S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/15/2017 - 23:41

నిజామాబాద్, నవంబర్ 15: నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని లక్కంపల్లి శివారులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను నెలకొల్పేందుకు పతంజలి సంస్థ ముందుకు వచ్చింది. ఇక్కడ వ్యవసాయాధారిత పరిశ్రమల కోసం సేకరించి ఉంచిన ‘సెజ్’ స్థలంలో ఆహార శుద్ధి కేంద్రాన్ని నిర్మించేందుకు సంసిద్ధత తెలిపింది.

11/15/2017 - 23:38

వాషింగ్టన్, నవంబర్ 15: అగ్రరాజ్యం అమెరికా గడ్డపై భారతీయ కంపెనీలు వేళ్లూనుకున్నాయా? అవుననే అంటోంది కానె్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ). అమెరికా ఆర్థిక వ్యవస్థలో భారతీయ కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని గణాంకాలతో సహా సీఐఐ పేర్కొంది.

11/15/2017 - 23:38

ఖైరతాబాద్, నవంబర్ 15: ప్యాకేజింగ్ రంగాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని వరల్డ్ ప్యాకేజింగ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యుపిఓ) నూతన అంబాసిడర్‌గా నియమితులైన చక్రవర్తి అన్నారు. బుధవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వస్తువుల ఉత్పత్తి ఎంత ముఖ్యమో వాటిని భద్రంగా ప్యాకింగ్ చేయడం అంతే ముఖ్యమని అన్నారు. ప్యాకేజింగ్‌లోని లోపాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు.

11/15/2017 - 23:37

న్యూఢిల్లీ, నవంబర్ 15: నిధుల సమీకరణకు, ప్రధాన కార్యకలాపాలను బలోపేతం చేయడానికి బోర్డు ఆమోదించిన రోడ్‌మ్యాప్‌లను నెల రోజులలోగా సమర్పించాలని ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 2.11 లక్షల కోట్ల మూలనిధిని సమకూర్చే కసరత్తులో భాగంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది.

11/15/2017 - 23:36

విశాఖపట్నం, నవంబర్ 15: బంగాళదుంపల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడుతూ వస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు ఇకపై ఆ ఇబ్బంది లేదు. మన రాష్ట్రంలోనే బంగాళదుంపలు పండించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ రీజనల్ రీసెర్చ్ సైంటిస్ట్ మొహిందర్ సింగ్ తెలియచేశారు.

11/15/2017 - 23:36

విజయవాడ, నవంబర్ 15: కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనతికాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షిస్తోందని కొరియన్ కాన్సులేట్ జనరల్ హంగ్‌తాయ్ కిమ్ అన్నారు. కొరియా దేశానికి, ఆంధ్రప్రదేశ్‌కు అవినాభావ సంబంధాలున్నాయని, త్వరలో నవ్యాంధ్రకు కొరియన్ల పర్యాటక బృందాలు వెల్లువెత్తుతాయని కిమ్ అన్నారు.

11/15/2017 - 23:34

మెదక్ రూరల్, నవంబర్ 15: వందశాతం రాయితీపై మత్స్యకారులకు చేప పిల్లలు అందజేస్తున్న తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఎవరూ చేయని విధంగా రొయ్యల పెంపకానికి సాహసం చేసింది. ఇందుకోసం పది ప్రాజెక్టులు, చెరువులు ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా రొయ్యలు పెంచేందుకు శ్రీకారం చుట్టింది. మత్స్యశాఖ అధికారులు.

11/15/2017 - 23:33

విజయవాడ, నవంబర్ 15: మేఘా కంపెనీ మరో రికార్డును అధిగమించింది. నిర్దేశించిన గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేసి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు చేసుకున్న మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) తాజాగా ప్రాజెక్ట్ నిర్వహణలోనూ మైలురాయిని అధిగమించింది.

11/15/2017 - 01:38

న్యూఢిల్లీ, నవంబర్ 14: శ్రీమంతులు చిటారుకొమ్మన, పేదలు అట్టడుగున ఉన్న విడ్డూర పరిస్థితి భారత్‌ది. దేశ జనాభాలోని పెద్దల్లో 92 శాతంమంది ఆదాయం పదివేల డాలర్లలోపేనని, కానీ మిలియనీర్ల సంఖ్య 2,45,000 అని తాజా సర్వే వెల్లడించింది. రానున్న కొన్ని సంవత్సరాల కాలంలోనే ఈ శ్రీమంతుల సంఖ్య 3,72,000కు చేరుకునే అవకాశం ఉంది.

11/15/2017 - 01:38

భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉత్థానపతనాల మధ్య సాగాయి. అనేకసార్లు 33వేల మార్క్ వరకు వెళ్లి మళ్లీ వెనక్కి తగ్గాయి. బిఎస్‌ఇ సెనె్సక్స్ అంతిమంగా 91.69 పాయింట్లు తగ్గి 32,941.87 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 38.35 పాయింట్లు తగ్గి 10,186.60 వద్ద ముగిసింది. టోకు ధరల ద్రవ్యోల్బణం గత ఆరు నెలల్లో ఎన్నడూ లేనివిధంగా 3.59 శాతం పెరిగిందన్న కథనాల ప్రభావం మార్కెట్లపై తీవ్రంగా పడింది.

Pages