S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/18/2018 - 03:14

విజయవాడ, మే 17: రంజాన్ ఎంతో పవిత్ర మాసమని, నెల రోజులు నిష్టగా చేసే దీక్షలకు ఎంతో ప్రాధాన్యం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రంజాన్ మాస ప్రారంభ దినం సందర్భంగా ముస్లింలకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాసం ఆధ్యాత్మికపరమైనదే కాకుండా, ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుందన్నారు. ముస్లింలు ఈ నెల రోజులూ ప్రార్థనలు, ఖురాన్ పఠనంతో గడుపుతారని అన్నారు.

05/18/2018 - 03:13

విజయవాడ, మే 17: కొత్తగా ప్రవేశపెట్టిన సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్)తో కొన్ని సాంకేతిక ఇబ్బందులు వచ్చాయని, వాటిని పరిష్కరించామని, ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇస్తున్న చెక్కులపై లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు.

05/18/2018 - 03:12

విజయవాడ, మే 17: తిరుమల తిరుపతి దేవస్థానంపై ప్రధానార్చకుడు రమణదీక్షితులు చేసిన వ్యాఖ్యల వెనుక వైకాపా, బీజేపీల హస్తం ఉందన్న అనుమానాన్ని టీడీపీ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ వ్యక్తం చేశారు. వెలగపూడి సచివాలయం ఆవరణలోని అసెంబ్లీ టీడీఎల్పీ కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ ఏవైనా అజెండాలుంటే ఏదో పార్టీలో చేరి మాట్లాడాలని సూచించారు.

05/18/2018 - 03:12

విజయవాడ, మే 17: కర్నాటకలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన బీజేపీ వైఖరికి నిరసనగా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తెలుగు ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఉద్యమించాలంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు.

05/18/2018 - 03:11

గుమ్మలక్ష్మీపురం, మే 17: రాష్ట్రంలో ప్రస్తుతం 902 డీఆర్ డిపోలతోపాటు కొత్తగా జాతీయ ఆహార పథకం కింద 831 డీఆర్ డిపోలను ఏర్పాటు చేయనున్నామని గిరిజన సహకార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బాబూరావునాయుడు తెలిపారు. విజయనగరం జిల్లా, గుమ్మలక్ష్మీపురానికి గురువారం బాబూరావునాయుడు విచ్చేశారు.

05/18/2018 - 03:11

విశాఖపట్నం, మే 17: గతంలో కంటే ఆదాయం పెంచుకోవడంలోను, ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంలో గణనీయమైన పురోగతి సాధించి, రాష్ట్రంలోనే రెండోస్థానంలో నిలిచింది ఆర్టీసీ విశాఖ రీజియన్. ప్రధానంగా వార్షిక ఆదాయాన్ని దాదాపు రూ.500 కోట్లకు పెంచుకోగలిగిన ఈ రీజియన్ సకాలంలో బస్సు సర్వీసులు నిర్వహించడంతో ప్రయాణికులకు మరింతగా చేరువైంది.

05/18/2018 - 03:10

విశాఖపట్నం, మే 17: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అసెంబ్లీ, పార్లమెంట్ వీధి నాటకాల ద్వారా రాదని, ప్రజల ఐక్య, సమరశీల పోరాటాల ద్వారానే వస్తుందని ప్రత్యేక హోదా ప్రజల హోదాను పెంచే విధంగా ఉండాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ(మావోయిస్ట్) ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంత కమిటీ అధికార ప్రతినిధి జగబందు రాసిన సుదీర్ఘ లేఖను గురువారం మీడియాకు పంపించారు.

05/16/2018 - 04:41

విజయవాడ, మే 15: విభిన్న ప్రతిభావంతులను నూరుశాతం ఓటర్లుగా నమోదు చేయడంతో పాటు పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన సౌకర్యాలపై సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని అమలు చేసేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉందని రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ఆర్పీ సిసోడియా అన్నారు.

05/16/2018 - 04:18

విజయవాడ, మే 15: రంజాన్ సందర్భంగా గంట ముందుగా ఇంటికి వెళ్లేందుకు ముస్లిం ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వివిధ ప్రభుత్వ కార్యాయాలు, పాఠశాలల్లో పని చేసే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు ఈ వెసులుబాటు కల్పించింది. ఈ నెల 16 నుంచి జూన్ 15వ తేదీ వరకూ ఈ అనుమతి వర్తిస్తుంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

05/16/2018 - 04:17

విశాఖపట్నం, మే 15: కర్నాటక ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. విశాఖలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. అధికారం కోసం బీజేపీ జనతాదళ్(సెక్యులర్) పార్టీని చీల్చేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. కర్నాటకలో తెలుగు ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగానే ఓటు వేశారన్నారు.

Pages