S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/08/2017 - 00:38

న్యూఢిల్లీ, జూలై 7: సిమెంట్ తయారీ దిగ్గజం అల్ట్రాటెక్ సిమెంట్ చైర్మన్, నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుమార మంగళం బిర్లా గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో 22.50 కోట్ల రూపాయల వేతనాన్ని పొందారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16)తో పోల్చితే 18.2 శాతం పెరిగింది. కాగా, ఈసారి తన గ్రూప్ టెలికామ్ సంస్థ ఐడియా సెల్యులార్ నుంచి కేవలం 3.3 లక్షల రూపాయల పారితోషికానే్న అందుకున్నారు.

07/08/2017 - 00:37

చిత్రం.. జర్మనీలోని హాంబర్గ్‌లో జరుగుతున్న జి20 దేశాల సదస్సులో శుక్రవారం
సభ్యదేశాల అధినేతలు కలిసి దిగిన బృంద చిత్రం. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు
అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్ తదితర దేశాల అధ్యక్షులున్నారు

07/08/2017 - 00:36

హాంబర్గ్, జూలై 7: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేయాలని, అంతర్జాతీయ వాణిజ్యానికి ఉన్న అడ్డంకులను తొలగించాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్), ప్రపంచ బ్యాంక్, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ) శుక్రవారం ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చాయి.

07/07/2017 - 00:31

ముంబయి, జూలై 6: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. బిఎస్‌ఇ సెనె్సక్స్ దాదాపు 124 పాయింట్లు లాభపడి 31,369 పాయింట్ల సరికొత్త ముగింపు రికార్డు నమోదు చేసింది. గత నెల 13-14 తేదీల్లో జరిగిన అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో ద్రవ్యోల్బణంపైన, అలాగే వడ్డీ రేట్ల పెంపుపైన విధాన కర్తల్లో ఎలాంటి ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదని సమావేశం వివరాలు వెల్లడించడం మార్కెట్ల జోష్‌కు ప్రధాన కారణమైంది.

07/07/2017 - 00:30

న్యూఢిల్లీ, జూలై 6: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) దారుణమైన వైఫల్యాలతో కూడుకొని ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పి.చిదంబరం విమర్శించారు.

07/07/2017 - 00:28

టెల్ అవీవ్, జూలై 6: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)ను అతి పెద్ద ఆర్థిక సంస్కరణగా అభివర్ణించిన ప్రధాని నరేంద్ర మోదీ భారత దేశం ఇప్పుడు ఆథునికమైన, పారదర్శకమైన సుస్థిరమైన, ముందుగా ఊహించదగిన పన్నుల విదానం దిశగా ముందుకు సాగుతోందన్నారు.

07/07/2017 - 14:21

న్యూఢిల్లీ, జూలై 6: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)తో ఒనగూడుతున్న ప్రయోజనాలను వినియోగదారులకు అందజేసేందుకు దేశంలోని ఆటోమొబైల్ సంస్థలు క్యూ కడుతున్నాయి. నిస్సాన్, స్కోడా, ఇసుజు మోటార్స్ సంస్థలు తమతమ వాహనాల ధరలను 2.4 లక్షల రూపాయల మేరకు తగ్గించి తాజాగా ఈ జాబితాలో చేరాయి. ఇదేవిధంగా టాటా మోటార్స్, బజాజ్ ఆటోమొబైల్స్‌కి అనుబంధంగా పనిచేస్తున్న ఆస్ట్రియా సంస్థ కెటిఎం కూడా తమ వాహనాల ధరలను తగ్గించాయి.

07/07/2017 - 00:24

లండన్, జూలై 6: తనను భారత్‌కు అప్పగించాలనే కేసు తుది విచారణను వచ్చే ఏడాదికి మార్చాలని ప్రస్తుతం బ్రిటన్‌లో తల దాచుకుని ఉన్న మద్యం వ్యాపారి విజయ్ మాల్యా అభ్యర్థనను బ్రిటన్ కోర్టు గురువారం తిరస్కరించడమే కాక డిసెంబర్ 4కు విచారణ తేదీని నిర్ణయించింది.

07/07/2017 - 00:22

న్యూఢిల్లీ, జూలై 6: శరవేగంగా వృద్ధి చెందుతున్న భారత ఇ-కామర్స్ మార్కెట్‌లో తమ వ్యాపారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు అంతర్జాతీయ ఆన్‌లైన్ దిగ్గజం అమెజాన్ గత రెండు నెలల్లో అదనంగా రూ. 2 వేల కోట్లకు పైగా పెట్టుబడులను కుమ్మరించింది. భారత ఇ-కామర్స్ మార్కెట్‌లో 500 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడతామని గతంలో అమెజాన్ ఇచ్చిన హామీలో భాగంగా ఆ సంస్థ ఈ తాజా పెట్టుబడులు పెట్టింది.

07/07/2017 - 00:21

హైదరాబాద్, జూలై 6: తెలంగాణ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ చట్టం రూపొందించడంపై అవలంభిస్తున్న వైఖరితో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంలో గృహ నిర్మాణంపై ప్రతికూల ప్రభావం పడినట్లు నైట్ ఫ్రాంక్ సంస్ధ ప్రకటించింది. 2016తో పోలిస్తే 2017లో 55 శాతం తక్కువగా గృహ నిర్మాణ ప్రాజెక్టులు ప్రారంభం తగ్గిందన్నారు.

Pages