరుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు మృతిచెందిన నేపథ్యంలో ఆయన వారసులకు వచ్చే ఎన్నికల్లో సీటిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే వారసుల మధ్య విభేదాలు చోటు చేసుకోవటంతో పేచీ తలెత్తింది.
* పీపుల్స్ మేనిఫెస్టో సిద్ధం * 50 శాతం మంది డబ్బు తీసుకోకుండా ఓట్లేస్తే చాలు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వెల్లడి
విజయవాడ, అక్టోబర్ 6: అర్చక, బ్రాహ్మణ వ్యతిరేకి అయిన ఐవైఆర్ కృష్ణారావు అర్చకుల ఆత్మహత్యలంటూ కల్లబొల్లి కబుర్లతో హైదరాబాద్లో కూర్చుని ట్వీట్లు చేస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద్సూర్య ఎద్దేవా చేశారు.
అమరావతి, అక్టోబర్ 6: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా సాదినేని యామినిని నియమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. గుంటూరుకు చెందిన యామిని చిన్నతనంలో హైదరాబాద్లో ఉంటూ ఉన్నత విద్యను అభ్యసించారు. వైర్లెస్ కమ్యూనికేషన్స్, డిజిటల్ కమ్యూనికేషన్స్లో ఆమె లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు సాధించింది.
విజయవాడ(సిటీ), అక్టోబర్ 6: ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను సాధించడంలో వైసీపీ ఎంపీలు మొదటి నుండి డ్రామాలు ఆడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయితీ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ఏపీలో ఖాళీగా ఉన్న ఐదు పార్లమెంట్ స్థానాలకు ఉపఎన్నికలు లేవని ఈసీ స్పష్టం చేసిన నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ శనివారం ట్విట్టర్ ద్వారా స్పందించారు.
విజయవాడ (ఇంద్రకీలాద్రి), అక్టోబర్ 6: దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని ఏపీ భవన్లో ఏర్పాటు చేసిన అమ్మవారి సన్నిధిలో రాష్ట్ర ప్రభుత్వం, దుర్గగుడి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీదేవి ఖడ్గమాలార్చన, కుంకుమార్చన, శాంతి కల్యాణం, తదితర ప్రత్యేక ఆర్జిత సేవలు శనివారం నుంచి ప్రారంభమయ్యానాయి. సాయంత్రం నిర్వహించిన శాంతి కల్యాణంలో 400 మంది ప్రత్యేక దాతలు పాల్గొన్నారు.
అమలాపురం, అక్టోబర్ 6: చిన్న చిన్న కారణాలతో భార్యలకు నరకాన్ని చూపించే భర్తలు ఉన్న ఈరోజుల్లో భార్య మరణిస్తే ఆమె భౌతిక కాయాన్ని వైద్య విద్యార్థుల పరిశోధనకు సమర్పించడమే కాకుండా ఆమె శిలా విగ్రహాన్ని ఏర్పాటుచేసి తన ఆదర్శభావాన్ని చాటుకున్నారు మోటూరి భైరవస్వామి మాష్టారు.
విజయవాడ(సిటీ), అక్టోబర్ 6: ధవళేశ్వరం బ్యారేజీపై జనసేన పార్టీ నిర్వహించ తలపెట్టిన కవాతుతో పార్టీ సత్తాను దేశవ్యాప్తం చేయాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జనబాటకి అందరూ సమష్టిగా సహకరించాలన్నారు. విజయవాడలోని పార్టీ తాత్కాలిక రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన గోదావరి జిల్లాల నాయకులు, కార్యక్తలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
అమరావతి, అక్టోబర్ 6: ప్రభుత్వం అమలుచేస్తున్న ఆహార పథకాలను సమర్థవంతంగా అమలుచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఉండవల్లి ప్రజావేదికలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ జేఆర్ పుష్పరాజ్ ఆధ్వర్యంలో సభ్యులు శనివారం ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కమిషన్ మెంబర్ సెక్రటరీగా జి రవిబాబు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
ఒంగోలు, అక్టోబర్ 6: ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం ఓడరేవు నిర్మాణానికి సీఎం చంద్రబాబు రానున్న 15 రోజుల్లో శంకుస్థాపన చేస్తారని అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు.