S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/27/2017 - 00:27

న్యూఢిల్లీ, జూన్ 26: అమెరికా ఆటో రంగ దిగ్గజం జనరల్ మోటార్స్.. భారతీయ డీలర్లు మంగళవారం జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగుతున్నారు. ఈ ఏడాది చివరికల్లా భారత్‌లో వాహనాల అమ్మకాలను నిలిపివేయాలని జనరల్ మోటార్స్ నిర్ణయించింది. ఈ క్రమంలో డీలర్ల పెట్టుబడులకు నష్టపరిహారంగా దాదాపు 12 శాతం మాత్రమే ఇస్తామని జనరల్ మోటార్స్ ప్రకటించడంతో దాన్ని నిరసిస్తూ డీలర్లు ఆందోళన బాట పడుతున్నారు.

06/27/2017 - 00:26

న్యూఢిల్లీ, జూన్ 26: ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యే వీలుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగుస్తుండటం, వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తుండటం వంటివి మదుపరుల పెట్టుబడులను అమితంగా ప్రభావితం చేయవచ్చని మార్కెట్ విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు.

06/27/2017 - 00:25

న్యూఢిల్లీ, జూన్ 26: రఘురామ్ రాజన్‌కు తన హయాంలోనే డిప్యూటీ గవర్నర్ పదవి ఇస్తాం.. రండని ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మాజీ గవర్నర్ వైవి రెడ్డి తెలిపారు. ప్రస్తుత గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు ముందు 2013 సెప్టెంబర్ నుంచి 2016 సెప్టెంబర్ వరకు మూడేళ్లపాటు ఆర్‌బిఐ గవర్నర్‌గా రాజన్ పదవీ బాధ్యతలు నిర్వహించినది తెలిసిందే.

06/27/2017 - 00:21

వాషింగ్టన్/న్యూఢిల్లీ/హైదరాబాద్, జూన్ 26: భారతీయ వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలును అధ్యయనం చేయాలని అమెరికా బిజినెస్ స్కూళ్లకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్న మోదీ.. ఆదివారం వాషింగ్టన్‌లో మాట్లాడుతూ ఏళ్ల తరబడి కృషి ఫలితం జిఎస్‌టి అని అభివర్ణించారు. వచ్చే నెల 1 నుంచి దేశవ్యాప్తంగా జిఎస్‌టి అమల్లోకి వస్తున్నది తెలిసిందే. ఒకే దేశం..

06/27/2017 - 00:20

న్యూఢిల్లీ, జూన్ 26: విదేశీ మదుపరులు దేశీయ స్టాక్ మార్కెట్లలోకి 2008-17 మధ్య కాలంలో 124 బిలియన్ డాలర్ల పెట్టుబడులను తీసుకొచ్చారు. ఈ క్రమంలో పలు భారతీయ అత్యుత్తమ సంస్థల్లో పెద్ద ఎత్తున వాటాలనూ సొంతం చేసుకున్నారు. అయితే ఇదే సమయంలో దేశీయ మదుపరులు మాత్రం బంగారంపై పెట్టుబడులను భారీగా పెట్టారు. దాదాపు 300 బిలియన్ డాలర్ల విలువైన పుత్తడిని దక్కించుకున్నారు.

06/26/2017 - 00:34

న్యూఢిల్లీ, జూన్ 25: బ్యాంకుల్లోని సేఫ్ డిపాజిట్ లాకర్లలో ఉంచే సొమ్ముకు పూర్తి భద్రత ఉంటుందని, ఒక వేళ లాకర్లలో ఉంచిన సొమ్ము చోరీ అయినా నష్టపరిహారం లభిస్తుందని చాలామంది ధీమాగా ఉంటుంటారు. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని సేఫ్ డిపాజిట్ లాకర్లలో ఉంచిన సొమ్ముకు బ్యాంకుల బాధ్యత ఏమాత్రం ఉండదని లాకర్‌ను అద్దెకు తీసుకునే సమయంలో చేసుకునే అగ్రిమెంట్‌లోనే స్పష్టంగా ఉందట.

06/26/2017 - 00:32

హైదరాబాద్, జూన్ 25: వస్త్ర పరిశ్రమపై జిఎస్‌టి భారం మోపడాన్ని నిరసిస్తూ ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వస్త్ర పరిశ్రమ బంద్ పాటిస్తున్నట్లు తెలంగాణ వస్త్ర వ్యాపారుల సమాఖ్య ప్రకటించింది. వ్యవసాయ రంగం తర్వాత అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న వస్త్ర పరిశ్రమపై జిఎస్‌టి విధింపు పెను భారమవుతుందని సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది.

06/26/2017 - 00:32

హైదరాబాద్, జూన్ 25:జిఎస్‌టి అమలులోకి వచ్చిన తరువాత రాష్ట్ర ఆదాయంలో ఎలాంటి లోటు ఉండదని, గతంలో ఏ విధంగా ఆదాయం ఉందో అలానే ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఈనెల 30 నుంచి జిఎస్‌టి అమలులోకి వసుండగా, జిఎస్‌టి ప్రభావంపై అధికారులు అంచనాలు వేస్తున్నారు.

06/26/2017 - 00:31

చెన్నై, జూన్ 25: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలులోకి వచ్చిన తర్వాత దేశంలో నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతాయని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అభయమిచ్చారు. జిఎస్‌టి పరిధిలోకి వచ్చిన వస్తువులపై ప్రభుత్వం కొత్త పన్ను రేట్లేమీ విధించడం లేదని ఆమె స్పష్టం చేశారు. ‘జిఎస్‌టి అమలులోకి వచ్చిన తర్వాత నిత్యావసర సరుకుల ధరలేమీ పెరగవు.

06/26/2017 - 00:29

భీమవరం, జూన్ 25: గోదావరి జిల్లాల్లో మళ్లీ రొయ్యల సాగు ఊపందుకుంటోంది. ఎగుమతులకు ఎక్కువ అవకాశాలున్న ఆక్వాకల్చర్‌ను మరింత అభివృద్ధిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుండటంతో ఇటీవలి కాలంలో చెరువుల తవ్వకానికి అనుమతులు సులువుగానే లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నష్టదాయకంగా మారిన వరి సాగును వదిలేసి, ఆక్వావైపు రైతులు అడుగులు వేస్తున్నారు.

Pages