S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/07/2017 - 00:18

హైదరాబాద్, జూలై 6: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తన జెవిఆర్ ఒసి 2 బొగ్గు తవ్వకం ప్రాజెక్టు రెండో దశ పనుల కోసం 776.20 హెక్టార్ల రిజర్వు ఫారెస్టు భూమిని మళ్లించే ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఖమ్మం అటవీ డివిజన్‌లోని లంకపల్లి రిజర్వు ఫారెస్టు భూమిలో సింగరేణి సంస్థకు జెవిఆర్ ఒసి 2 బొగ్గు తవ్వకం ప్రాజెక్టుకు మళ్లించే అటవీ, పర్యావరణ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

07/06/2017 - 00:36

జెరూసలేం, జూలై 5: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన నేపథ్యంలో బుధవారం ఇరు దేశాల మధ్య 7 కీలక ఒప్పందాలు జరిగాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెటన్యహుతో ప్రధాని మోదీ సుధీర్ఘ చర్చల అనంతరం అంతరిక్ష్యం, వ్యవసాయం, నీటి పారుదల తదితర ప్రధాన రంగాల్లో ఈ ఒప్పందాలు చోటుచేసుకున్నాయి.

07/06/2017 - 00:35

న్యూఢిల్లీ, జూలై 5: సెబీ-సహారా కేసులో ఈ నెల 15లోగా 552.22 కోట్ల రూపాయలకు సంబంధించి ఇచ్చిన చెక్కు చెల్లుబాటు కావాల్సిందేనని సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్‌కి సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో జూలై 15 గడువును పెంచాలన్న రాయ్ విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం బుధవారం తోసిపుచ్చింది.

07/06/2017 - 00:35

ముంబయి, జూలై 5: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 35.77 పాయింట్లు పెరిగి 31,245.56 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 24.30 పాయింట్లు అందుకుని 9,637.60 వద్ద నిలిచింది. ఉదయం ఆరంభం నుంచి లాభాల్లోనే కదలాడిన సూచీలు.. మదుపరుల ఆచితూచి కొనుగోళ్లతో స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి.

07/06/2017 - 00:35

ముంబయి, జూలై 5: దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో మూడో అతిపెద్ద బ్యాంకైన యాక్సిస్ బ్యాంక్.. బుధవారం సూపర్ బైక్స్ లోన్లను అందుబాటులోకి తెచ్చింది. ఇటీవలికాలంలో హార్లే డేవిడ్‌సన్, ట్రయంఫ్ తదితర లగ్జరీ సంస్థల బైక్‌లకు మార్కెట్‌లో డిమాండ్ కనిపిస్తుండటం, ముఖ్యంగా యువత నుంచి విశేష ఆదరణ వ్యక్తమవుతుండటంతో ఈ బైక్‌ల కొనుగోళ్ల కోసం ఏకంగా 95 శాతం వరకు రుణ సదుపాయాన్ని అందిస్తామని యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది.

07/06/2017 - 00:34

న్యూఢిల్లీ, జూలై 5: హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌సిఐఎల్).. గత నెల దేశీయ అమ్మకాలు నిరుడుతో పోల్చితే 12.2 శాతం పెరిగాయి. జూన్‌లో 12,804 యూనిట్లుగా నమోదయ్యాయి. నిరుడు జూన్‌లో 11,407 యూనిట్ల విక్రయాలు జరిగినట్లు ఓ ప్రకటనలో సంస్థ తెలిపింది.

07/05/2017 - 00:58

న్యూఢిల్లీ, జూలై 4: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలు నేపథ్యంలో ధరలను నిశితంగా గమనిస్తున్నామని రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు. మార్కెట్‌లో ఆయా ఉత్పత్తుల సరఫరాపై కూడా కనే్నశామని మంగళవారం ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే జిఎస్‌టిపై ప్రజలు, వ్యాపారుల్లో నెలకొన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేసిన అధియా..

07/05/2017 - 00:57

న్యూఢిల్లీ, జూలై 4: రిలయన్స్ జియో.. గత నెల జూన్‌లోనూ 4జి మొబైల్ వేగంలో ఇతర అన్ని టెలికామ్ ఆపరేటర్ల కంటే ముందుంది. టెలికామ్ రెగ్యులేటర్ ట్రాయ్ తెలిపిన వివరాల ప్రకారం జియో డౌన్‌లోడ్ వేగం సెకనుకు 18.8 మెగాబైట్లుగా ఉంది. అయితే మేలో ఇది 19.12 మెగాబైట్లుగా ఉండగా, జూన్‌లో కాస్త తగ్గింది. అయినప్పటికీ 4జి స్పీడ్‌లో జియోనే టాప్ అని ట్రాయ్ మంగళవారం స్పష్టం చేసింది.

07/05/2017 - 00:56

న్యూఢిల్లీ, జూలై 4: ఆదిత్యా బిర్లా గ్రూప్ సంస్థ.. అల్ట్రాటెక్ సిమెంట్ మంగళవారం ధరలను తగ్గించింది. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలు నేపథ్యంలో చేకూరిన ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలనే లక్ష్యంలో భాగంగా సిమెంట్ బస్తాపై 2-3 శాతం ధరను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తమ గోదాముల నుంచి ఈ నెల 1 నుంచే తగ్గిన ధరలతో కూడిన బస్తాలను మార్కెట్‌కు సరఫరా చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

07/05/2017 - 00:56

ముంబయి, జూలై 4: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 11.83 పాయింట్లు పడిపోయి 31,209.79 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 1.70 పాయింట్లు కోల్పోయి 9,613.30 వద్ద నిలిచింది. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలు ఉత్సాహంతో సోమవారం సెనె్సక్స్ 300 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 100 పాయింట్ల మేర లాభాలను అందుకున్నది తెలిసిందే.

Pages