S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/21/2018 - 00:44

న్యూఢిల్లీ, జూన్ 20: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి వ్యవహారశైలిపై తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన పలువురు సీనియర్ నాయకులు, శాసన సభ్యులు బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసినట్లు దేశ రాజధానిలో చర్చ జరుగుతున్నది. కానీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కార్యదర్శి కుంతియా మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చారు.

06/21/2018 - 00:43

హైదరాబాద్, జూన్ 20: శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో 2018-19 సంవత్సరానికి చేరేందుకు ప్రస్తుతం ఉన్న నియమావళిలో స్వల్ప మార్పులు చేశారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి పేరుతో బుధవారం జీఓ జారీ అయింది.

06/21/2018 - 00:54

విజయవాడ, జూన్ 20: విత్తనాభివృద్ధి హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో మెగా సీడ్ పార్కు ముందుకు తీసుకెళ్లడానికి చేపట్టే ప్రతి చర్యను స్వాగతిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం నగరంలోని ఓ సమావేశ మందిరంలో ‘మెగా సీడ్ పార్కు’ కార్యాచరణ ప్రణాళికపై నిర్వహించిన కార్యశాల, విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

06/20/2018 - 01:00

న్యూఢిల్లీ: దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో కరెంటు ఖాతా లోటు (సీఏడీ) 2.5 శాతానికి చెందినా ఆందోళన చెందవలసిన అవసరం లేదని, విదేశీ నిధులు తరలిపోవడం వల్ల ఏమయినా అసమతుల్యత ఏర్పడితే, దానిని చక్కదిద్దడానికి అవసరమయిన పరిష్కారం ప్రభుత్వం వద్ద ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాశ్ చంద్ర గార్గ్ స్పష్టం చేశారు. ‘2 శాతం నుంచి 2.5 శాతం వరకు సీఏడీ వల్ల మాకు ఎలాంటి సమస్య ఉండదు.

06/20/2018 - 00:16

విశాఖపట్నం, జూన్ 19: ఉద్యాన పంటలే రైతుకు ఆర్థికంగా చేయూతనిస్తాయని హార్టీకల్చర్ విభాగం ఏడీ ఎం శరవరణన్ అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, బెస్ట్ ఇంజనీరింగ్ టెక్నాలజీస్ సంయుక్తంగా విశాఖలో రైతుల కోసం మంగళవారం నిర్వహించిన ఒక రోజు శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించే పంటలను ప్రాసెసింగ్ చేయడం వల్ల ఆదాయం పెరుగుతుందన్నారు.

06/19/2018 - 23:39

భీమవరం, జూన్ 19: మున్సిపాల్టీలు, నగరాల్లో ఆదాయం పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నీటి వినియోగంపై దృష్టిసారించింది. పౌరులు వినియోగించే నీటి ఆధారంగా పన్ను వసూలుచేయడంతోపాటు, ఇళ్లకు విధించే ఆస్తి పన్ను ఆధారంగా యూజర్ ఛార్జీలు వసూలుచేయనుంది. ఇందుకు అవసరమైన రంగం సిద్ధంచేసింది. ఇదే విధానాన్ని రాష్ట్రంలోని పట్టణాలతోపాటు గ్రామాల్లో కూడా అమలు చేయనున్నట్టు తెలిసింది.

06/20/2018 - 00:14

ముంబయి, జూన్ 19: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు మంగళవారం నష్టపోయాయి. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య వివాదం మళ్లీ రగుల్కోవడంతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు బలహీనపడ్డాయి. అదే దారిలో దేశీయ స్టాక్ మార్కెట్ కీలక సూచీలు పడిపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ మంగళవారం 262 పాయింట్లు పడిపోయి రెండు వారాల గరిష్ట స్థాయి అయిన 35,286.74 పాయింట్ల వద్ద ముగిసింది.

06/19/2018 - 04:35

న్యూఢిల్లీ: 2017-18 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో నమోదైన 7.7 శాతం ఆర్థిక ప్రగతి, ప్రపంచంలోనే భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా సువ్యవస్థాపితం చేసిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. మరికొనే్నళ్లపాటు ఇదే పోకడ కొనసాగుతుందని అంచనా వేశారు.

06/19/2018 - 00:21

ముంబయి, జూన్ 18: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో సోమవారం దేశీయ మార్కెట్లు మందగొడిగా సాగాయి. ముఖ్యంగా అమెరికా, చైనాల మధ్య వాణిజ్య పోరు ప్రభావం మార్కెట్లపై పడింది. చైనానుంచి దిగుమతి అయ్యే 50 బిలియన్ యుఎస్ డాలర్ల విలువైన దిగుమతులపై పెద్ద మొత్తంలో సుంకాలు విధిస్తామని డోనాల్డ్ ట్రంప్ శుక్రవారం ప్రకటించారు. దీనికి దీటుగా చైనాకూడా స్పందించే అవకాశముంది.

06/19/2018 - 00:40

న్యూఢిల్లీ, జూన్ 18: పెరుగుతున్న చమురు ధరలపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో, అరుణ్ జైట్లీ మొదటిసారి పెదవి విప్పారు. దేశ పౌరులు సక్రమంగా పన్నులు చెల్లిస్తే, అప్పుడు చమురుపై ఆధారపడటం తగ్గుతుందంటూ చావుకబురు చల్లగా చెప్పారు. అందువల్ల పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు.

Pages