-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: ఢిల్లీలోని ప్రఖ్యాతిగాంచిన తాజ్ మాన్సింగ్ హోటల్ లీజును హోరాహోరీగా సాగిన వేలం పోరులో టాటా గ్రూప్ తిరిగి కైవసం చేసుకుంది. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) శుక్రవారం నిర్వహించిన వేలం పాటలో టాటా గ్రూప్కు చెందిన ఇండియన్ హోటల్స్ కంపనీ లిమిటెడ్ (ఐహెచ్సీఎల్).. ఐటీసీపై నెగ్గి తాజ్ మాన్సింగ్ హోటల్ ఆస్తుల నిర్వహణను నిలబెట్టుకుంది.
ముంబయి, సెప్టెంబర్ 28: రూపాయి వరుసగా మూడో రోజు శుక్రవారం బలపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ మరో 11 పైసలు పెరిగి, వారం రోజుల గరిష్ఠ స్థాయి 72.48 వద్ద ముగిసింది. ఎగుమతిదారులు తగినంత స్థాయిలో డాలర్ల విక్రయానికి దిగడం వల్ల అమెరికన్ కరెన్సీతో రూపాయి మారకం విలువ పుంజుకుంది. అయితే వారం రీత్యా చూస్తే డాలర్తో రూపాయి మారకం విలువ ఈ వారంలో 28 పైసలు పడిపోయింది.
* జీఎస్టీ పన్ను లోటుపైనా సమీక్ష * ఆర్థిక మంత్రి జైట్లీ వెల్లడి
ముంబయిలో:
=========
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 2,990.00
8 గ్రాములు: రూ.23,970.00
10 గ్రాములు: రూ. 29,900.00
100 గ్రాములు: రూ.2,99,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,197.861
8 గ్రాములు: రూ. 25,582.888
10 గ్రాములు: రూ. 31,978.61
100 గ్రాములు: రూ. 3,19,786.10
వెండి
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల అయిదో దశ విక్రయాలను అక్టోబర్ 1-10 తేదీల మధ్య జరుపనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాల విషయంలో మరింత పారదర్శకతను తీసుకువచ్చే చర్యలలో భాగంగా నగదుకు బదులుగా ఎన్నికల బాండ్లను ఇచ్చే పద్ధతిని ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
ముంబయి, సెప్టెంబర్ 27: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు గురువారం నష్టపోయాయి. ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ఫెడ్ కీలక వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది.
ముంబయి, సెప్టెంబర్ 27: ఫుడ్ ప్రాసెసింగ్ (ఆహార తయారీ ప్రక్రియ) రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐల)పై ఉన్న నియంత్రణలను ప్రభుత్వం సరళీకరించనుంది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి ఊతమివ్వడానికి ఈ చర్య తీసుకోనున్నట్టు ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి గురువారం ఇక్కడ తెలిపారు. ఇప్పటికే భారత ఫుడ్ ప్రాసెసింగ్ రంగం 8.7 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలను ఆకర్శించింది.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టపోయాయి. వరుసగా అయిదు సెషన్ల నష్టాల తరువాత మంగళవారం ఒకే రోజు బలపడిన మార్కెట్లు బుధవారం మళ్లీ బలహీనపడ్డాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీల) రంగంలో ద్రవ్య చలామణిపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో మార్కెట్లో కొనుగోళ్ల సెంటిమెంట్ నిరాశాజనకంగా ఉండటం బుధవారం స్టాక్ మార్కెట్ను దెబ్బతీసింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: భారత ఆర్థిక వ్యవస్థ బలమయిన వృద్ధి పథంలో కొనసాగుతుందని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) బుధవారం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7.3 శాతం ఉంటుందని అంచనా వేసింది.