S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/13/2020 - 06:11

న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి పరిస్థితి చక్కబడకపోతే.. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి వచ్చే ఆదాయం భారీగా తగ్గనున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో కేంద్రానికి గడ్డుకాలం తప్పకపోవచ్చని అంటున్నారు. కరోనా వైరస్ కారణంగా దేశంలోని పలు పరిశ్రమలు దారుణంగా దెబ్బతిన్నాయి.

03/13/2020 - 01:13

కరోనా వైరస్ గురువారం స్టాక్ మార్కెట్‌ను కుదిపేసింది. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెన్సెక్స్, జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ సూచీలు దారుణంగా పడిపోయాయి. కరోనా ప్రభావం తీవ్రమవుతున్న కొద్దీ బుల్ రన్‌కు దాదాపు బ్రేక్ పడుతూ, మార్కెట్లు బేర్ గుప్పిట్లోకి వెళ్లిపోతున్నాయి.

03/12/2020 - 06:52

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు కెనడా ముందుకొచ్చింది. స్మార్ట్ సిటీ, ఫార్మా రంగాల్లో పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కెనడా కాన్సుల్ జనరల్ నికోల్ గిరార్డ్, ఇతర ప్రతినిధులు కలుసుకుని రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలపై చర్చించారు. విద్య, వైద్యం,

03/12/2020 - 01:06

హైదరాబాద్ , మార్చి 11: దేశవ్యాప్తంగా తక్కువ కర్భన ఉద్ఘారాలు కలిగిన బీఎస్-6 ఇంధనాన్ని సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ శ్రవణ్ రావు తెలిపారు. బుధవారం సోమాజిగూడలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

03/11/2020 - 23:10

న్యూఢిల్లీ, మార్చి 11: దేశంలో 28,979 స్టార్టప్ కంపెనీలకు డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇం టర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) గుర్తింపు లభించినట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు.

03/11/2020 - 23:08

కరాద్‌లోని ఓ పౌల్ట్రీలో కోడిగుడ్లను సేకరిస్తున్న కార్మికుడు. చికెన్ కారణంగా కరోనా వైరస్ చాలా
సులభంగా వ్యాపిస్తుందని సోషల్ మీడియాలో కథనాలు పెరగడంతో చికెన్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ రంగంలో ఉత్పత్తి ఆశాజనకంగా ఉన్నప్పటికీ అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈ పరిశ్రమపై ఆధారపడిన వారంతా గగ్గోలు పెడుతున్నారు.

03/11/2020 - 23:05

ముంబయి, మార్చి 11: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో రిస్క్ సెంటిమెంట్‌దే పైచేయిగా ఉన్నప్పటికీ ఇండెక్స్‌లోని దిగ్గజ కంపెనీలకు విలువ ఆధారంగా మదుపరుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడం వల్ల మార్కెట్లు స్వల్ప లాభాలు ఆర్జించాయి.

03/11/2020 - 01:42

హైదరాబాద్, మార్చి 10: రాష్ట్ర ప్రభుత్వానికి పెను భారంగా మారిన రాజీవ్ సృగృహ ఇళ్లను ప్రభుత్వ ఉద్యోగులకు విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి విక్రయానికి విధివిధానాలను ఖరారు చేయడానికి గృహ నిర్మాణ శాఖకు ఇన్‌చార్జిగా ఉన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో మంగళవారం ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది.

03/11/2020 - 00:07

న్యూఢిల్లీ: పర్యావరణ కాలుష్యం పెరుగుతూ, రోజురోజుకూ కొత్త వైరస్‌లు వ్యాప్తి చెందుతున్న తరుణంలో విద్యుత్ వాహనాల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండనుంది. ఈ-వాహనాలకు దేశ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్నదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీటి వల్ల వినియోగదారులకు ఇంథన ఖర్చు తగ్గుతుంది. పర్యావరణ కాలుష్యాన్ని కొంత వరకైనా అరికట్టవచ్చు. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ఏ స్థాయికి చేరిందో అందరికీ తెలిసిన విషయమే.

03/10/2020 - 23:35

చెన్నై, మార్చి 10: టూరిజం స్టార్ట్‌ప్ సంస్థ బీలైవ్ ఎలక్ట్రికల్ వాహనాలను ప్రవేశపెట్టడం ద్వారా ఈ రంగానికి కొత్త శోభలను తీసుకొస్తున్నది. అందు లో భాగంగానే ఇప్పుడు తమిళనాడుకు తన మార్కెట్‌ను విస్తరించింది. ఊటీలో విద్యుత్ వాహనాల ద్వారా పర్యాటక రంగానికి ఈ కంపెనీ ఊతమిస్తున్నది. ఎలక్ట్రికల్ బైక్‌లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టడం ద్వారా కర్బన కాలుష్యాన్ని తగ్గించే దిశగా మరో అడుగు ముందుకేసింది.

Pages