S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/26/2020 - 01:39

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: పొగాకు, మద్యం ఉత్పత్తుల మాదిరిగానే ప్యాక్ చేసిన స్వీట్లకు కూడా ఇకపై చట్టబద్ధమైన హెచ్చరికలు తప్పనిసరి. ఏ తేదీలోగా సదరు స్వీట్లను వినియోగించుకోవాలో స్పష్టం చేసే ప్రకటన ప్రతి స్వీట్ ప్యాకేజీపై ఉండాలని ‘ది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ) ఆదేశాలు జారీ చేసింది.

02/25/2020 - 23:42

ముంబయి, ఫిబ్రవరి 25: భారత స్టాక్ మార్కెట్లు సోమవారం నాటి భారీ పతనం నుంచి కొలుకుంటున్నప్పటికీ, వరుసగా రెండో రోజు కూడా నష్టాల్లోనే కొనసాగాయి. ఈవారం లావాదేవీలకు మొదటి రోజైన సోమవారం బాంబే స్టాక్ ఏక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ 806.89 పాయింట్లు పతనమై, 40,363.23 పాయింట్లకు పడిపోయిన విషయం తెలిసిందే.

02/25/2020 - 23:40

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: భారత టెలికం కంపెనీల కష్టాలు కొనసాగుతునే ఉన్నాయి. గణాంకాలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సబ్‌స్క్రిప్షన్లు తగ్గడం ఒకవైపు, 1.47 లక్షల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సిందేనంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయడం మరోవైపు టెలికం కంపెనీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

02/25/2020 - 05:34

విజయవాడ: రాష్ట్రంలోని మున్సిపల్ ఉపాధ్యాయుల భవిష్య నిధి (జీపీఎఫ్) వ్యవహారం అగమ్యగోచరంగా తయరైంది. వేతనాల్లో భవిష్యనిధి కింద కొంత మొత్తం మినహాయిస్తున్నప్పటికీ, ఆ మొత్తం జీపీఎఫ్ ఖాతాల్లో జమ కావడం లేదు. భవిష్యనిధికి సంబంధించి పురపాలక శాఖ నాలుగు విధానాలను అమలు చేయడం మరింత గందరగోళానికి దారితీస్తోంది.

02/25/2020 - 01:33

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: చైనాకు చెందిన రియల్‌మే మొబైల్ ఫోన్ల ఉత్పత్తి సంస్థ సోమవారం భారత్ మార్కెట్‌లో తొలి 5జీ స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. స్మార్ట్ ఫోన్ల ధరలు రూ.37,999 నుంచి ప్రారంభవుతాయి. రియల్‌మే ఫోన్లను భారత్ మార్కెట్‌లో ప్రవేశ పెట్టడం తమకు ఎంతో సంతోషకరంగా ఉందని రియల్‌మే ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి (సీఇవో) మాధవ్ సేత్ అన్నారు.

02/25/2020 - 01:32

ముంబయి, ఫిబ్రవరి 24: మార్కెట్ రెగ్యులేటర్ భారత సెక్యూరిటీలు, ఎక్స్ఛేంజి బోర్డు (సెబీ) చైర్మన్ పదవికి 24 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ అభ్యర్థుల్లో ప్రస్తుతం సెబీలో పూర్తి స్థాయి సభ్యులుగా ఉన్న ఇద్దరు కూడా ఉన్నారు. ఈ పదవి కోసం దరఖాస్తు గడువు ఈనెల 10వ తేదీనే ముగిసింది. ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారన్న విషయం తాజాగా వెల్లడైంది.

02/25/2020 - 01:37

ముంబయి, ఫిబ్రవరి 24: చైనాలో సంభవించిన కరోనా వైరస్ తాజాగా దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్‌లలోనూ ప్రబలమైన ప్రభావం భారత స్టాక్ మార్కెట్‌పై తీవ్రంగా పడింది. ఈ ఏడాది రెండోసారి అత్యధిక స్థాయిలో మార్కెట్ పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లలో కరోనా కలకలాన్ని ప్రతిబింబిస్తూ భారతీయ మార్కెట్లు అట్టుడికాయి. ఫలితంగా సెనె్సక్స్ ఏకంగా 807 పాయింట్లు పతనమైంది.

02/24/2020 - 04:09

న్యూఢిల్లీ: ఎగుమతులను మరింత పెంచడంపై భారత పరిశ్రమలు దృష్టి సారిస్తున్నాయి. కరోనా వైరస్ విజృంభణ కారణంగా చైనా నుంచి వివిధ దేశాలు దిగుమతులను దాదాపుగా నిలిపివేసిన నేపథ్యంలో, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా, అత్యంత వేగంగా కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నాయి. కేంద్రం కూడా ఎగుమతులను పెంచేందుకు ఇతోథిక సాయాన్ని అందిస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

02/24/2020 - 03:57

విశాఖపట్నం, ఫిబ్రవరి 23: విశాఖ విమానాశ్రయం నుంచి ఎయిర్ కార్గో సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 25వతేదీ నుంచి ఎయిర్ కార్గో సర్వీసును నడిపేందుకు స్పైస్ జెట్ విమానయాన సంస్థ సన్నాహాలు పూర్తి చేసుకుంది. తొలుత ఎయిర్‌కార్గో సర్వీసును ఈ నెల 15వతేదీ నుంచి నడపాలని భావించినప్పటికీ రక్షణ శాఖ ఆధీనంలోని ఎయిర్‌పోర్టు వర్గాలు సమయం కేటాయించలేదు.

02/24/2020 - 03:55

విజయవాడ, ఫిబ్రవరి 23: రాష్ట్రంలో విజయవాడ నగరం తొలి నుంచీ ఆటోమొబైల్ రంగానికి ప్రధాన కేంద్రం. ద్విచక్ర వాహనాల నుంచి కార్లు, మినీ వ్యాన్లు, బస్సులు, ట్రక్కులు, ట్రాలీలు, ట్యాంకర్లు ఇలా అన్నిటికీ విజయవాడ హబ్‌గా మారింది. వరల్డ్ బ్రాండ్ ఏదైనా సరే అది తొలుత బెజవాడకు రావాల్సిందే. రవాణా రంగ హబ్‌గా ఉన్న ఈప్రాంతంలో ఆటోమొబైల్ రంగానికి మరింత ఊపునిచ్చేలా మార్కెట్‌లోకి దిగ్గజ బ్రాండ్స్ షోరూమ్‌లు వస్తున్నాయి.

Pages