-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
ముంబయి, మార్చి 9: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెషన్ ఆరంభంలో లాభాలను ఆర్జించినప్పటికీ చివరలో అమ్మకాల ఒత్తిడికి లోనయి కీలక సూచీలు స్వల్పంగా దిగజారాయి. కొన్ని ఉక్కు, అల్యూమినియంల దిగుమతులపై అమెరికా టారిఫ్లు విధించిన నేపథ్యంలో ప్రపంచ వాణిజ్య యుద్ధం (గ్లోబల్ ట్రేడ్ వార్) మొదలవుతుందనే ఆందోళన నెలకొనడంతో లోహ రంగాల కంపెనీల షేర్లు తీవ్రమయిన అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
ముంబై: ఆసియా మార్కెట్ల సానుకూల ప్రభావంతో పాటు కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో... ఉదయం నుంచి మన స్టాక్ మార్కెట్లు జోరుగానే కొనసాగాయి. కానీ, చివరి గంటలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 44 పాయింట్లు కోల్పోయి 33,307కు పడిపోయింది. నిఫ్టీ 16 పాయింట్లు నష్టపోయి 10,227 వద్ద స్థిరపడింది.
ముంబయి: గత ఆరు రోజులుగా వరుసగా నష్టాల్లో కూరుకుపోయిన స్టాక్ మార్కెట్లు, గురువారం కొద్దిగా కోలుకున్నాయి. బీఎస్ఈ మొత్తం 318 పాయింట్లు కోలుకొని, 33,351.57 వద్ద ముగియగా, నిఫ్టీ 88 పాయింట్ల లాభంతో 10,242.65 వద్ద ముగిసింది.
గుంటూరు, మార్చి 8: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి, నదుల అనుసంధానం, పోలవరం, రాజధాని నిర్మాణానికి ప్రాధాన్యతనివ్వటంతో పాటు విద్య, ఆరోగ్యం, సంక్షేమ రంగాలకు భారీ కేటాయింపులు జరుపుతూ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అంచనా బడ్జెట్కు రూపకల్పన చేశారు.
ముంబయి, మార్చి 8: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం మొత్తం విలువ రూ.12,464 కోట్లకు మించే అవకాశం లేదని ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ గురువారం స్పష్టం చేశారు. నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సీలు తప్పుడు పిఎన్బికి చెందిన ‘‘లెటర్స్ ఆఫ్ అండర్ టేకింగ్’’ (ఎల్ఓయు)లను చూపి, విదేశాల్లోని భారతీయ బ్యాంకులనుంచి పెద్దమొత్తంలో రుణాలు పొందారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
ముంబయి, మార్చి 7: విదేశీ స్టాక్ మార్కెట్లు పడిపోవడంతో దాని ప్రభావం వల్ల దేశీయ మార్కెట్లు వరుసగా ఆరో సెషన్ బుధవారం కూడా నష్టపోయాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నత స్థాయి ఆర్థిక సలహాదారు గ్యారీ కోహన్ తన పదవి నుంచి తప్పుకున్న తరువాత అమెరికా వాణిజ్య యుద్ధానికి (ట్రేడ్ వార్కు) దిగుతుందన్న ఆందోళన నెలకొని ప్రపంచ స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. దీని ప్రతికూల ప్రభావం భారత మార్కెట్లపైనా పడింది.
సీలేరు, మార్చి 7: సీలేరు జల విద్యుత్ కేంద్రం విద్యుత్ ఉత్పత్తిలో విధించిన గడువుకు ముందే లక్ష్యాన్ని సాధించిందని ఎపీ జెన్కో డివిజనల్ ఇంజనీర్ సుధాకర్ తెలిపారు.
విశాఖపట్నం, మార్చి 7: అనూహ్యంగా పెరుగుతున్న విద్యుత్ వాడకాన్ని దృష్టిలో పెట్టుకుని నిరంతరాయంగా సరఫరా చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఏపీఈపీడీసీఎల్) భారీ విద్యుత్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతోంది. ఇందులో భాగంగా ఐదు జిల్లాల్లో దాదాపు 46 కొత్త విద్యుత్ సబ్స్టేషన్లను నిర్మించేందుకు రంగం సిద్ధం చేసింది.
న్యూఢిల్లీ, మార్చి 7: టోల్-నిర్వహణ-బదలాయింపు ప్రాతిపదికన దేశంలోని 9 హైవే ప్రాజెక్టులనుంచి ఆశించిన దానికంటే అధిక రాబడులు నమోదు కావడం కేంద్ర ప్రభుత్వంలో ఉత్సాహం నింపింది. వీటి ద్వారా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ఖాతాలో మొత్తం రూ.10,500 కోట్లు చేరాయి. వీటి నుంచి రూ.6,258 కోట్లు సమకూరగలవని ప్రభుత్వం అంచనా వేసింది.
విజయవాడ, మార్చి 7: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో గురువారం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టనున్నారు. కేంద్రం నుంచి పెద్దగా ఆశించిన మేర నిధుల కేటాయింపులు లేకపోయినప్పటికీ, దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ను రూపకల్పన చేస్తున్నారు.