-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
ముంబయి, సెప్టెంబర్ 21: రూపాయి వరుసగా రెండో రోజు శుక్రవారం బలపడింది. అమెరికన్ డాలర్తో రూపాయి మారకం విలువ శుక్రవారం 17 పైసలు పెరిగి, 72.20 వద్ద ముగిసింది. దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం తీవ్రమయిన ఊగిసలాటకు గురయినప్పటికీ, అమెరికన్ కరెన్సీ అయిన డాలర్ అమ్మకాలు తగినంత స్థాయిలో ఉండటం వల్ల రూపాయి విలువ పుంజుకుంది.
ముంబయి: స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఓకదశలో సెనె్సక్స్ 1000 పాయింట్లకు పైగా పతనం అయింది. నిఫ్టీ కూడా 11 వేల మార్క్ను కోల్పోయింది. మార్కెట్ ముగిసే సమయానికి 280 పాయింట్లు నష్టపోయి 36,842 వద్ద, నిఫ్టీ 91 పాయింట్ల నష్టంతో 11,143 వద్ద ముగిసింది.
న్యూఢిల్లీ: అనేక సంవత్సరాల తరువాత చిన్న మొత్తాల పొదుపుపై వడ్డీ రేట్లు పెరిగాయి. ప్రభుత్వం నేషనల్ సేవింగ్స్ సర్ట్ఫికెట్ (ఎన్ఎస్సీ), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఖాతాలు సహా చిన్న మొత్తాల పొదుపు ఖాతాలలోని సొమ్ముపై అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో 0.4 శాతం వరకు వడ్డీ రేట్లను పెంచింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: ముడి చమురు ధరల్లో కదలికలు, దేశీయ రాజకీయాల క్రియాశీలత, ప్రపంచ వడ్డీ రేట్లు, అంతర్జాతీయ వాణిజ్య రంగంలో పరిణామాలు సమీప భవిష్యత్తులో దేశీయ స్టాక్ మార్కెట్ల ధోరణిని నిర్దేశించనున్నాయి.
వడోదర, సెప్టెంబర్ 20: వ్యయంలో సమతుల్యతను సాధించడానికి, ఆర్థిక వ్యవస్థ వృద్ధి పుంజుకోవడానికి అవసరమయిన వ్యూహాన్ని రూపొందించేందుకు పరిశ్రమలు, ప్రభుత్వం మధ్య ఒక సంయుక్త సమావేశం జరగాల్సిన అవసరం ఉందని ఫెడరేషన్ ఆఫ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (్ఫక్కీ) పిలుపునిచ్చింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: రూపాయి విలువ పతనం సమస్య ఇప్పట్లో తీరేట్లు లేదు. సమీప భవిష్యత్తులో కూడా ఇది కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా అంతర్జాతీయ కారణాల వల్లే రూపాయి విలువ పతనం అవుతోంది. ఈ పతనం ఆగిపోయి, రూపాయి కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. డన్ అండ్ బ్రాడ్స్ట్రీట్ తాజా నివేదిక ఒకటి ఈ విషయం వెల్లడించింది.
బుచారెస్ట్ (రుమేనియా), సెప్టెంబర్ 20: భారత్ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేసిందని, పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ఉపరాష్టప్రతి ఎం వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. రుమేనియాలోని బుచారెస్ట్లో వాణిజ్య వేత్తల సమావేశంలో ప్రసంగించారు. భారత్-రుమేనియా మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 70 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఉపరాష్టప్రతి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ముంబయ:చిన్న మొత్తాలపై వడ్డీరేట్లను కేంద్ర ప్రభుత్వం పెంచింది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి గానూ జాతీయ పొదుపు(ఎన్ఎస్సీ), ప్రజా భవిష్యనిధి(పీపీఎఫ్)లాంటి చిన్న మొత్తాలపై ప్రస్తుతం ఉన్న వడ్డీరేటును 0.4శాతం పెంచింది. బ్యాంకుల్లో డిపాజిట్ రేట్లు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
ముంబయి, సెప్టెంబర్ 19: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు బుధవారం కూడా నష్టపోయాయి. డాలర్తో రూపాయి మారకం విలువ కోలుకున్నప్పటికీ, ప్రపంచ సంకేతాలు సానుకూలంగా ఉన్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్ కీలక సూచీలు పడిపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) సెనె్సక్స్ 169 పాయింట్లు దిగజారి, రెండు నెలల కనిష్ట స్థాయి 37,121.22 పాయింట్ల వద్ద ముగిసింది.
కోల్కతా, సెప్టెంబర్ 19: షిప్పుల తయారీలో పబ్లిక్ సెక్టార్ సంస్థ అయిన జిఆర్ఎస్ఇ లిమిటెడ్ ఈనెల 24న ఐపిఓకు వెళ్లనుంది. దీని ద్వారా 340 కోట్ల నిధులు సేకరించాలని భావిస్తోంది. ప్రస్తుతం 20 షిప్ల నిర్మాణ సామర్థ్యం గల ఈ సంస్థ 2021-22 నాటికి 24 షిప్ల స్థాయికి పెంచుకోనుంది.