S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/20/2020 - 23:00

లక్నో, ఫిబ్రవరి 20: ఎగుమతులను పెంచుకోవడంతోపాటు, ఆర్థికంగా స్థిర పడేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (్ఫక్కీ) పిలుపునిచ్చింది. కరోనా వైరస్ కారణంగా చైనాలో ఉత్పత్తి దారుణంగా పడిపోయిందని, అదే విధంగా ఆ దేశం నుంచి దిగుమతులకు ప్రపంచ దేశాలు విముఖత వ్యక్తం చేస్తున్నాయని తెలిపింది.

02/20/2020 - 22:59

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: బకాయిలను చెల్లించాల్సిన మొత్తాలను పెండింగ్‌లో పెట్టిన కారణంగా కొంతకాలంగా ‘వాచ్ నెగెటివ్’ జాబితాలో చేరిన ప్రముఖ టెలికం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌కు ఊర ట లభించింది. ఫిచ్ రేటింగ్స్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. బెటర్ బిజినెస్ బ్యూరో (బీబీబీ)లో భారతీ ఎయిర్‌టెల్‌కు ప్రతికూల ముద్ర పడిన విష యం తెలిసిందే.

02/20/2020 - 03:53

కోయంబత్తూర్: యావత్ ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న ‘కోవిడ్’ వైరస్ ఎన్నో రంగాలను దెబ్బతీస్తే, తమిళనాడు దుస్తుల పరిశ్రమ మాత్రం ఈ వైరస్ పట్ల హర్షం వ్యక్తం చేస్తోంది. నిజానికి మన దేశంలో మొదటి రెండు కోవిడ్ కేసులు కేరళలో నమోదయ్యాయి. ఆ తర్వాత మిగతా ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి. కేరళ సరిహద్దులో ఉన్న తమిళనాడు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంది. దీంతో రాష్ట్రం మొత్తం అప్రమత్తమైంది.

02/19/2020 - 23:26

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి బడా పారిశ్రామికవేత్తలు తీసుకొని, ఎగ్గొట్టిన బకాయిలు లక్షల కోట్లు ఉన్నప్పటికీ, ఇప్పటి వరకూ సరైన ఎవరూ సరైన దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసే స్థాయి భారీ కుంభకోణాలపైనా ఇప్పటి వరకూ విచారణలు చెప్పుకోదగిన రీతిలో ముందుకు సాగడం లేదు. విజయ్ మాల్య లేదా లలిత్ మో దీ..

02/19/2020 - 23:26

కోల్‌కతా, ఫిబ్రవరి 19: భారతదేశంలో తొలి 5-జీ హ్యాండ్‌సెట్‌లను చైనాకు చెందిన ప్రముఖ సెల్‌ఫోన్ తయారీ సంస్థ రియల్ మి ప్రవేశపెట్టనుంది. దీని ధర సుమారు 50 వేల రూపాయలు ఉండవచ్చునని ఆ కంపెనీ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. 2018లో ప్రారంభమైన రియల్ మి అతి తక్కువ కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ సెల్‌ఫోన్ మార్కెట్లను కొళ్లగొట్టింది.

02/19/2020 - 23:23

ముంబయి, ఫిబ్రవరి 19: భారత స్టాక్ మార్కెట్లలో బుధవారం బుల్ రన్ కొనసాగింది. ఆరంభంలో నష్టాల్లో ట్రేడైన వివిధ కంపెనీల షేర్లు ఆ తర్వాత పుంజుకుని లాభాల్లోకి దూసుకెళ్లాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ ఏకంగా 428.62 పాయింట్లు మెరుగుపడి, 41,323 పాయింట్లకు చేరింది. అదేవిధంగా జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 133.40 పాయింట్లు పుంజుకుని 12,125.90 పాయింట్లకు చేరింది.

02/19/2020 - 04:52

ఇండోర్: ‘వివాద్ సే విశ్వాస్’ పథకం ద్వారా దేశంలో దాదాపు 90 శాతం ఆదాయం పన్ను వివాదాలను పరిష్కరించవచ్చునని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కొత్త బడ్జెట్‌లో ప్రకటించిన ఈ పథకం వల్ల త్వరితగతిన ఆదాయం పన్ను వివాదాలను నివృత్తి చేసుకునే వీలుంటుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం ప్రకటించారు.

02/19/2020 - 04:33

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: దేశీయ పరిశ్రమలు, ఎగుమతులపై కరోనా వైరస్ ప్రభావాన్ని మదింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే పలు చర్యలు చేపడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం నాడిక్కడ ప్రకటించారు. ప్రధాన మంత్రి కార్యాలయంతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ చర్యలను వెల్లడిస్తామని ఆమె తెలిపారు.

02/19/2020 - 01:07

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ అధికారులు జీఎస్‌టీ చట్టం కింద రాష్ట్రంలో మొదటి అరెస్ట్ నమోదు చేశారు. విశాఖపట్నం వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ ఆధ్వర్యంలో గాజువాక సర్కిల్ అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్, ఇతర అధికారులు, సిబ్బంది కలిసి శేఖర్ ట్రేడర్స్, వెంకట సాయి ట్రేడ ర్స్ యజమాని దుడ్డు శేఖర్‌ను ఈ నెల 15న అరెస్ట్ చేశారు.

02/18/2020 - 23:40

హైదరాబాద్, ఫిబ్రవరి 18: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ (ఐఈఐ) తెలంగాణ స్టేట్ సెంటర్ ఆధ్వర్యంలో శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఐఈఐ తెలంగాణ సెంటర్ పర్యవేక్షణలో ఇంజనీరింగ్ విభాగాలు సరికొత్తగా వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో ఇంజినీరిగ్, టెక్నాలజీలో మరింత పరిజ్ఞానం పెంపొందించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగతుందని సంస్థ చైర్మన్ జీ.రామేశ్వర్ రావు తెలిపారు.

Pages