-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
బీజింగ్, సెప్టెంబర్ 23: చైనాను అప్పులు సాలెగూడులా కబళిస్తూ దేశ ప్రగతికి ప్రతిబంధకంగా మారాయి. ఇప్పటికే ఈ రుణాలు 2.58 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరాయని ఆదివారం నాడిక్కడ విడుదలైన ఓ ప్రకటన స్పష్టం చేసింది. ఈ యేడాది రుణాలు 21 ట్రిలియన్ యువాన్లకు మించకూడదని అత్యున్నత చట్టసభ నిర్ధేశించింది. కాగా గడచిన ఆగస్టు నాటికి చైనా రుణ బకాయిలు 17.66 ట్రిలియన్ యువాన్లు (2.58 అమెరికన్ డాలర్లు)గా ఉంది.
ముంబయి, సెప్టెంబర్ 23: ఫైనాన్సియల్ మార్కెట్లలో కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్టు, అవసరమయితే తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ), మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆదివారం ప్రకటించాయి. శుక్రవారం ఈక్విటీ, డెబిట్ మార్కెట్లు భారీ స్థాయిలో పడిపోయిన నేపథ్యంలో ఈ ప్రకటనలు వెలువడ్డాయి.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో వారం బలహీనపడ్డాయి. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) సెనె్సక్స్ భారీగా 1,249.04 పాయింట్లు పడిపోయి, రెండు నెలల కనిష్ట స్థాయి 36,841.60 పాయింట్లకు దిగజారింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) నిఫ్టీ 372.10 పాయింట్లు కోల్పోయి, కీలకమయిన 11,200 స్థాయికన్నా దిగువకు దిగజారి 11,143.10 పాయింట్ల వద్ద ముగిసింది.
మథుర, సెప్టెంబర్ 22: పవిత్రమైన గోమాత మూత్రం, పేడ నుంచి సౌందర్య ఉత్పత్తులను తయారు చేసి మార్కెటింగ్ చేయాలన్న సంకల్పానికి ఆరెస్సెస్ అనుబంధ విభాగం దీన్ దయాళ్ ధామ్ శ్రీకారం చుట్టింది. త్వరలో ఆమెజాన్ ఇండియా ద్వారా సబ్బులు, ఫేస్ ప్యాక్లు, షాంపూలు, ఔషధ ఉత్పత్తులను తయారు చేయనున్నారు. ఈ కామర్స్ ద్వారా అమెజాన్ సంస్థ నుంచి విక్రయాలు చేస్తారు. దాదాపు ఒక డజను ఉత్పత్తులతో మార్కెట్ను ముంచెత్తనున్నారు.
చెన్నై, సెప్టెంబర్ 22: తమిళనాడులోని ట్యుటికొరిన్లో స్టెర్లైట్ ప్లాంట్ను మళ్లీ తెరిచే ప్రసక్తే లేదని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వేదాంత లిమిటెడ్ యూనిట్ ఆధ్వర్యంలోని ప్లాంట్ను మూసేయాలన్నది విధాన నిర్ణయమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజల సెంటిమెంట్కు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని పేర్కొంది.
ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,025.00
8 గ్రాములు: రూ.24,200.00
10 గ్రాములు: రూ. 30,250.00
100 గ్రాములు: రూ.3,02,500.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,235.294
8 గ్రాములు: రూ. 25,882.352
10 గ్రాములు: రూ. 32,352.94
100 గ్రాములు: రూ. 3,23,529.40
వెండి
8 గ్రాములు: రూ. 329.20
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానాల వల్ల బ్యాంకులు దివాలా తీశాయని, ఈరోజు రుణాలు మంజూరు చేసేందుకు కూడా తగిన నిధులు బ్యాంకుల వద్ద లేవని కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం ధ్వజమెత్తారు. ఎగుమతి పరపతి గణనీయంగా పడిపోయిందన్నారు. గత ఏడాది జూన్ 2017లో ఎగుమతి పరపతి రూ.39వేల కోట్లు ఉండగా, ఈ ఏడాది జూన్కు రూ.22,300 కోట్లకు దిగజారిందన్నారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్ శుక్రవారం భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా మదుపరులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీల) షేర్లలో భారీగా అమ్మకాలకు పూనుకోవడం వల్ల శుక్రవారం సెషన్ మధ్యలో మార్కెట్ కీలక సూచీలు ఒక్కసారిగా పతనమయ్యాయి.
ముంబయి, సెప్టెంబర్ 21: తనపై ఉన్న నాన్బెయిలబుల్ వారెంట్ను రద్దు చేయాలని పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో సహ నిందితునిగా ఉన్న వజ్రాల వ్యాపారి మెహల్ ఛోక్సీ శుక్రవారం సీబీఐ కోర్టును ఆశ్రయించారు. భారత్కు వస్తే తనకు ప్రాణహాని ఉందని ఆయన విన్నవించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో 12,636 కోట్ల మోసానికి సంబంధించి సీబీఐ మే 22న రెండో చార్జిషీటు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాను ఫిచ్ రేటింగ్స్ 7.8 శాతానికి పెంచింది. ఈ వృద్ధి రేటు 7.4 శాతం ఉంటుందని గతంలో అంచనా వేసింది.