S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/15/2017 - 00:28

న్యూఢిల్లీ, జూలై 14: దేశీయంగా అత్యంత ప్రభావవంతమైన బ్రాండ్లలో అమెరికా టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ప్రథమ స్థానంలో నిలిచింది. యోగా గురువు రామ్‌దేవ్ బాబా నేతృత్వంలోని పతంజలి, ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియోకు టాప్-10 బ్రాండ్లలో చోటు దక్కింది. గ్లోబల్ రిసెర్చ్ సంస్థ ఇప్సోస్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్.. రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

07/15/2017 - 00:27

రాజమహేంద్రవరం, జూలై 14: ఈ ఏడాది తొర్రేడు కేంద్ర పొగాకు బోర్డు వేలం కేంద్రం పరిధిలో పొగాకు ధర ఆశాజనకంగా సాగింది. మొత్తం 37.76 కోట్ల రూపాయల విలువైన పొగాకు దిగుబడి వేలంలో కొనుగోలు జరిగింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా 13 పొగాకు కంపెనీలు పొగాకు వేలంలో పాల్గొని కొనుగోళ్లకు ఇక్కడకు తరలివచ్చాయి. ఏప్రిల్ 6వ తేదీన మొదలైన వేలం.. మొత్తం 75 రోజులపాటు జరిగింది.

07/15/2017 - 00:27

విశాఖపట్నం, జూలై 14: దేశ ఆర్థిక వ్యవస్థలో సిఎ (చార్టర్డ్ అకౌంటెంట్లు)ల పాత్ర అత్యంత కీలకమైనదిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (ఆర్‌ఐఎన్‌ఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పి మధుసూదన్ అన్నారు. శుక్రవారం ఇక్కడ జరిగిన సదరన్ ఇండియా రీజనల్ కౌన్సిల్ ఆఫ్ ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సబ్ రీజనల్ కాన్ఫరెన్స్‌లో ఆయన ముఖ్య ప్రసంగం చేశారు.

07/15/2017 - 00:24

హైదరాబాద్, జూలై 14: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహానికి తగ్గట్లుగా దేశంలో ఎలక్ట్రానిక్ లావాదేవీలు పెరిగాయని నీతి ఆయోగ్ సభ్యుడు వికె సారస్వత్ తెలిపారు. శుక్రవారం ఇక్కడ పిటిఐతో మాట్లాడిన ఆయన డిజిటల్ ఎకానమీపై సంతృప్తి వ్యక్తం చేశారు. అసంఘటిత రంగంలోనూ ఈ లావాదేవీలు పెరిగాయని చెప్పారు. ఒక్క భీమ్ యాప్‌పైనే 65 లక్షల లావాదేవీలు జరుగుతున్నట్లు వెల్లడించారు.

07/15/2017 - 00:24

న్యూఢిల్లీ, జూలై 14: దేశీయ ఎగుమతులు గత నెల జూన్‌లో 4.39 శాతం పెరిగి 23.56 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. రసాయనాలు, ఇంజినీరింగ్, మెరైన్ ఉత్పత్తుల ఎగుమతి పెరగడమే దీనికి కారణం. మరోవైపు దిగుమతులు కూడా 19 శాతం ఎగిసి 36.52 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీంతో వాణిజ్య లోటు 12.96 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

07/15/2017 - 00:23

న్యూఢిల్లీ, జూలై 14: టోకు ద్రవ్యోల్బణం గత నెల జూన్‌లో 0.90 శాతానికి పడిపోయింది. గడచిన ఎనిమిది నెలల్లో ఇదే అత్యంత కనిష్ట స్థాయి గణాంకాలు కావడం గమనార్హం. కాగా, అంతకుముందు నెల మేలో 2.17 శాతంగా నమోదవగా, నిరుడు జూన్‌లో ఇది మైనస్ 0.09 శాతంగా ఉంది.

07/14/2017 - 00:41

ముంబయ, జూలై 13: దేశంలోనే అతిప్దెద సాఫ్ట్‌వేర్ సర్వీసుల ఎగుమతి సంస్థ టాటా కన్సల్టెంట్ సర్వీసెస్ (టిసిఎస్)నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 6 శాతం మేర తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో కంపెనీ 6,317 కోట్ల రూపాయల నికర లాభం ఆర్జించగా, ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అది రూ.5,945 కోట్లకు తగ్గిపోయింది.

07/14/2017 - 00:36

న్యూఢిల్లీ, జూలై 13: దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అతిపెద్దదైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ నెఫ్ట్ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్), ఆర్‌టిజిఎస్ (రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్) చార్జీలను 75 మేరకు తగ్గించింది. ఈ తగ్గింపు చార్జీలు ఈ నెల 15వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని ఎస్‌బిఐ వెల్లడించింది.

07/14/2017 - 00:33

న్యూఢిల్లీ, జూలై 13: తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఎయిరిండియాను ప్రైవేటీకరించాలన్న ప్రతిపాదన స్వాగతనీయమైనదేనని ఆ సంస్థకు చెందిన పైలెట్లు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపై నిర్ణయం తీసుకునేముందు తమ వేతన బకాయిల అంశాన్ని పరిష్కరించి ప్రభుత్వం గతంలో తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

07/14/2017 - 00:32

న్యూఢిల్లీ, జూలై 13: ఈ ఆర్థిక సంవత్సరం జూన్ నెలతో ముగిసిన తొలి త్రైమాసికంలో తమ సంస్థ పన్ను చెల్లింపునకు ముందు లాభం 7 కోట్ల రూపాయలకు పెరిగినట్లు రిలయన్స్ క్యాపిటల్ అనుబంధ విభాగమైన రిలయన్స్ సెక్యూరిటీస్ గురువారం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ పన్నుకు ముందు లాభం రూ .28 లక్షలుగా ఉంది. కాగా, జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో మొత్తం ఆదాయం 51 శాతం పెరిగి రూ.

Pages