-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
హైదరాబాద్, డిసెంబర్ 11: విద్యుత్ ఆదాకు ఎంతగానో ఉపయోగపడే అత్యాధునిక ఎల్ఈడి లైట్లను దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్టు లాయల్ ఎల్ఈడీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండి నిరంజన్ పన్నారి తెలిపారు. సోమవారం బంజారాహిల్స్లోని ఓ హోటల్లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో సంస్థ సీఈవో మనీష్తో కలిసి సంస్థ బ్రోచర్ను ఆవిష్కరించారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: వ్యవసాయ రుణాల రద్దు విధానం ఆర్థిక వ్యవస్థకు కాని రుణ సంస్కృతికి కాని మంచిది కాదని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మాజీ గవర్నర్ వైవీ రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయ రుణాల రద్దు అనేది చివరకు రాజకీయ నిర్ణయమే అవుతుందని, దీర్ఘకాలికంగా చూస్తే ఇది సరయిన నిర్ణయం కాదని ఆయన అన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 11: ఈ నెల 16న దుండిగల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్, గ్రాండ్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పాసింగ్ ఔట్ పరేడ్కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఎయిర్ ఫోర్స్ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబ పరమ విశిష్ఠ సేవా మెడల్, అతి విశిష్ఠ సేవా మెడల్స్ ప్రదానం చేయనున్నట్టు ఐడె-డి- క్యాంప్లో సోమవారం నావల్ అధికారుల సమీక్ష సమావేశంలో తెలిపారు.
అల్వేన్(జర్మనీ), డిసెంబర్ 11: డబ్బు కోసం ఇంటినో లేదా వస్తువునో విక్రయించిన సంగతే మనకు తెలుసు. అయితే ఒకప్పటి కమ్యూనిస్టు దేశమైన తూర్పు జర్మనీలో ఏకంగా ఊరునే అమ్మేశారు. 12 భవనాలు, షెడ్డు, గ్యారేజీలతోకలిపి మొత్తం 14,000 యూరోలు( రూ. 1.06 కోట్ల)కు గ్రామాన్ని అమ్మేశారు. ఉబేగువా- వారెన్బుర్కే అనే పట్టణాన్ని ఆనుకునే అల్వేన్ గ్రామం ఉంది. శనివారం నాడు జరిగిన ఓ వేలంలో అల్వేన్ను అమ్మేశారు.
విజయవాడ, డిసెంబర్ 11: ఆంధ్రప్రదేశ్లో మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటులో భాగస్వామిగా ఉండేందుకు, జల వనరుల సంరక్షణకు సహకారం అందించేందుకు ఆస్ట్రేలియా ముందుకు వచ్చింది. సోమవారం సాయంత్రం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో ఆస్ట్రేలియన్ బృందం జరిపిన భేటీలో రెండు ముఖ్యమైన అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 10: హైదరాబాద్ కేంద్రంగా బంగారం బ్లాక్ దందా యదేచ్ఛగా కొనసాగుతోంది. ఎలాంటి బిల్లులు లేకుండా కోట్లాది రూపాయల లావాదేవీలు కొనసాగుతున్నాయి. పన్ను ఎగవేసేందుకు అక్రమ మార్గాలను ఎంచుకుంటోంది కొందరైతే..మరికొందరు షాపుల్లో బిల్లులు లేకుండానే బంగారం క్రయ,విక్రయాలు సాగిస్తున్నారు. అయితే వీటిపై పోలీసులు కానీ..ఆదాయపు పన్నుశాఖ గానీ కేసులు నమోదు చేయడం లేదని విమర్శలు సర్వత్రా వస్తున్నాయి.
న్యూఢిల్లీ, డిసెంబర్ 10: వీవీఐపీల ప్రయాణాలకు ఉద్దేశించిన రెండు విమానాల ఆధునికీకరణ వ్యయం కోసం ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా రూ. 1,600 కోట్ల రుణం తీసుకోవడానికి ప్రయత్నిస్తోంది.
నిజామాబాద్, డిసెంబర్ 10: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయినిగా భాసిల్లుతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పెనుముప్పులా పరిణమించిన ‘బాబ్లీ’ బంధనానికి విరుగుడుగా ‘కాళేశ్వరం’ ప్రాజెక్టు నిలుస్తుందని ఆయకట్టు రైతులు బలంగా విశ్వసిస్తున్నారు.
సారంగాపూర్, డిసెంబర్ 10: ఒక రైతుకు వరి శిక్ష ! మరో రైతు నెత్తిన పత్తి కత్తి! చేదు గా చెరకు ! ఇంకో రైతుకు నిలువెల్లా కూర‘గాయాలు’! ఏ రైతును చూసినా కష్టమే.. సాగు నష్టమే..పొలాలన్నీ హలాలతో దునే్న రైతులు తమ బలాన్ని మాత్రమే కాదు.. ప్రాణాలను పొలానికే అర్పిస్తున్నారు. ఇది ఒక్క ఏడాది కథ కాదు. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న వ్యథ. ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భరోసా ఇవ్వడం లేదు. ఎరువు బరువై..
భీమవరం, డిసెంబర్ 10: డాలర్ల పంటగా పేరొందిన రొయ్యల సాగుకు రాష్ట్రంలో ముప్పు ఏర్పడుతోంది. సాగులో రైతులు నిషేధిత యాంటిబయోటిక్స్ను విచ్చలవిడిగా వినియోగిస్తుండటంతో ప్రధాన దిగుమతి దేశాలు తిప్పిపంపుతున్నా యి. దీనితో దేశీయంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రొయ్యల పరిశ్రమ సంక్షోభంలోకి కూరుకుపోతోంది.