-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
విజయవాడ (ఎడ్యుకేషన్), జూలై 8: ‘వస్తు, సేవల పన్ను (జిఎస్టి) అమలుతో అధికారం పెరగలేదు.. తగ్గలేదు.. వివిధ రాష్ట్రాల్లో ఉన్న పన్నులను పరిశీలించి జాతీయ సగటు ధరలతో పోల్చుకున్న తర్వాతే జిఎస్టిలో శ్లాబులు నిర్ణయించాం.’ అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. శనివారం ఇక్కడ ఒక హోటల్లో జిఎస్టిపై జరిగిన అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా నిర్మలా సీతారామన్ విచ్చేశారు.
హైదరాబాద్, జూలై 8: హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న అమెరికా సంస్థ వాటర్హెల్త్ ఇంటర్నేషనల్ (డబ్ల్యుహెచ్ఐ).. ఓ ప్రతిష్ఠాత్మక గ్లోబల్ అవార్డును గెలుచుకుంది. భారత్సహా ఘనా, నైజీరియా దేశాల్లో ప్రజలకు స్వచ్ఛమైన, పరిశుభ్రమైన మంచినీటి (త్రాగునీరు)ని చౌక ధరలకే అందించడంలో చేసిన కృషికిగాను యునిలివర్ గ్లోబల్ డెవలప్మెంట్ అవార్డు దక్కింది.
హైదరాబాద్, జూలై 8: ప్రముఖ ఐటి కన్సల్టెంట్, సాఫ్ట్వేర్ సర్వీస్ ప్రొవైడర్ బోధ్ ట్రీ.. సిఎస్ఆర్ ప్రాజెక్టులను గుర్తించేందుకుగాను కళామందిర్ ఫౌండేషన్తో ఒప్పందం కుదుర్చుకుంది. బోధ్ ట్రీలో భాగమైన ఇక్విప్.కామ్ ద్వారా సిఎస్ఆర్ ప్రాజెక్టులను చేపట్టేందుకు వీలుగా ఒప్పందం చేసుకున్నట్లు సంస్థ తెలిపింది.
హైదరాబాద్, జూలై 8: దేశంలో 2020 నాటికి అవసరమయ్యే ఇంధనంలో 60 శాతం సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు డెల్ కంపెనీ ప్రకటించింది. సౌరశక్తిని ఒడిసిపట్టే ప్రయత్నం తమ కంపెనీ చేస్తోందని డెల్ ఉపాధ్యక్షుడు దీపక్ ఒలియాన్ తెలిపారు.
న్యూఢిల్లీ, జూలై 8: వెండి ధరలు వెలవెలబోతున్నాయి. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో మార్కెట్లో వెండి వెలుగులు కనిపించడం లేదు. ఈ వారం బులియన్ మార్కెట్ ట్రేడింగ్ను పరిశీలిస్తే కిలో వెండి ధర 37,400 రూపాయల వద్ద ముగిసింది. శనివారం ఒక్కరోజే 800 రూపాయలు పతనమైంది. మంగళవారమైతే ఏకంగా 1,335 రూపాయలు క్షీణించింది.
న్యూఢిల్లీ, జూలై 8: వస్తు, సేవల పన్ను (జిఎస్టి)ను శనివారం నుంచి జమ్ముకాశ్మీర్ కూడా అమల్లోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా ఈ చారిత్రక పన్ను ఈ నెల 1 నుంచే అమల్లోకి వచ్చినది తెలిసిందే. అయితే జమ్ముకాశ్మీర్లోనే అమలుకాలేదు. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కూడా చొరవ తీసుకోగా, శుక్రవారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో జిఎస్టి బిల్లుకు ఆమోదం లభించింది.
హాంబర్గ్, జూలై 8: జర్మనీలోని హాంబర్గ్లో జరిగిన జి20 దేశాల సదస్సులో సభ్యదేశాల అధినేతలు అక్రమ వాణిజ్య కార్యకలాపాలకు వ్యతిరేకంగా సంయుక్తంగా పోరాడాలని, ప్రపంచ ఆర్థిక వృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలని శనివారం ప్రతిజ్ఞ చేశారు. రెండు రోజులపాటు జరిగిన ఈ సదస్సు శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా చివరిరోజైన శనివారం..
ముంబయి, జూలై 8: ఐడిఎఫ్సి బ్యాంక్, శ్రీరామ్ క్యాపిటల్ విలీనానికి లైన్ క్లియరైంది. ప్రైవేట్రంగ బ్యాంకింగ్ సంస్థ ఐడిఎఫ్సి బ్యాంక్, పిరామల్ గ్రూప్ సారథ్యంలోని ఆర్థిక సేవల దిగ్గజం శ్రీరామ్ గ్రూప్ నిర్వహిస్తున్న శ్రీరామ్ క్యాపిటల్ విలీనానికి అంగీకరించాయి.
మదనపల్లె, జూలై 8: చిత్తూరు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో టమోటా సాగు కరవు జయిస్తోంది. దీనికి గత 15 రోజులుగా టమోటా ధరలే నిదర్శనం. శనివారం మదనపల్లె మార్కెట్లో 30 కిలోల టమోటా ధర 2,350 రూపాయల నుంచి 2,500 రూపాయల మేర పలికింది. ఉన్న అరకొర జలవనరులతో ఆరుగాలం కష్టించి పండించిన టమోటా పంటకు ధర ఆశాజనకంగా ఉండడంతో రైతులు సంతోషపడుతున్నారు.
కాకినాడ, జూలై 8: పైపులైన్ ద్వారా ఇంటింటికి వంట గ్యాస్ (సిఎన్జి)ని సరఫరా చేసేందుకు ప్రభుత్వం గతంలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ సంస్థ ప్రజలను ఆకర్షించేందుకు భారీ నజరానాలు ప్రకటించింది. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ ప్రధాన కేంద్రంగా కొనే్నళ్లుగా భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ సంస్థ ఇంటింటికీ పైపులైన్ల ద్వారా వంట గ్యాస్ను సరఫరా చేస్తోంది.