S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/01/2017 - 00:26

గాంధీనగర్, జూన్ 30: టెక్స్‌టైల్ ఎగుమతులపై దృష్టి పెట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. శుక్రవారం ఇక్కడ మహాత్మ మందిర్ వద్ద టెక్స్‌టైల్స్ ఇండియా 2017 మెగా ఫెయర్‌ను ఆయన ప్రారంభించారు. నాలుగు రోజులపాటు ఈ ఫెయర్ జరగనుండగా, ఈ సందర్భంగా మాట్లా డుతూ తమ ప్రభుత్వం వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి పలు చర్యలు తీసుకుందంటూ వాటిని వివరించారు. భారతీయ టెక్స్‌టైల్ రంగం..

07/01/2017 - 00:25

హైదరాబాద్: వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించే టెక్స్‌టైల్ రంగాన్ని ప్రోత్సహించడానికి జాతీయ స్థాయి లో ఒక పాలసీ రూపొందించాల్సిన అవసరం ఉందని తెలంగాణ చేనేత, జౌళి శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. టెక్స్‌టైల్ ఇండియా సెమినార్‌లో కెటిఆర్ పాల్గొన్నారు. దీనిలో నిర్వహించిన సిఇఒ రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ విధానాలు, పారిశ్రామిక పాలసీని కెటిఆర్ వివరించారు.

07/01/2017 - 00:25

ముంబయి, జూన్ 30: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 64.09 పాయింట్లు పెరిగి 30,921.61 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 16.80 అందుకుని 9,520.90 వద్ద నిలిచింది. నిజానికి ఉదయం ఆరంభంలో నష్టాల్లోనే కదలాడిన సూచీలు.. ఎఫ్‌ఎమ్‌సిజి, హెల్త్‌కేర్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు మదుపరులను ఆకట్టుకోవడంతో లాభాల్లోకి వచ్చాయి.

07/01/2017 - 00:28

ఫిబ్రవరి 1986: 1986-87 బడ్జెట్‌లో తొలిసారిగా మొత్తం ఎక్సైజ్ పన్నుల నిర్మాణంలో మార్పులను నాటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రతిపాదించారు. అప్పటిదాకా సవరణలకు తావులేకుండా సాగుతున్న భారతీయ పన్నుల విధానంలో ఇది తొలి సంస్కరణగా చెప్పుకోవచ్చు.

07/01/2017 - 00:23

న్యూఢిల్లీ, జూన్ 30: మార్కెట్‌లో జిఎస్‌టి ఆఫర్లు పోటెత్తాయి. శనివారం నుంచి దేశవ్యాప్తంగా వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమల్లోకి రావడంతో శుక్రవారం వినియోగదారులను ఆకట్టుకునే పనిలోపడ్డారు కన్స్యూమర్ డ్యూరబుల్ రిటైలర్లు. అర్ధరాత్రి నుంచే జిఎస్‌టి అమల్లోకి రాగా, దుకాణాల్లో పేరుకుపోయన నిల్వలను తగ్గించుకునేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నిం చారు.

07/01/2017 - 00:21

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన జిఎస్‌టి విధానంతో వస్తున్న ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తున్నట్లు హెరిటేజ్ ఫుడ్స్ వెల్లడించింది. ధూధ్‌పేడ, మిల్క్ కేక్‌ల ధర కిలో రూ. 350 నుంచి 320కి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పన్ను 14 శాతం నుంచి 12 శాతం తగ్గిన తర్వాత నెయ్యి, వెన్న ధర లీటరుకు 18 రూపాయలు తగ్గించినట్లు పేర్కొంది.

07/01/2017 - 00:20

న్యూఢిల్లీ, జూన్ 30: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)తో దేశ ఆర్థిక వ్యవస్థకు గొప్ప ప్రోత్సాహం లభిస్తుందని భారతీయ పరిశ్రమ అభిప్రాయపడింది. జిఎస్‌టితో భారత ఆర్థిక వృద్ధిరేటు పరుగులు పెట్టగలదన్న విశ్వాసాన్ని సిఐఐ, అసోచామ్, ఫిక్కీ, పిహెచ్‌డి చాంబర్ ఆఫ్ కామర్స్ వ్యక్తం చేశాయి. మరోవైపు జిఎస్‌టి పరిధిలోకి కోటి మంది ట్రేడర్లు, వ్యాపారులు వస్తారని అంచనా వేస్తోంది కేంద్రం.

06/30/2017 - 00:36

ముంబయి, జూన్ 29: గత రెండు రోజులుగా నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్పంగా కోలుకున్నాయి. ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం, విదేశీ పోర్ట్ఫులియో మదుపరులకు ఎంట్రీ నిబంధనలను సడలించనున్నట్లు సెబీ ప్రకటించడంతో పాటుగా ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ప్రారంభంనుంచే లాభాల బాటలో సాగాయి.

06/30/2017 - 00:35

న్యూఢిల్లీ, జూన్ 29: జూలై 1నుంచి దేశమంతటా ఒకే రకమైన వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) అమలులోకి రానుండడంతో గత నాలుగు రోజుల్లో ఇప్పటివరకు వ్యాట్, సేవా పన్ను, లేదా ఎక్సైజ్‌సుంకంలో కానీ రిజిస్టర్ చేసుకోని దాదాపు 1.6 లక్షల వ్యాపార సంస్థలు జిఎస్‌టి కోసం రిజిస్టర్ చేసుకున్నాయి.

06/30/2017 - 00:34

న్యూఢిల్లీ, జూన్ 29: న్యూఢిల్లీలో కన్నాట్ ప్లాజా రెస్టారెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (సిపిఆర్‌ఎల్) ఆధ్వర్యంలో నడుస్తున్న 43 మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్లను మూసివేస్తున్నారు. నగరంలో మొత్తం 55 మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్లు ఉండగా వీటిలో 43 ఔట్‌లెట్లను మూసి వేయనున్నట్లు సిపిఆర్‌ఎల్ బోర్డు సభ్యుడు విక్రమ్ బక్షీ తెలిపారు. సిపిఆర్‌ఎల్‌లో బక్షీ, ఆయన భార్య డైరెక్టర్లుగా ఉన్నారు.

Pages