S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/16/2018 - 01:51

విశాఖపట్నం, జూలై 15: ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఉమెన్ చాందీ మూడు రోజులపాటు పర్యటించనున్నారు.
ఈ నెల 16న శ్రీకాకుళం, 17న విజయనగరం, 18,19 తేదీల్లో విశాఖ జిల్లాల్లో పర్యటించి కాంగ్రెస్ కార్యకర్తలతో సంప్రదించనున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి క్రిష్ట్ఫోర్ తిలక్ తెలిపారు.

07/16/2018 - 01:48

అమరావతి, జూలై 15: సుప్రసిద్ధ ఇంజనీరు డాక్టర్ కేఎల్ రావు అందించిన సేవలు మరువలేనివని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్లాఘించారు. ఆదివారం కేఎల్ రావు జయంతి సందర్భంగా చంద్రబాబు ఇక్కడ ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. చిత్తశుద్ధి, కర్తవ్య దీక్ష, దృఢ సంకల్పం, సేవానిరతికి ఆయన ఆదర్శంగా నిలిచారని చెప్పారు. నిస్వార్థంగా విద్యుక్త్ధర్మాన్ని నిర్వర్తించిన అతి కొద్దిమందిలో కేఎల్ రావు ఒకరన్నారు.

07/16/2018 - 01:48

విశాఖపట్నం, జూలై 15: బంగాళాఖాతంలో ఒడిశాను ఆనుకుని ఏర్పడిన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావం వలన వచ్చే 24 గంటల్లో ఉత్తర కోస్తా అంటతా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ తీవ్ర అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ మధ్య భారత దేశం వైపు వెళుతోందన్నారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు కొనసాగనున్నాయి.

07/16/2018 - 02:18

అమరావతి: ‘ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో ఎవరితోనూ సంప్రదించకుండా యూపీఏ ఏకపక్షంగా వ్యవహరించింది. విభజన చట్టంలో పొందుపరచిన అంశాలు, రాజ్యసభలో ఇచ్చిన హామీలను బీజేపీ కాలరాస్తోంది. ఏపీపై ఇంత నిర్లక్ష్యమా? మాకు జరిగిన అన్యాయంపై పోరాడుతున్నాం. గత నాలుగేళ్లుగా కేంద్రం ఏం ఇచ్చిందీ, ఇవ్వాల్సిందీ వివరాలివిగో.. ఓ రాజకీయ పార్టీగా మీరు ఆలోచించి మద్దతివ్వండంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభ్యర్థించారు.

07/15/2018 - 04:39

విజయవాడ(పాతబస్తీ), జూలై 14: కృష్ణానదీ తరంగాలపై ప్రపంచ స్థాయి ఎఫ్ 1 హెచ్2ఓ గ్రాండ్ స్పీడ్ బోటు పవర్ రేసింగ్ పోటీలు జరగనున్నాయని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఎండి హిమాన్షు శుక్లా తెలిపారు. శనివారం విజయవాడ బరంపార్క్‌లోని పున్నమి కాన్ఫరెన్స్ హాలులో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. నవంబర్ 15, 16, 17 తేదీల్లో మూడు రోజుల పాటు స్పీడ్ బోటు రేసులు జరగనున్నాయన్నారు.

07/15/2018 - 04:45

అమరావతి: సవాళ్లను అధిగమించి సత్వర అభివృద్ధి..సుస్థిర పాలన లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చి సోమవారంతో 15 వందల రోజులు కావస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం సాధించిన లక్ష్యాలను శనివారం ఉండవల్లి గ్రీవెన్స్‌హాల్‌లో మీడియాకు వివరించారు. విభజన తరువాత ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో అధికారంలోకి వచ్చి ప్రజల్లో ఒక భరోసా కల్పించామన్నారు.

07/15/2018 - 04:32

విజయవాడ, జూలై 14: గుజరాత్ రాష్ట్రంలోని వడోదర, తదితర ప్రాంతాల్లో ఇటీవల అభివృద్ధి చేసిన అత్యాధునిక బస్ స్టేషన్‌లు ఆదర్శంగా రాష్ట్రంలోని బస్ స్టేషన్‌లను ఆధునీకరించి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే యత్నం చేస్తామని ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య అన్నారు. తొలి దశలో విజయవాడ, తిరుపతి, విశాఖలకు ప్రాధాన్యత నిస్తామంటునే ఈ ఆధునికరణ ప్రైవేట్ భాగస్వామ్యంతోనే సాధ్యపడగలదన్నారు.

07/15/2018 - 04:26

నూజివీడు: విద్యార్థులంతా వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటి, వాటిని సంరక్షించి పెద్ద పెద్ద వృక్షాలుగా పెంచడం బాధ్యతగా తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. మొక్కలు పెంచటం సామాజిక బాధ్యతగా గుర్తించాలని, దీనిని దృష్టిలో ఉంచుకుని తన మనుమడు దేవాన్ష్‌తో మొక్క నాటించానని చెప్పారు.

07/15/2018 - 02:26

విశాఖపట్నం, జూలై 14: జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి కేంద్రమే నిధులు మంజూరు చేస్తున్న పోలవరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యమేమిటని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రశ్నించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రమే పూర్తి బాధ్యతతో పోలవరం ప్రాజెక్టును అనుకున్న ప్రకారం పూర్తి చేసేందుకు కట్టుబడి ఉందన్నారు.

07/15/2018 - 02:24

రాజమహేంద్రవరం, జూలై 14: స్వాతంత్య్రం వచ్చి డెబ్బై ఏళ్లు దాటుతున్నా నేటికీ సమాజంలో అంటరానితనం వెంటాడుతోందంటే అందుకు పాలకులు సిగ్గుతో తలదించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఈ పరిస్థితులకు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కారకులన్నారు.

Pages