-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
విజయవాడ, అక్టోబర్ 8: దేశంలో అతి పెద్ద ఎలక్ట్రిక్ త్రీవీలర్స్ తయారీ సంస్థ కైనెటిక్ గ్రీన్ రానున్న 18 మాసాల్లో దేశవ్యాప్తంగా 10 వేల ఎలక్ట్రికల్ వాహనాలను ప్రవేశపెట్టబోతోంది. ఇందుకు గాను మన దేశానికే చెందిన అతిపెద్ద షేర్డ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ స్మార్ట్-ఇతో ఈ సంస్థ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది.
ముంబయి, అక్టోబర్ 7: పెట్రోలియం ఉత్పత్తులను వస్తు, సేవల పన్ను (జిఎస్టి) పరిధిలోకి తీసుకురావడంతో పాటు తమకు మరింత మార్జిన్ లభించేలా చర్యలు చేపట్టాలని, అలాగే చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న తమ ఇతర డిమాండ్లను పరిష్కరించాలని వత్తిడి తీసుకొచ్చేందుకు పెట్రోలియం డీలర్లు ఈ నెల 13వ తేదీన దేశ వ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నారు.
న్యూఢిల్లీ అక్టోబర్ 7: ప్రైవేటు రంగంలోని ధనలక్ష్మి బ్యాంకు బాండ్లను జారీ చేయడం ద్వారా రూ.150 కోట్లను సమీకరించనుంది. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో రిడీమబుల్, సెక్యూర్డ్/అన్సెక్యూర్డ్ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లను జారీ చేయడం ద్వారా ఏడాది వ్యవధిలో ఈ నిధులను సమీకరించడం జరుగుతుందని ఆ బ్యాంకు స్టాక్ ఎక్స్చేంజికి తెలియజేసింది.
రాజ్కోట్, అక్టోబర్ 7: దేశంలో విమానయానం సంపన్నులకు మాత్రమే పరిమితమైనది కాదని, తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఇప్పుడు ఇది సామాన్య ప్రజలకు సైతం అందుబాటులోకి వచ్చిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. గుజరాత్లోని రాజ్కోట్లో శనివారం ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ‘దేశంలో విమానయానం సంపన్నులకు మాత్రమే పరిమితం కాదు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 7: వస్తు, సేవల పన్ను (జిఎస్టి) రేట్లను హేతుబద్ధీకరించే ప్రక్రియను జిఎస్టి కౌన్సిల్ కొనసాగిస్తుందని, వీటిలో 28 శాతంగా ఉన్న అత్యధిక పన్ను రేటు శ్లాబును క్రమంగా తగ్గించడం జరుగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా వెల్లడించారు.
బీజింగ్, అక్టోబర్ 7: ఎన్నో ఏళ్ల స్తబ్ధత తర్వాత మన దేశం నుంచి చైనాకు ఎగుమతులు పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది తొలి ఏడు మాసాల (జనవరి-ఆగస్టు)లో మన దేశం నుంచి చైనాకు జరిగిన ఎగుమతులు 40.69 శాతం పెరిగి 10.60 బిలియన్ డాలర్లకు చేరుకోవడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.
హైదరాబాద్, అక్టోబర్ 7: కేంద్రం అమలు చేస్తున్న జిఎస్టి విధానం, రోజువారీ డీజిల్ ధరల మార్పిడి, టోల్ టాక్స్లకు నిరసనగా ఈ నెల 9, 10 తేదీల్లో సరుకు రవాణా బుకింగ్, డెలివరీ బంద్ చేస్తున్నట్లు తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.్భస్కర్రెడ్డి, జి.దుర్గాప్రసాద్లు ఒక ప్రకటన విడుదల చేశారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 6: వస్తు సేవల పన్ను (జిఎస్టి) అమలు వల్ల రాష్ట్రాలకు చెల్లించవల్సిన నష్ట పరిహారం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లెక్కలకు పొంతన లేదని ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాలకు చెల్లించే నష్ట పరిహారం విషయంలో లెక్కలు పక్కగా ఉండాలని ఆయన జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో స్పష్టం చేశారు.
ముంబయి, అక్టోబర్ 6: జిఎస్టి కౌన్సిల్ నిర్ణయాలు సానుకూలంగా ఉండబోతున్నాయన్న ఆశావహ పరిస్థితుల నేపథ్యంలో గత రెండు వారాల్లో ఎన్నడూ లేనివిధంగా సెనె్సక్స్ శుక్రవారం ఏకంగా 222 పాయింట్లు పెరిగి 31,814.22 పాయింట్లకు చేరుకుంది. మెటల్ షేర్ల సారథ్యంలో భారీగా కొనుగోళ్లు జరగడంతో నిఫ్టీ కూడా దాదాపు 10 వేల పాయింట్ల స్థాయికి చేరుకుంది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 6: పోస్ట్ఫాసుల్లో చేసే అన్ని డిపాజిట్లతో పాటు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్), నేషనల్ సేవింగ్స్ సర్ట్ఫికెట్ పథకం, కిసాన్ వికాస్ పత్రాల (కెవిపి)లకు ప్రభుత్వం ‘ఆధార్’ గుర్తింపును తప్పనిసరి చేసింది. ఇప్పటికే ఈ డిపాజిట్లు చేసిన వారు ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ లోగా 12 అంకెలతో కూడిన ‘ఆధార్’ నెంబర్ను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.