S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/12/2018 - 17:30

ముంబయి:దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెనె్సక్స్ 305 పాయింట్లు లాభపడి 37,717 వద్ద ముగిసింది. నిఫ్టీ 82 పాయింట్లు లాభపడి 11,369 వద్ద స్థిరపడింది.

09/12/2018 - 14:00

ముంబయ: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 64, నిఫ్టీ 33 పాయింట్ల నష్టంతో ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.83గా ఉంది.

09/11/2018 - 23:32

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు మంగళవారం కూడా భారీగా దెబ్బతిన్నాయి. ప్రపంచ వాణిజ్య యుద్ధం తీవ్రమవుతోందనే ఆందోళనలు నెలకొన్న తరుణంలో ఎఫ్‌ఎంసీజీ, లోహ, వాహన, ఫైనాన్సియల్ స్టాక్‌లు తీవ్ర స్థాయిలో అమ్మకాల ఒత్తిడికి లోనయి, మార్కెట్ కీలక సూచీలు పతనమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 509 పాయింట్లు పడిపోయి, 37,413.13 పాయింట్ల వద్ద ముగిసింది.

09/11/2018 - 23:22

ముంబయి, సెప్టెంబర్ 11: ప్రభుత్వం అనుసరిస్తున్న పలు విధానాలు, సైబర్ సెక్యూరిటీలో తరచూ తలెత్తుతున్న అవరోధాలు, లోపాల వల్ల వచ్చే మూడేళ్లలో దేశంలోని దాదాపు 100కి పైగా పెద్ద కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కోనున్నాయి. ఈ విషయమై ఆయా కంపెనీల అధిపతులు, ఉన్నత స్థాయి అధికారులతో నిర్వహించిన సుదీర్ఘంగా జరిపిన సర్వే ఆధారంగా ‘డెలాయిట్ ఇండియా రిస్క్ సర్వే 2018’ తాజాగా విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది.

09/11/2018 - 23:20

ముంబయి, సెప్టెంబర్ 11: ప్రస్తుతం మార్కెట్‌లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేదిశగా కృషి జరగాల్సిన అవసరం ఎంతో ఉందని మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) అభిప్రాయపడింది.
అదేసమయంలో ఇపుడున్న నిబంధనలను మరింత పటిష్టం చేయడంతోపాటు ఆర్థిక నేరాలు, మోసాలు, మార్కెట్‌ను తారుమారు చేయడం, అంతర్గత ట్రేడింగ్ అంశాల్లో మరింత నిజాయితీ, పారదర్శకత ఉండాలని పేర్కొంది.

09/11/2018 - 23:29

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం కూడా పెరిగాయి. లీటర్‌కు 14 పైసల చొప్పున పెరిగిన వీటి ధరలు సరికొత్త గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. రూపాయి మారకం విలువ సరికొత్త జీవనకాల కనిష్ట స్థాయికి పడిపోవడంతో దిగుమతులు మరింత ప్రియమై దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.

09/11/2018 - 23:07

ముంబయి, సెప్టెంబర్ 11: సమస్యల్లో చిక్కుకున్న రూపాయి మంగళవారం మరింత పతనమయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 24 పైసలు పడిపోయి, సరికొత్త రికార్డు కనిష్ట స్థాయి 72.69 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో తిరిగి ముడి చమురు ధరలు పెరగడం, మన క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటంతో పాటు ప్రపంచ వాణిజ్య యుద్ధ భయాలు తీవ్రం కావడం రూపాయి పతనానికి దారితీశాయి.

09/11/2018 - 17:25

ముంబయి : దేశీయ మార్కెట్లు మంగళవారం భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా పతనమవగా.. నిఫ్టీ 11,300 దిగువకు పడిపోయింది. రూపాయి మళ్లీ జీవనకాల కనిష్ఠస్థాయికి పడిపోయింది.

09/10/2018 - 23:38

ముంబయి: గత కొన్ని రోజులుగా ఆశావహ రీతిలో సాగిన భారతీయ స్టాక్ మార్కెట్‌లో గత మూడువారాల్లో ఎన్నడూ లేనిరీతిలో సోమవారం కుదేలయ్యాయి. ఒకపక్క డాలర్ మారకంతో రూపాయి పతనం కొనసాగడం, మరోపక్క అంతర్జాతీయ వాణిజ్య యుద్ధాలపై ఆందోళనకర పరిస్థితులు నెలకొనడంతో వాటి ప్రభావం ఇటు సెనె్సక్స్, ఇటు నిఫ్టీ లావాదేవీలపై పడింది.

09/10/2018 - 23:36

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: గురుగ్రామ్‌లో తమ ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు మరికొంత గడువుకావాలని 13 సెజ్ డెవలపర్స్‌తోపాటు, యూనిట్స్, జీపీ రియల్టర్స్, జేబీఎఫ్ పెట్రోకెమికల్స్, అరబిందో ఫార్మా వంటి సంస్థలు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖను కోరాయి. ఆయా సంస్థల ప్రతిపాదనలపై ప్రత్యేక ఆర్థిక జోన్లు (సెజ్‌లు) ఈనెల 12న జరిగే బోర్డు ఆఫ్ అప్రూవల్‌లో ఒక నిర్ణయాన్ని తీసుకోనున్నారు.

Pages