S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/26/2018 - 23:58

విజయవాడ, జూలై 26: చిత్తూరు జిల్లాలో జరుగుతున్న పారిశ్రామిక ప్రగతిపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్ రెడ్డి గురువారం సమీక్షించారు. వెలగపూడి సచివాలయంలో వీడియో కాన్ఫరెన్సు ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భాగస్వామ్య సదస్సుల్లో, ఇతర వేదికలపై చేసుకున్న అవగాహనా ఒప్పందాలకు భూ కేటాయింపుల గురించి చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నను అడిగి తెలుసుకున్నారు.

07/26/2018 - 23:58

గుంటూరు, జూలై 26: దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా అర్చక, బ్రాహ్మణ వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పాటుబడుతోంది తెలుగుదేశం ప్రభుత్వమేనని టీడీపీకి చెందిన శాసనమండలి సభ్యుడు టిడి జనార్ధన్ పేర్కొన్నారు.

07/26/2018 - 23:57

విజయవాడ, జూలై 26: హైదరాబాద్‌ను ఇద్దరం పంచుకుని, ప్రత్యేక హోదా కోసం పోరాడుదామని తెలంగాణ నేతలకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్ రెడ్డి బదులిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే, తమకూ ఇవ్వాలని తెలంగాణ నేతలు కోరడం చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు.

07/25/2018 - 06:34

అమరావతి, జూలై 24: రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టు పెడుతున్న ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్రంలో అశాంతిని ప్రేరేపిస్తోందని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. బంద్ వల్ల ఆర్థిక కార్యకలాపాలు నిలిచి పోయాయని, నిత్యావసరాల ధరలు పెరుగుతాయన్నారు. పిల్లల చదువులకు ఇబ్బందులు.. వైద్యం అందక రోగులు ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు.

07/24/2018 - 02:53

అమరావతి, జూలై 23: చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. చేనేతలకు అందిస్తున్న రుణాలు.. సబ్సిడీ పథకాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా తదితర అంశాలపై ముఖ్యమంత్రి సోమవారం సచివాలయంలో సమీక్ష జరిపారు. సీఎం ఆదేశాల మేరకు ఆదరణ-2 పథకం కింద 60వేల 497 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని అధికారులు తెలిపారు.

07/24/2018 - 02:51

విజయవాడ(బెంజిసర్కిల్), జూలై 23: జనసేన పార్టీ ఎట్టకేలకు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో రాజకీయ కమిటీతో పాటు పార్టీ వ్యవహారాల కమిటీలను ఏర్పాటు చేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అధికార ప్రతినిధులను కూడా నియమించింది. విజయవాడలోని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నివాసంలో సోమవారం నేతలతో విస్తృతంగా చర్చించిన అనంతరం కమిటీ నేతలను ఎంపిక చేశారు.

07/24/2018 - 02:49

అమరావతి, జూలై 23: అధికారులు ఏదో చేశామని చేతులు దులుపుకుంటే కుదరదు.. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.. అలసత్వం లేకుండా వేగవంతంగా పూర్తయ్యేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలం రహదార్లపై నీరునిల్వ ఉంటే సహించేది లేదని స్పష్టం చేశారు. ఇందుకోసం వారం రోజుల పాటు ప్రత్యేకడ్రైవ్ చేపట్టాలని సూచించారు.

07/24/2018 - 02:57

అమరావతి: కేంద్రప్రభుత్వం నిరంకుశ విధానాలను అవలంబిస్తూ జీఎస్‌టీ కౌన్సిల్‌ను నిర్వీర్యం చేస్తోందని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. కేంద్రానికి, జీఎస్‌టీ కౌన్సిల్ మధ్య సమన్వయలోపం కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని సోమవారం ఒక ప్రకటనలో యనమల తెలిపారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలను బుట్టదాఖలు చేస్తున్నారని ఆరోపించారు.

07/24/2018 - 02:56

గుంటూరు (లీగల్): గత ఆరు నెలలుగా ప్రచార పటాటోపంతో న్యాయవాదవర్గాలను హోరెత్తించిన ఆంధ్రరాష్ట్ర బార్ కౌన్సిల్ కౌంటింగ్ ప్రక్రియ పూరె్తై 25 మంది సభ్యులను ఖరారు చేస్తూ కౌన్సిల్ కార్యదర్శి రేణుక ప్రకటించారు. పలు రాజకీయ, కుల సమీకరణలలో భాగంగా జరిగిన ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రధానంగా పేర్కొనే మూడు కులాలకే ఎక్కువ ప్రాతినిధ్యం లభించింది.

07/24/2018 - 02:47

తిరుపతి, జూలై 23: చట్టసభల్లో చర్చకు రాని అంశాలను శాసనసభ ఫిర్యాదుల కమిటీ పరిశీలించి పరిష్కరిస్తుందని ఆ కమిటీ చైర్మన్, శాసనమండలి వైస్ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం అన్నారు. సోమవారం ఉదయం తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో శాసనమండలి ఫిర్యాదుల కమిటీ టీటీడీ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో హౌస్ కమిటీ చైర్మన్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తమ వద్దకు తిరుమల శ్రీవారి ఆలయ సన్నిధిగొల్ల సంభావన అంశం ఉందన్నారు.

Pages