-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
విజయవాడ: ప్రాంతీయ విమానయాన సంస్థగా సేవలు ప్రారంభించిన ట్రూజెట్ అనతికాలంలోనే జాతీయ విమానయాన సంస్థగా ఎదిగి త్వరలో దేశవ్యాప్తంగా మరిన్ని సర్వీసులను తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాల నుంచి కూడా ప్రారంభించనుంది.
ముంబయి, మార్చి 10: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారమంతా అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. కీలక సూచీలు పతనమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) సెనె్సక్స్ 739.80 పాయింట్లు పడిపోయి, 33,307.14 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) నిఫ్టీ 231.50 పాయింట్లు దిగజారి 10,300 పాయింట్ల స్థాయికన్నా దిగువకు పడిపోయి, 10,226.85 పాయింట్ల వద్ద స్థిరపడింది.
న్యూఢిల్లీ, మార్చి 10: రాష్ట్రాల మధ్య వస్తు రవాణాకు ఎలక్ట్రానిక్ వే బిల్లులను (ఈ-వే బిల్లులను) జారీ చేసే పద్ధతిని ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి శనివారం నిర్ణయించింది. అంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రాల మధ్య వస్తు రవాణాకు ఈ-వే బిల్లులు తప్పనిసరి.
గోదావరిఖని/కొత్తగూడెం, మార్చి 10: సింగరేణి బొగ్గు పరిశ్రమలో కారుణ్య నియామకాల ఏర్పాటుకు సంబంధించి అనేక తర్జన భర్జన తరువాత తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేళకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కారుణ్య నియామకాల విషయంలో సింగరేణి యాజమాన్యం శనివారం ప్రత్యేక సర్క్యూలర్ను జారీ చేసింది. దశాబ్దంన్నర కాలం క్రితం తెలుగుదేశం హయాంలో సింగరేణి పరిశ్రమలో వారసుల ఉద్యోగాలకు చెక్ పడింది.
విశాఖపట్నం, మార్చి 9: గ్రామీణ విద్యుదీకరణ ప్రాజెక్టులను సమర్థవంతంగా అమలుపరిచినందుకు ఆంధ్రప్రదేశ్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(ఏపీఈపీడీసీఎల్)కి జాతీయ స్థాయి అవార్డు దక్కింది. భారతదేశంలో మరేక్కడా సాధించలేని విధంగా ఒక్క ఏపీలో ఉన్న ఈపీడీసీఎల్ మాత్రమే దీనిని సాధించగలిగింది. ప్రతిష్ఠాత్మకమైన ఐఎస్జీఎఫ్ ఇన్నోవేషన్ అవార్డ్స్-2018 డైమండ్ అవార్డు(తొలి బహుమతి)ని సొంతం చేసుకుంది.
న్యూఢిల్లీ, మార్చి 9: ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో కార్తీ చిదంబరంను మరో మూడు రోజులు కస్టడీలో ఉంచుకొని ఇంటరాగేట్ చేసేందుకు ప్రత్యేక కోర్టు శుక్రవారం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు అనుమతి ఇచ్చింది. మరోవైపు, ఢిల్లీ హైకోర్టులో కార్తీ చిదంబరంకు శుక్రవారం కాస్త ఊరట లభించింది.
విజయవాడ, మార్చి 9: వివిధ రకాల బిల్లుల ఆమోదం కోసం ఇక ప్రభుత్వ శాఖల నుంచి ఎవరూ కూడా బిల్లులు చేతిలో పెట్టుకుని ట్రెజరీ కార్యాలయాలు, ఆపై టోకెన్లతో ఎస్బీఐ, ట్రెజరీ, బ్యాంకుల చుట్టూ తిరుగాల్సిన దుస్థితి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి తొలగిపోతున్నది.
రాజమహేంద్రవరం, మార్చి 9 : ఆసియా ఖండం చిత్తడి నేలల్లో నీటి ఆవాసిత పక్షి జాతుల్లో తగ్గుముఖం కన్పిస్తోంది. అటవీ శాఖ ఎగ్రి ఫౌండేషన్ రెండు రోజుల పాటు నిర్వహించిన ఆసియా ఖండంలోని చిత్తడి నేలల పక్షి గణన పూర్తయింది. జీవ వైవిధ్యానికి సంబంధించిన ఈ గణన అవసరమైన చర్యలకు దోహదపడుతుంది.
విజయవాడ, మార్చి 9: ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. కేంద్ర నుంచి తగిన నిధుల కేటాయింపు లేకపోవడం, సోంతంగా నిధులు ఆశించిన మేర సమకూరకపోవడంతో నానాటికీ అప్పుల భారం పెరిగిపోతోంది. కాగా తలసరి ఆదాయంలో మాత్రం వృద్ధి నమోదు కావడం విశేషం. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో తాజాగా అప్పుల వివరాలు వెల్లడించారు.
హైదరాబాద్, మార్చి 9: సింగరేణి అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న సోలార్ విద్యుత్ ప్లాంట్ను సంబంధించి నిర్మాణ ప్రక్రియలను మరింత వేగవంతం చేయాలని సింగరేణి సిఎండి ఎన్ శ్రీ్ధర్ అధికారులను ఆదేశించారు. తొలి దశగా 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణం ఏడాదిలోపుగా పూర్తి చేసేందుకు ప్రత్యేక చొరవ చూపాలని ఆయన ఇక్కడ సింగరేణి విద్యుత్ విభాగంతో జరిపిన సమీక్షలో పేర్కొన్నారు.